Political News

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇవి ఎవ‌రో విప‌క్ష నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌లు కావు. కాడి ప‌ట్టే.. కార్య‌క‌ర్త‌ల నుంచి మీడియా వ‌ర‌కు స‌ర్కారు పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కూడా సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌కు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అంద‌రూ మూకుమ్మ డిగా.. ఆల‌యాల‌కు వెళ్ల‌వ‌ద్దు.. భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌లిగించ‌వ‌ద్ద‌ని సూచించారు.

ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల‌కు మంత్రులు వ‌రుస పెట్టి వెళ్తున్న నేప‌థ్యంలో సాధార‌ణ భ‌క్తుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం మ‌రింత స‌మ‌యం ప‌డుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు చెప్పినా.. కీల‌క స‌మ‌యాల్లో అన్ని ఆల‌యాల‌కు కూడా.. ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయి. అయితే.. మంత్రులు మాత్రం.. వీటిని పెడ‌చెవిన పెడుతున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు స‌హా.. మంత్రుల‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా మంత్రులు ఒకేసారి సింహాద్రి అప్ప‌న్న ద‌ర్శ‌నానికి వెళ్లారు.

ఈ నెల 30న విశాఖ‌ జిల్లాలో ఉన్న సింహాద్రి అప్ప‌న్న ఆల‌యంలో చంద‌నోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే .. జ‌రిగే ఆ కార్య‌క్ర‌మానికి వారం నుంచే ఆల‌యంలో హ‌డావుడి పెరుగుతుంది. భ‌క్తుల రాక కూడా అలానే ఉంటుంది. పైగా.. అన్నిప‌రీక్ష‌లు అయిపోయి.. విద్యార్తులు సెల‌వులో ఉన్న నేప‌థ్యంలో ఈ రాక మరింత ఎక్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఒకేసారి బుధ‌వారం న‌లుగురు మంత్రులు.. వారి ప‌రివారం సింహాద్రి అప్ప‌న్న ద‌ర్శనానికి ఒకే సారి రావ‌డం గ‌మ‌నార్హం.

దీంతో సాధార‌ణ భ‌క్తులు.. ఎండ వేడిలోనే క్యూలైన్ల‌లో ఇరుక్కుపోయారు. పైగా.. క్యూలైన్ల‌కు తాళాలు కూడా వేసేయ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని.. మంత్రులు త‌ర‌చుగా కాకుండా.. ఎప్పుడైనా అవ‌స‌రం ఉంటేనే ఆల‌యాల‌కు వెళ్లాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అయినా.. మంత్రులు మార‌డం లేదు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో వైసీపీ మాజీ మంత్రి రోజా వారానికి రెండు సార్లు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఇప్పుడు టీడీపీ హ‌యాంలో ఓ మ‌హిళా మంత్రి కూడా.. అలానే చేస్తుండ‌డం పై విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు.

This post was last modified on April 16, 2025 4:54 pm

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

58 minutes ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

4 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

5 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

11 hours ago