Political News

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ శనివారం ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని ఐడీ స్పష్టం చేశారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చనిపోయారని ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటిదాకా పలు రకాలుగా ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా ఐజీ ప్రకటించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిన మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని కూడా ఆయన తేల్చి చెప్పారు. ప్రవీణ్ ను హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్… ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను సవివరంగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఈ విషయాన్ని తన కుటుంబానికి తప్పించి మరో వ్యక్తికి తెలపలేదని చెప్పారు. మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పే మెంట్లు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో పలు మార్లు ఆగిన ప్రవీణ్… ఆరుగురు వ్యక్తులతో సంభాషించారని తెలిపారు. ఈ విషయాలను తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధృవీకరించుకున్నామని తెలిపారు. ఇక ప్రవీణ్ తన ప్రయాణంలో మద్యం సేవించారని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఐజీ తెలిపారు. 

ఇక ప్రవీణ్ పగడాల మృతదేహానికి చేసిన పోస్టుమార్టం నివేదిక కూడా వచ్చిందని… అందులోనూ రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లు తేలిందని ఐజీ తెలిపారు. విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన దూరంలో ఉన్న దాదాపుగా అన్ని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విచారణ సాగించామని తెలిపారు. ప్రవీణ్ ఆగిన ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా విచారణ సాగించామని తెలిపారు. విచారణలో ఏ ఒక్కరు కూడా ప్రవీణ్ మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. చివరకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. ఈ మొత్తం విచారణలో ప్రవీణ్ హత్యకు గురయ్యారన్న చిన్న క్లూ కూడా లభించలేదని, రోడ్డు ప్రమాదం కారణంగానే ఆయన చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.

This post was last modified on April 12, 2025 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

17 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

51 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago