Political News

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

“ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌ట్టేందుకే.. నేను రాజ‌కీయ‌ నాయ‌కుడిగా మారుతున్నా. జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తా. ఎవ‌రైనా జ‌గ‌న్ గురించి ఫిర్యాదు చేయాల‌ని అను కుంటే.. నిర్భ‌యంగా 7816020048 వాట్సాప్ నంబర్ కు స‌మాచారం పంపండి. నేను మీకు అండ‌గా ఉంటా. అంద‌రం క‌లిసి జ‌గ‌న్ భూతాన్ని జైల్లో పెడ‌దాం” అని ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి.. ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు (ఏబీవీ) తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త వైసీపీ హ‌యాంలో ఆయ‌న‌ను సీఎం జ‌గ‌న్ వేధించార‌ని.. త‌న ఐదేళ్ల స‌ర్వీసును దెబ్బ‌తీసి.. అన్యాయంగా స‌స్పెండ్ చేశార‌ని ఆయ‌న పేర్కొన్న విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు క్యాట్‌లో పోరాడి ఆయ‌న తిరిగి ఉద్యోగం పొందినా.. వైసీపీ హ‌యాంలో ఆయ‌న‌కు పోస్టింగు ఇచ్చిన‌ట్టే ఇచ్చి.. మ‌ళ్లీ స‌స్పెండ్ చేశారు. ఇలా.. వైసీపీ హ‌యాంలో అనేక అవ‌మానాలు పొందిన ఆయ‌న చివ‌ర‌కు రిటైర్మెంటు రోజు పోస్టింగ్ పొంది.. ఇలా వ‌చ్చి అలా రిటైర్ అయ్యారు. కాగా.. ప్ర‌స్తుతం ఆయ‌నను చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం స‌ల‌హాదారుగా నియ‌మించింది. పైగా.. వైసీపీ హ‌యాంలో స‌స్పెండ్ అయిన కాలానికి సంబంధించిన వేత‌నా లు.. బ‌కాయిలు కూడా.. వ‌డ్డీ వేసి మ‌రీ చెల్లించ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఏం జ‌రిగింది?

ఆదివారం సాయంత్రం కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి వ‌చ్చిన ఏబీవీ.. గ‌తంలో జ‌గ‌న్‌పై కోడికత్తి తో దాడి చేసి.. జైలు పాలై.. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్న శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. తాను కూడా అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. అనంత‌రం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. “రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరం అనిపించింది. ఇప్పుడే.. ఈ క్ష‌ణం నుంచే రాజకీయాల్లోకి వస్తున్న. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నా.“ అని వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ అక్ర‌మాల‌ను వెలికి తీస్తాన‌ని.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తాన‌ని ఏబీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


“జ‌గ‌న్ పైకి క‌నిపించేంత సౌమ్యుడు కాదు. ప‌క్కా దుర్మార్గుడు. ఆయ‌న చేసిన అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని బ‌య‌ట‌కు తెస్తా. కోడికత్తి శ్రీను లాంటి జగన్ బాధితులు వందలు, వేలల్లో ఉన్నారు. వాళ్లందరికీ అండగా ఉంటా. నా రాజ‌కీయ ప్రయాణాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాలి. నేను ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తా. ఏ ప‌ద‌వినీ ఆశించి రాజ‌కీయాలు చేయ‌ను. కేవలం జ‌గ‌న్ భ‌ర‌తం ప‌ట్టేందుకు.. మెరుగైన స‌మాజంలో ఇలాంటి వారిని ఏరేసేందుకు వ‌స్తున్నా“న‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జగన్ పై ఫిర్యాదు చేయాల‌ని అనుకునే వారికి ప్ర‌త్యేకంగా 7816020048 వాట్సాప్ నంబర్ ఇచ్చారు. నిర్భ‌యంగా ఈ నెంబ‌రు కు ఎలాంటి స‌మాచార‌న్న‌యినా పంచుకోవ‌చ్చ‌న్నారు. తాను గోప్యంగా ఉంచుతాన‌ని చెప్పారు.

Satya

Recent Posts

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

2 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

4 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

4 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

4 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

5 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

5 hours ago