ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని కొన్నాళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎవరో విపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు కావు. కాడి పట్టే.. కార్యకర్తల నుంచి మీడియా వరకు సర్కారు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అందరూ మూకుమ్మ డిగా.. ఆలయాలకు వెళ్లవద్దు.. భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.
ఇటీవల కాలంలో తిరుమలకు మంత్రులు వరుస పెట్టి వెళ్తున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సమయం పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెప్పినా.. కీలక సమయాల్లో అన్ని ఆలయాలకు కూడా.. ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అయితే.. మంత్రులు మాత్రం.. వీటిని పెడచెవిన పెడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చంద్రబాబు సహా.. మంత్రులపైనా విమర్శలు వస్తున్నాయి. తాజాగా మంత్రులు ఒకేసారి సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లారు.
ఈ నెల 30న విశాఖ జిల్లాలో ఉన్న సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే .. జరిగే ఆ కార్యక్రమానికి వారం నుంచే ఆలయంలో హడావుడి పెరుగుతుంది. భక్తుల రాక కూడా అలానే ఉంటుంది. పైగా.. అన్నిపరీక్షలు అయిపోయి.. విద్యార్తులు సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ రాక మరింత ఎక్కువగా ఉంది. అయినప్పటికీ.. ఒకేసారి బుధవారం నలుగురు మంత్రులు.. వారి పరివారం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఒకే సారి రావడం గమనార్హం.
దీంతో సాధారణ భక్తులు.. ఎండ వేడిలోనే క్యూలైన్లలో ఇరుక్కుపోయారు. పైగా.. క్యూలైన్లకు తాళాలు కూడా వేసేయడంతో బయటకు వచ్చేందుకు అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని.. మంత్రులు తరచుగా కాకుండా.. ఎప్పుడైనా అవసరం ఉంటేనే ఆలయాలకు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నారు. అయినా.. మంత్రులు మారడం లేదు. చిత్రం ఏంటంటే.. గతంలో వైసీపీ మాజీ మంత్రి రోజా వారానికి రెండు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు టీడీపీ హయాంలో ఓ మహిళా మంత్రి కూడా.. అలానే చేస్తుండడం పై విమర్శలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
This post was last modified on April 16, 2025 4:54 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…