Political News

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ శనివారం ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని ఐడీ స్పష్టం చేశారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చనిపోయారని ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటిదాకా పలు రకాలుగా ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా ఐజీ ప్రకటించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిన మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని కూడా ఆయన తేల్చి చెప్పారు. ప్రవీణ్ ను హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్… ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను సవివరంగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఈ విషయాన్ని తన కుటుంబానికి తప్పించి మరో వ్యక్తికి తెలపలేదని చెప్పారు. మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పే మెంట్లు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో పలు మార్లు ఆగిన ప్రవీణ్… ఆరుగురు వ్యక్తులతో సంభాషించారని తెలిపారు. ఈ విషయాలను తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధృవీకరించుకున్నామని తెలిపారు. ఇక ప్రవీణ్ తన ప్రయాణంలో మద్యం సేవించారని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఐజీ తెలిపారు. 

ఇక ప్రవీణ్ పగడాల మృతదేహానికి చేసిన పోస్టుమార్టం నివేదిక కూడా వచ్చిందని… అందులోనూ రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లు తేలిందని ఐజీ తెలిపారు. విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన దూరంలో ఉన్న దాదాపుగా అన్ని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విచారణ సాగించామని తెలిపారు. ప్రవీణ్ ఆగిన ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా విచారణ సాగించామని తెలిపారు. విచారణలో ఏ ఒక్కరు కూడా ప్రవీణ్ మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. చివరకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. ఈ మొత్తం విచారణలో ప్రవీణ్ హత్యకు గురయ్యారన్న చిన్న క్లూ కూడా లభించలేదని, రోడ్డు ప్రమాదం కారణంగానే ఆయన చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.

This post was last modified on April 12, 2025 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

23 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

2 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago