వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు.. భాను ప్రకాష్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేస్తామని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమనపై టీటీడీ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్పై ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం కూడాఇదే తొలిసారి అవుతుంది.
ఏం జరిగింది?
కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో భూమన.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాలలో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగలు మృతి చెందాయని.. దీనిని టీటీడీ బోర్దు నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోలతో పాటు ఆయన వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆరోపించారు. దీనిపై ప్రస్తుత చైర్మన్, ఈవోలు వివరణ ఇచ్చారు.
అనారోగ్యం.. ఇతర కారణాలతో సాధారణంగాఏ గోశాలలో అయినా..ఆవులు మృతి చెందుతాయని.. దీనిని రాజకీయాలకు జోడించి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా .. రాజకీయ అజెండాతో భూమన వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ఆయనపై ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలతో పాటు.. గత ఇంటెలిజెన్స్ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్రకాష్ ఎస్పీ హర్షవర్ధన్రాజుకు అందించి.. కేసు నమోదు చేయాలని కోరారు.
This post was last modified on April 15, 2025 2:10 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…