హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వినేశ్ ఫోగాట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆమె 2023లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 50 కిలోల కేటగిరీలో చివరి అంచుల్లో డిస్క్వాలిఫై అయినా కూడా పోరాటం చూసి బీజేపీ ప్రభుత్వం ఇది పెద్ద గౌరవంగా భావించినట్టు తెలుస్తోంది.
ఈ నిర్ణయం వెనుక మరో ఆసక్తికర అంశం ఉంది. వినేశ్ ఫోగాట్ ప్రస్తుతం హర్యానాలోని జులానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. అధికార బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేకు ఇంత భారీ మొత్తంలో నగదు బహుమతి ప్రకటించడం రాజకీయంగా చాలా అరుదైన విషయం. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇది క్రీడా ప్రతిభకు ఇచ్చే గౌరవమేనని, దీనికి రాజకీయ కోణం లేనని చెబుతోంది.
వినేశ్కు ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది.. ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం లేదా నగదు బహుమతి. ఆమె నగదు బహుమతినే ఎంచుకోవడంతో ప్రభుత్వం రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే ఇప్పుడు హర్యానాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, సాధారణంగా బహుమతులు అధికార పార్టీకి చెందిన క్రీడాకారులకు ఎక్కువగా అందుతాయి అనే విమర్శలు మధ్య, ఇది విరుద్ధ దిశలో తీసుకున్న నిర్ణయం కావడంతో ప్రశంసలు, విమర్శలు రెండూ వస్తున్నాయి.
వినేశ్ ఫోగాట్ వ్యక్తిగతంగా ఇప్పటికే ఒక స్థిర ఆర్థిక స్థితిలో ఉన్నవారు. ఆమెకు ఖార్ఖోడాలో రూ.2 కోట్ల విలువైన ఇల్లు, రెండు విలాసవంతమైన కార్లు.. మెర్సిడెస్ జీఎల్ఈ, వోల్వో ఎక్స్సీ60 ఉన్నట్టు సమాచారం. అలాగే ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. తన భర్త సోమ్వీర్ రాఠీ కూడా ఓ ప్రముఖ రెజ్లర్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతితో ఆమె రాజకీయ, క్రీడా ప్రస్థానం మరోసారి హైలైట్ అవుతోంది. కానీ అదే సమయంలో ఇది ఓ రాజకీయ వ్యూహమా? లేక నిజంగా క్రీడాకారులకు ఇచ్చే గౌరవమేనా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది.
This post was last modified on April 11, 2025 7:03 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…