వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు.. భాను ప్రకాష్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేస్తామని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమనపై టీటీడీ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్పై ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం కూడాఇదే తొలిసారి అవుతుంది.
ఏం జరిగింది?
కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో భూమన.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాలలో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగలు మృతి చెందాయని.. దీనిని టీటీడీ బోర్దు నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోలతో పాటు ఆయన వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆరోపించారు. దీనిపై ప్రస్తుత చైర్మన్, ఈవోలు వివరణ ఇచ్చారు.
అనారోగ్యం.. ఇతర కారణాలతో సాధారణంగాఏ గోశాలలో అయినా..ఆవులు మృతి చెందుతాయని.. దీనిని రాజకీయాలకు జోడించి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా .. రాజకీయ అజెండాతో భూమన వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ఆయనపై ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలతో పాటు.. గత ఇంటెలిజెన్స్ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్రకాష్ ఎస్పీ హర్షవర్ధన్రాజుకు అందించి.. కేసు నమోదు చేయాలని కోరారు.
This post was last modified on April 15, 2025 2:10 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…