తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. విదేశాలకు చెందిన వారు, ఇతర మతాలను ఆచరించేవారు.. తిరుమలకు వచ్చినప్పుడు ఎలాంటి సంప్రదాయాలు పాటించాలో ఖచ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంకర్ కోలుకోవడంతోపాటు.. సురక్షితంగా ఇంటికి రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చారు.
ఈ క్రమంలో తొలుత తిరుపతిలోనే ఆమె డిక్లరేషన్(శ్రీవారిని విశ్వసిస్తున్నాను. ఆయనపై నమ్మకం ఉంది అని పేర్కొంటూ.. చేసే సంతకం. గతంలో జగన్ ఈ విషయంలోనే ఇరుకుపడ్డారు) పై సంతకం చేశారు. అనంతరం.. నేరుగా ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తొలుత గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్రకారం.. అధికారులు స్వాగతం పలికారు. అనంతరం.. ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం.. భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత కల్యాణ కట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఆదివారం రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న అన్నా లెజెనోవా.. సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. అనంతరం.. తరిగొండ వెంగమాంబ సత్రంలో భోజనాలను వడ్డించనున్నారు. అక్కడే ఆమె కూడా భోజనం చేయనున్నారు. మొక్కు చెల్లించుకోవడంలో భాగంగానే అన్నా లెజెనోవా.. తిరుమలకు వచ్చారని జనసేన పార్టీ తెలిపింది. కాగా.. ఆమె పర్యటనలో జనసేన కార్యకర్తలు, నాయకులు ఎవరూ పాల్గొనరాదని.. పార్టీ నిర్దేశించడంతో ఆమె వెంట కొందరు అధికారులు మాత్రమే ఉన్నారు.
This post was last modified on April 14, 2025 11:06 am
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…