మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి నారాలోకేష్ తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉండబట్టే అలా చేసినట్టు చెప్పారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నారా లోకేష్ శంకు స్థాపన చేశారు. అదేసమయంలో మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా పలువురికి పట్టాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. మంగళగిరి నియోజకవర్గం ప్రజలు తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారని తెలిపారు. వారి ప్రేమకు తాను ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా.. పరిష్కరించేందుకు ప్రయత్నించానని చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. రహదారుల విస్తరణ కూడా.. త్వరలోనే పూర్తవుతుందన్నారు.
గత 15 రోజుల వ్యవధిలోనే ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్టు నారా లోకేష్ తెలిపారు. ఈ భూముల విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని, ప్రభుత్వానికి కనీసంలో కనీసం.,. కోటి రూపాయల వరకు రిజిస్ట్రేషన్లు సొమ్ము వస్తుందని.. అయినా.. ఇక్కడి పేదలను ఆదుకునేందుకు ఆ సొమ్మును కూడా కట్టించకుండా ఉచితంగానే ప్రభుత్వ భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చినట్టు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, ఇది చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…