Political News

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు టీటీడీ బోర్డు స‌భ్యుడు, బీజేపీ నాయ‌కుడు.. భాను ప్ర‌కాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేస్తామ‌ని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు చేయ‌డం ఇదే తొలిసారి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డం.. కేసు న‌మోదు చేయ‌డం కూడాఇదే తొలిసారి అవుతుంది.

ఏం జ‌రిగింది?

కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో భూమ‌న‌.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాల‌లో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగ‌లు మృతి చెందాయ‌ని.. దీనిని టీటీడీ బోర్దు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మ‌నోభావాల‌ను కూడా దెబ్బ‌తీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోల‌తో పాటు ఆయ‌న వరుస‌గా మీడియా స‌మావేశాలు పెట్టి మ‌రీ ఆరోపించారు. దీనిపై ప్ర‌స్తుత చైర్మ‌న్‌, ఈవోలు వివ‌ర‌ణ ఇచ్చారు.

అనారోగ్యం.. ఇత‌ర కార‌ణాల‌తో సాధార‌ణంగాఏ గోశాల‌లో అయినా..ఆవులు మృతి చెందుతాయ‌ని.. దీనిని రాజ‌కీయాల‌కు జోడించి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా .. రాజ‌కీయ అజెండాతో భూమ‌న వ్య‌వ‌హరిస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీ ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తుంద‌ని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాల‌తో పాటు.. గ‌త ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌ను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్ర‌కాష్ ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు అందించి.. కేసు న‌మోదు చేయాల‌ని కోరారు.

This post was last modified on April 15, 2025 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

44 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago