Political News

కరోనా వేళ.. మరో రంగుల రచ్చలో ఏపీ సర్కార్?

మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. అత్యవసర వేళల్లో అందునా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా అవకాశం ఇవ్వటంతోపాటు..ఏపీ సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఈ మధ్యనే పంచాయితీ కార్యాలయాలకు ఏపీ అధికారపక్ష జెండా రంగుల్ని పోలి ఉండేలా రంగులు వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కాసిన్ని చురకలు వేయటమే కాదు.. రంగుల్ని మార్చాలంటూ ఆదేశాల్ని జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలోని అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగుల్ని వేశారన్న ఆరోపణలు ఇప్పుడు షురూ అయ్యాయి. ఈ వాదనకు బలం చేకూరేలా ఏపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులు వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలోని మెడికల్ కాలేజీలో కొన్ని అంబులెన్సుల్ని ఉంచారని.. వాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయటానికి ఉంచారన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీకీ రంగుల పిచ్చి ఏమిటంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ పబ్లిసిటీ పిచ్చేమిటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఆయన ఒక పోస్టును సంధించారు.
ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఈ తరహా రంగుల రచ్చకు ఏపీ అధికారపక్షం ఎందుకు అవకాశం ఇస్తుందన్నది ప్రశ్నగా మారింది. మరి.. ఈ ఆరోపణకు ఏపీ అధికారపక్షం ఎలాంటి బదులు ఇస్తుందో చూడాలి?

This post was last modified on April 30, 2020 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

2 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago