Political News

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగానే కాకుండా అఖండ రాజధానిగా తీర్చిదిద్దాలని కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే సేకరించిన 33 వేల ఎకరాల భూములకు అదనంగా మరో 30 వేల ఎకరాల సమీకరణకు దాదాపుగా ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో కూటమి సర్కారు అధికారికంగా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. 

2014లో తెలుగు నేల విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా నూతన ప్రస్థానం ప్రారంభించిన ఏపీకి దేశంలోని ఏ ఒక్క రాజధానికి తీసిపోని రాజధానిని నిర్మించాలన్న దిశగా చంద్రబాబు సాగారు. ఇందుకోసం విజయవాడ, గుంంటూరు మధ్యలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణం కోసం అంటూ భూములివ్వాలని చంద్రబాబు చేసిన ప్రకటనకు అమరావతి పరిధి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో 33 వేల ఎకరాల భూములను భూసేకరణ పద్ధతిలో కాకుండా భూ సమీకరణ పద్ధతిలో నాటి చంద్రబాబు సర్కారు సమీకరించింది. ఇందుకోసం రిటర్నబుల్ ప్లాట్ల పేరిట బాబు సర్కారు చేసిన ప్రతిపాదనపై రైతాంగం హర్షం ప్రకటించింది.

తాజాగా కూటమి సర్కారు అధికారంలోకి రాగా… తిరిగి మరోమారు ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని 10 నెలల కాలంలోనే ఓ దారిలో పెట్టేసిన చంద్రబాబు.. తాజాగా అమరావతిని అఖండ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఆయన ఆలోచన చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సమీకరించిన 33 వేల ఎకరాల్లో కోర్ కేపిటల్ ను ఏర్పాటు చేస్తుండగా… దానికి అనుబంధంగా కోర్ కేపిటల్ చుట్టూ మరో 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. కోర్ కేపిటల్ చుట్టూ నిర్మితం కానున్న ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అమరావతి అవసరాల మేరకు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన విమానాశ్రయం తదితరాల కోసం ఈ భూమిని వినియోగిచనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే భూమిని సేకరిస్తే మంచిదన్న భావనతోనే కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా 65 వేల ఎకరాల్లో నిర్మితం కానున్న అమరావతి నిజంగానే అఖండ రాజధానిగా రూపుదిద్దుకోనుందన్నవాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on April 13, 2025 5:47 pm

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

10 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

22 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

39 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

50 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

50 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 hour ago