Political News

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు టీటీడీ బోర్డు స‌భ్యుడు, బీజేపీ నాయ‌కుడు.. భాను ప్ర‌కాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేస్తామ‌ని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు చేయ‌డం ఇదే తొలిసారి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డం.. కేసు న‌మోదు చేయ‌డం కూడాఇదే తొలిసారి అవుతుంది.

ఏం జ‌రిగింది?

కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో భూమ‌న‌.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాల‌లో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగ‌లు మృతి చెందాయ‌ని.. దీనిని టీటీడీ బోర్దు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మ‌నోభావాల‌ను కూడా దెబ్బ‌తీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోల‌తో పాటు ఆయ‌న వరుస‌గా మీడియా స‌మావేశాలు పెట్టి మ‌రీ ఆరోపించారు. దీనిపై ప్ర‌స్తుత చైర్మ‌న్‌, ఈవోలు వివ‌ర‌ణ ఇచ్చారు.

అనారోగ్యం.. ఇత‌ర కార‌ణాల‌తో సాధార‌ణంగాఏ గోశాల‌లో అయినా..ఆవులు మృతి చెందుతాయ‌ని.. దీనిని రాజ‌కీయాల‌కు జోడించి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా .. రాజ‌కీయ అజెండాతో భూమ‌న వ్య‌వ‌హరిస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీ ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తుంద‌ని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాల‌తో పాటు.. గ‌త ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌ను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్ర‌కాష్ ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు అందించి.. కేసు న‌మోదు చేయాల‌ని కోరారు.

This post was last modified on April 15, 2025 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…

16 minutes ago

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…

4 hours ago

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

4 hours ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

5 hours ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

12 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

14 hours ago