మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు. ఆయన మాటే.. సెటైర్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాస-యాస కలగలిపి కుమ్మేయడంలో వెంకయ్యను మించిన నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన ఇదే పంథాలో ముందుకు సాగారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. `అధికారం పోయిందని కొందరు అల్లాడుతున్నారు“ అని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించారు. అధికారం శాశ్వత మని అనుకుంటారు. కానీ, ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పటి వరకు తనకు కూడా తెలియదని.. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. అనేక మంది తమకు మించిన పాలన అందించిన వారు లేరని బావిస్తారని.. కానీ.. అది కూడా అహంకారమేనని చెప్పారు.
ప్రజలకు సేవ చేయడంలోనే ముందుకు వస్తే.. అది ఎప్పటికీ విజయాన్ని తీసుకువస్తుందన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీనే ఉదాహరణగా పేర్కొన్నారు. ఉచితాలు ఇచ్చేసి.. ప్రజలను మభ్యపెట్టినా.. అది ఎంతో కాలం మనలేదని వైసీపీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇక, జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. జమిలి ఎన్నికల రాకతో భారతదేశ ముఖ చిత్రం మారిపోతుందన్నారు. ఖజానా కూడా ఆదా అవు తుందన్నారు. ఒకే సారి దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయన్నారు.
తద్వారా ఒకేసారి పాలన కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. దీనిని కొందరు వ్యతిరేక దృష్టితో చూస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలకు జమిలితో ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ప్రజలకు కూడా సమయం కలిసి వస్తుందని.. ఖజానాకు కూడా ఆదాయమేనని చెప్పారు. జమిలి విషయం అపోహలను ప్రచారం చేయొద్దని వెంకయ్యనాయుడు సూచించారు.
This post was last modified on April 12, 2025 2:07 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…