Political News

కరోనా వేళ.. మరో రంగుల రచ్చలో ఏపీ సర్కార్?

మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. అత్యవసర వేళల్లో అందునా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా అవకాశం ఇవ్వటంతోపాటు..ఏపీ సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఈ మధ్యనే పంచాయితీ కార్యాలయాలకు ఏపీ అధికారపక్ష జెండా రంగుల్ని పోలి ఉండేలా రంగులు వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కాసిన్ని చురకలు వేయటమే కాదు.. రంగుల్ని మార్చాలంటూ ఆదేశాల్ని జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలోని అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగుల్ని వేశారన్న ఆరోపణలు ఇప్పుడు షురూ అయ్యాయి. ఈ వాదనకు బలం చేకూరేలా ఏపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులు వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలోని మెడికల్ కాలేజీలో కొన్ని అంబులెన్సుల్ని ఉంచారని.. వాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయటానికి ఉంచారన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీకీ రంగుల పిచ్చి ఏమిటంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ పబ్లిసిటీ పిచ్చేమిటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఆయన ఒక పోస్టును సంధించారు.
ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఈ తరహా రంగుల రచ్చకు ఏపీ అధికారపక్షం ఎందుకు అవకాశం ఇస్తుందన్నది ప్రశ్నగా మారింది. మరి.. ఈ ఆరోపణకు ఏపీ అధికారపక్షం ఎలాంటి బదులు ఇస్తుందో చూడాలి?

This post was last modified on April 30, 2020 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

48 minutes ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

51 minutes ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

3 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

4 hours ago