Political News

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

“ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌ట్టేందుకే.. నేను రాజ‌కీయ‌ నాయ‌కుడిగా మారుతున్నా. జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తా. ఎవ‌రైనా జ‌గ‌న్ గురించి ఫిర్యాదు చేయాల‌ని అను కుంటే.. నిర్భ‌యంగా 7816020048 వాట్సాప్ నంబర్ కు స‌మాచారం పంపండి. నేను మీకు అండ‌గా ఉంటా. అంద‌రం క‌లిసి జ‌గ‌న్ భూతాన్ని జైల్లో పెడ‌దాం” అని ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి.. ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు (ఏబీవీ) తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త వైసీపీ హ‌యాంలో ఆయ‌న‌ను సీఎం జ‌గ‌న్ వేధించార‌ని.. త‌న ఐదేళ్ల స‌ర్వీసును దెబ్బ‌తీసి.. అన్యాయంగా స‌స్పెండ్ చేశార‌ని ఆయ‌న పేర్కొన్న విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు క్యాట్‌లో పోరాడి ఆయ‌న తిరిగి ఉద్యోగం పొందినా.. వైసీపీ హ‌యాంలో ఆయ‌న‌కు పోస్టింగు ఇచ్చిన‌ట్టే ఇచ్చి.. మ‌ళ్లీ స‌స్పెండ్ చేశారు. ఇలా.. వైసీపీ హ‌యాంలో అనేక అవ‌మానాలు పొందిన ఆయ‌న చివ‌ర‌కు రిటైర్మెంటు రోజు పోస్టింగ్ పొంది.. ఇలా వ‌చ్చి అలా రిటైర్ అయ్యారు. కాగా.. ప్ర‌స్తుతం ఆయ‌నను చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం స‌ల‌హాదారుగా నియ‌మించింది. పైగా.. వైసీపీ హ‌యాంలో స‌స్పెండ్ అయిన కాలానికి సంబంధించిన వేత‌నా లు.. బ‌కాయిలు కూడా.. వ‌డ్డీ వేసి మ‌రీ చెల్లించ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఏం జ‌రిగింది?

ఆదివారం సాయంత్రం కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి వ‌చ్చిన ఏబీవీ.. గ‌తంలో జ‌గ‌న్‌పై కోడికత్తి తో దాడి చేసి.. జైలు పాలై.. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్న శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. తాను కూడా అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. అనంత‌రం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. “రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరం అనిపించింది. ఇప్పుడే.. ఈ క్ష‌ణం నుంచే రాజకీయాల్లోకి వస్తున్న. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నా.“ అని వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ అక్ర‌మాల‌ను వెలికి తీస్తాన‌ని.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తాన‌ని ఏబీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


“జ‌గ‌న్ పైకి క‌నిపించేంత సౌమ్యుడు కాదు. ప‌క్కా దుర్మార్గుడు. ఆయ‌న చేసిన అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని బ‌య‌ట‌కు తెస్తా. కోడికత్తి శ్రీను లాంటి జగన్ బాధితులు వందలు, వేలల్లో ఉన్నారు. వాళ్లందరికీ అండగా ఉంటా. నా రాజ‌కీయ ప్రయాణాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాలి. నేను ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తా. ఏ ప‌ద‌వినీ ఆశించి రాజ‌కీయాలు చేయ‌ను. కేవలం జ‌గ‌న్ భ‌ర‌తం ప‌ట్టేందుకు.. మెరుగైన స‌మాజంలో ఇలాంటి వారిని ఏరేసేందుకు వ‌స్తున్నా“న‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జగన్ పై ఫిర్యాదు చేయాల‌ని అనుకునే వారికి ప్ర‌త్యేకంగా 7816020048 వాట్సాప్ నంబర్ ఇచ్చారు. నిర్భ‌యంగా ఈ నెంబ‌రు కు ఎలాంటి స‌మాచార‌న్న‌యినా పంచుకోవ‌చ్చ‌న్నారు. తాను గోప్యంగా ఉంచుతాన‌ని చెప్పారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

7 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

39 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

48 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago