Political News

ఉచితాల‌తో మ‌భ్య‌పెట్టాల‌ని చూశారు: వెంక‌య్య కామెంట్స్‌

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కుడు ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు.. తాజాగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీ నేత‌ల‌పై సెట‌ర్లు గుప్పించారు. ఆయ‌న మాటే.. సెటైర్‌గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ప్రాస‌-యాస క‌ల‌గ‌లిపి కుమ్మేయ‌డంలో వెంక‌య్య‌ను మించిన నాయ‌కుడు లేరంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా ఆయ‌న ఇదే పంథాలో ముందుకు సాగారు. తిరుప‌తిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో శ‌నివారం ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ.. `అధికారం పోయింద‌ని కొంద‌రు అల్లాడుతున్నారు“ అని ప‌రోక్షంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికారం శాశ్వ‌త మ‌ని అనుకుంటారు. కానీ, ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు కూడా తెలియ‌ద‌ని.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక చూసి ఆశ్చ‌ర్య‌పోయిన సంద‌ర్భాలు ఉన్నాయ‌న్నారు. అనేక మంది త‌మ‌కు మించిన పాల‌న అందించిన వారు లేర‌ని బావిస్తార‌ని.. కానీ.. అది కూడా అహంకార‌మేన‌ని చెప్పారు.

ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలోనే ముందుకు వ‌స్తే.. అది ఎప్ప‌టికీ విజ‌యాన్ని తీసుకువ‌స్తుంద‌న్నారు. దీనికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు. ఉచితాలు ఇచ్చేసి.. ప్ర‌జ‌ల‌ను మ‌భ్యపెట్టినా.. అది ఎంతో కాలం మ‌న‌లేద‌ని వైసీపీపై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు. ఇక, జ‌మిలి ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావిస్తూ.. జ‌మిలి ఎన్నిక‌ల రాక‌తో భార‌తదేశ ముఖ చిత్రం మారిపోతుంద‌న్నారు. ఖ‌జానా కూడా ఆదా అవు తుంద‌న్నారు. ఒకే సారి దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్నారు.

త‌ద్వారా ఒకేసారి పాల‌న కూడా ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. దీనిని కొంద‌రు వ్య‌తిరేక దృష్టితో చూస్తున్నార‌ని వెంక‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రాంతీయ పార్టీల‌కు జ‌మిలితో ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు కూడా స‌మ‌యం క‌లిసి వ‌స్తుంద‌ని.. ఖ‌జానాకు కూడా ఆదాయమేన‌ని చెప్పారు. జ‌మిలి విష‌యం అపోహల‌ను ప్ర‌చారం చేయొద్ద‌ని వెంక‌య్య‌నాయుడు సూచించారు.

This post was last modified on April 12, 2025 2:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

20 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

54 minutes ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

4 hours ago