ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపించారు. వీరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే 120 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. తాజాగా సీఎం చంద్రబాబు.. ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేశారు. కొన్నాళ్లుగా దీనిపై అధ్యయనం చేయడంతోపాటు.. అంతర్గత వివాదాలు.. కుమ్ములాటలకు కొన్నాళ్ల కిందట చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు, కార్పొరేషన్ పదవుల్లో ఉన్నవారిని కూడా పక్కన పెట్టారు.
తాజాగా ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేసే క్రమంలో ఆరోపణలు వచ్చిన 248 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒక్క సంతకంతో పక్క నపెట్టారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. వీరంతా వైసీపీ హయాంలో నియమితులైన వారేనని ఎలాంటి విద్యార్హత లేని వారు.. సుమారు 80 మంది ఉన్నారని.. పదోతరగతి మాత్రమే చదివిన వారు 100 మంది ఉన్నారని.. మిగిలిన వారిలో చాలా మంది.. డిగ్రీడిస్ కంటిన్యూ చేసినవారేనని పేర్కొన్నారు. అయితే.. స్వల్పంగా పీజీ చేసినవారు కూడా ఉన్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ.. అప్పట్లో టీడీపీ విమర్శించింది.
ఇదిలావుంటే.. ఫైబర్ నెట్ వ్యవస్థ ద్వారా గ్రామ గ్రామానికి నెట్ను అనుసంధానం చేయడంతోపాటు తక్కువ ధరలకే.. నెట్ ఇవ్వడం, టీవీ చానెళ్లను వీక్షించే అవకాశం కల్పించడంతోపాటు ఫోన్ సదుపాయం కూడా ఉంది. నెలకు రూ.149 మాత్రమే కట్టుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫైబర్నెట్ కు రాష్ట్రంలో ఒకప్పుడు మంచి ఆదరణ ఉంది. అయితే.. వైసీపీ హయాంలో దీనిలో రాజకీయ నాయకుల ప్రభావం.. కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చిన ఫలితంగా ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీటినే ప్రక్షాళన చేస్తూ..చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on April 14, 2025 9:13 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…