ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది. నిత్యం ఎంతో బిజీగా ఉండే చంద్రబాబు.. ఏదైనా కార్యక్రమం కోసం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు.. అక్కడ ఆ పని ముగించుకుని నేరుగా తన నివాసానికో.. ఆఫీసుకో వచ్చేయడం సహజం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే పనిచేశారు. ఇక, ఎవరైనా మధ్యలో అడ్డు పడి ఆపి.. తమ ఆవేదన చెబితే మాత్రమే పట్టించుకునే పరిస్థితి ఉంటుంది.
కానీ, దీనికి విరుద్ధంగా సీఎం చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలో చేసిన పని ఆయనలోని నాయకుడి ని మరోసారి నిరూపించింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, పొన్నేకల్లులో చంద్రబాబు పర్యటించారు. అంబేడ్కర్ జయంతిని అక్కడే చేసుకున్నారు. అనంతరం తిరిగి వస్తుండగా.. పొన్నేకల్లు గ్రామం చివర్లో ఓ రేకుల చెడ్డు కింద బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ కనిపించారు. ఆమేమీ.. చంద్రబాబును చూసి బయటకురాలేదు. తనకు సాయం చేయాలని కూడా అడగలేదు.
కానీ, ఆమె నిర్వహిస్తున్న దుకాణం.. ఆమె ఉన్న తీరును గమనించిన చంద్రబాబు తనే స్వయంగా కాన్వాయ్ ను ఆపుకొని నేరుగా బడ్డీ కొట్టులోకి వెళ్లారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్డీ కొట్టు ద్వారా ప్రయోజనం లేదని ఆయనే చెబుతూ… దీనిని మరింత అభివృద్ధి చేయాలని ఆమెకు ఇల్లు, కుదిరి అర్హత ఉంటే పింఛను వంటివి కూడా సాయం చేయాలని కలెక్టర్ను స్వయంగా పిలిచి ఆదేశించారు.
నిజానికి అడిగితే కూడా.. సాయం అందించడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా ఉన్న ఈ రోజుల్లో ఇటవల కాలంలో చంద్రబాబు ఇలా.. ఆకస్మిక పర్యటనలతో పేదలను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ చర్యల పట్ట నెటిజన్లే కాదు.. వీడియో చూసిన వారు కూడా బాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. నాయకుడి లక్షణం ఇదే నంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on April 14, 2025 5:01 pm
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…