Political News

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. దాదాపుగా 3 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి అయిన తర్వాత..కేబినెట్ మంత్రులతో చంద్రబాబు రాజకీయ అంశాలపై కీలక చర్చను చేపట్టారు. కూటమి సర్కారును అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైసీపీ వ్యవహరిస్తూనే ఉందని ఆరోపించిన చంద్రబాబు… వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే విషయంలో కూటమి పార్టీల మంత్రులు సత్తా చాటలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులుగా ఉండి…ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలిసి కూడా విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతే ఎలాగంటూ చంద్రబాబు మంత్రులను నిలదీశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇది సరిపోదు..మరింతగా శక్తిని కూడదీసుకోవాల్సిందే. వైసీపీని, ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందే. లేదంటే ప్రజలకు వాస్తవాలేమిటో తెలియవు. ఇదే అదనుగా వైసీపీ ప్రభుత్వంపై మరింతగా దుష్ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ చెప్పేదే నిజమని ప్రజలు నమ్ముతారు. ఇది చాలా ప్రమాదకరం. దీనికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట పడాలి. లేదంటే చాలా విపరిణామాలు చూడాల్సి వస్తుంది. దుష్ప్రచారంలో వైసీపీని మించిన పార్టీ మరొకటి లేదు. వైసీపీ వరుసబెట్టి ఆయా అంశాలను ఎంచకుంటోంది. తొలుత వక్ఫ్ బిల్లు, ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ మరణం, తాజాగా తిరుమల గోశాలలో గోవుల మరణాలు..ఇలా వైసీపీ దుష్ప్రచారాలను కంటిన్యూ చేస్తుంటే.. వాటిని అడ్డుకోవాలి కదా. ప్రస్తుతం ఒకరిద్దరు మాట్లాడుతున్నా… పూర్తి స్తాయిలో మన వెర్షన్ ప్రజలకు చేరడం లేదు. ఇకనైనా వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సిద్ధపడాలి” అని చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. 2014-19 మధ్యలో కూడా వైసీపీ విపక్షంలోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు టీడీపీ అధికారంలో ఉండగా.. ఇప్పుడు చేసిన మాదిరే నాడు కూడా వైసీపీ దుష్ప్రచారం చేసిందని ఆయన తెలిపారు. నాడు వైసీపీ దుష్ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోని వైనాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ఏమరపాటు కారణంగానే… జనాలను మభ్యపెట్టిన జగన్.. తన పార్టీని గెలిపించుకున్నారని, రాష్ట్రాన్ని విధ్వంసం బాట పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైసీపీ దుష్ప్రచారాన్ని గుర్తించి టీడీపీ తిప్పికొట్టగలిగి ఉంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీకి అపజయమన్న మాటే లేదని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతానుభవాలను గుర్తు చేసుకుని వైసీపీ కుట్రలకు ఆదిలోనే చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆ దిశగా మంత్రులంతా ప్రిపేర్ కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Satya

Recent Posts

హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…

18 minutes ago

హ్యాపీ దెబ్బకు ఆర్య బయటికి వస్తున్నాడు

మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…

24 minutes ago

నీట్ రీ ఎగ్జామ్… ఆ యాప్ బ్యాన్!

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…

54 minutes ago

చికిరిని చూసే కోణం మారిపోయింది

గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…

1 hour ago

కల్కి 2 కోసం ఆర్ఆర్ఆర్ సీత ?

ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…

3 hours ago

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

5 hours ago