Political News

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు టీటీడీ బోర్డు స‌భ్యుడు, బీజేపీ నాయ‌కుడు.. భాను ప్ర‌కాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేస్తామ‌ని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు చేయ‌డం ఇదే తొలిసారి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డం.. కేసు న‌మోదు చేయ‌డం కూడాఇదే తొలిసారి అవుతుంది.

ఏం జ‌రిగింది?

కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో భూమ‌న‌.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాల‌లో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగ‌లు మృతి చెందాయ‌ని.. దీనిని టీటీడీ బోర్దు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మ‌నోభావాల‌ను కూడా దెబ్బ‌తీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోల‌తో పాటు ఆయ‌న వరుస‌గా మీడియా స‌మావేశాలు పెట్టి మ‌రీ ఆరోపించారు. దీనిపై ప్ర‌స్తుత చైర్మ‌న్‌, ఈవోలు వివ‌ర‌ణ ఇచ్చారు.

అనారోగ్యం.. ఇత‌ర కార‌ణాల‌తో సాధార‌ణంగాఏ గోశాల‌లో అయినా..ఆవులు మృతి చెందుతాయ‌ని.. దీనిని రాజ‌కీయాల‌కు జోడించి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా .. రాజ‌కీయ అజెండాతో భూమ‌న వ్య‌వ‌హరిస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీ ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తుంద‌ని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాల‌తో పాటు.. గ‌త ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌ను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్ర‌కాష్ ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు అందించి.. కేసు న‌మోదు చేయాల‌ని కోరారు.

This post was last modified on April 15, 2025 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

55 minutes ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

4 hours ago