Political News

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు టీటీడీ బోర్డు స‌భ్యుడు, బీజేపీ నాయ‌కుడు.. భాను ప్ర‌కాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేస్తామ‌ని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు చేయ‌డం ఇదే తొలిసారి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డం.. కేసు న‌మోదు చేయ‌డం కూడాఇదే తొలిసారి అవుతుంది.

ఏం జ‌రిగింది?

కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో భూమ‌న‌.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాల‌లో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగ‌లు మృతి చెందాయ‌ని.. దీనిని టీటీడీ బోర్దు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మ‌నోభావాల‌ను కూడా దెబ్బ‌తీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోల‌తో పాటు ఆయ‌న వరుస‌గా మీడియా స‌మావేశాలు పెట్టి మ‌రీ ఆరోపించారు. దీనిపై ప్ర‌స్తుత చైర్మ‌న్‌, ఈవోలు వివ‌ర‌ణ ఇచ్చారు.

అనారోగ్యం.. ఇత‌ర కార‌ణాల‌తో సాధార‌ణంగాఏ గోశాల‌లో అయినా..ఆవులు మృతి చెందుతాయ‌ని.. దీనిని రాజ‌కీయాల‌కు జోడించి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా .. రాజ‌కీయ అజెండాతో భూమ‌న వ్య‌వ‌హరిస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీ ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తుంద‌ని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాల‌తో పాటు.. గ‌త ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌ను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్ర‌కాష్ ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు అందించి.. కేసు న‌మోదు చేయాల‌ని కోరారు.

This post was last modified on April 15, 2025 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

58 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago