Political News

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేశారు. విదేశాల‌కు చెందిన వారు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో ఖ‌చ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంక‌ర్ ఇటీవ‌ల సింగ‌పూర్లో జ‌రిగిన అగ్రిప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంక‌ర్ కోలుకోవ‌డంతోపాటు.. సుర‌క్షితంగా ఇంటికి రావ‌డంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో తొలుత తిరుప‌తిలోనే ఆమె డిక్ల‌రేష‌న్‌(శ్రీవారిని విశ్వ‌సిస్తున్నాను. ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంది అని పేర్కొంటూ.. చేసే సంత‌కం. గ‌తంలో జ‌గ‌న్ ఈ విష‌యంలోనే ఇరుకుప‌డ్డారు) పై సంత‌కం చేశారు. అనంత‌రం.. నేరుగా ఆమె తిరుమ‌ల‌కు వెళ్లి శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. తొలుత గాయ‌త్రి నిల‌యం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్ర‌కారం.. అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంత‌రం.. భూవ‌రాహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఆ త‌ర్వాత క‌ల్యాణ క‌ట్ట‌కు వెళ్లి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ఆదివారం రాత్రికి తిరుమ‌ల‌లోనే బ‌స చేయ‌నున్న అన్నా లెజెనోవా.. సోమ‌వారం ఉద‌యం శ్రీవారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొంటారు. అనంత‌రం.. త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో భోజ‌నాల‌ను వ‌డ్డించ‌నున్నారు. అక్క‌డే ఆమె కూడా భోజ‌నం చేయ‌నున్నారు. మొక్కు చెల్లించుకోవ‌డంలో భాగంగానే అన్నా లెజెనోవా.. తిరుమ‌ల‌కు వ‌చ్చార‌ని జ‌న‌సేన పార్టీ తెలిపింది. కాగా.. ఆమె ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎవ‌రూ పాల్గొన‌రాద‌ని.. పార్టీ నిర్దేశించ‌డంతో ఆమె వెంట‌ కొంద‌రు అధికారులు మాత్ర‌మే ఉన్నారు.

This post was last modified on April 14, 2025 11:06 am

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago