Political News

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేశారు. విదేశాల‌కు చెందిన వారు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో ఖ‌చ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంక‌ర్ ఇటీవ‌ల సింగ‌పూర్లో జ‌రిగిన అగ్రిప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంక‌ర్ కోలుకోవ‌డంతోపాటు.. సుర‌క్షితంగా ఇంటికి రావ‌డంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో తొలుత తిరుప‌తిలోనే ఆమె డిక్ల‌రేష‌న్‌(శ్రీవారిని విశ్వ‌సిస్తున్నాను. ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంది అని పేర్కొంటూ.. చేసే సంత‌కం. గ‌తంలో జ‌గ‌న్ ఈ విష‌యంలోనే ఇరుకుప‌డ్డారు) పై సంత‌కం చేశారు. అనంత‌రం.. నేరుగా ఆమె తిరుమ‌ల‌కు వెళ్లి శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. తొలుత గాయ‌త్రి నిల‌యం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్ర‌కారం.. అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంత‌రం.. భూవ‌రాహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఆ త‌ర్వాత క‌ల్యాణ క‌ట్ట‌కు వెళ్లి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ఆదివారం రాత్రికి తిరుమ‌ల‌లోనే బ‌స చేయ‌నున్న అన్నా లెజెనోవా.. సోమ‌వారం ఉద‌యం శ్రీవారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొంటారు. అనంత‌రం.. త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో భోజ‌నాల‌ను వ‌డ్డించ‌నున్నారు. అక్క‌డే ఆమె కూడా భోజ‌నం చేయ‌నున్నారు. మొక్కు చెల్లించుకోవ‌డంలో భాగంగానే అన్నా లెజెనోవా.. తిరుమ‌ల‌కు వ‌చ్చార‌ని జ‌న‌సేన పార్టీ తెలిపింది. కాగా.. ఆమె ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎవ‌రూ పాల్గొన‌రాద‌ని.. పార్టీ నిర్దేశించ‌డంతో ఆమె వెంట‌ కొంద‌రు అధికారులు మాత్ర‌మే ఉన్నారు.

This post was last modified on April 14, 2025 11:06 am

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

2 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago