మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. అత్యవసర వేళల్లో అందునా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా అవకాశం ఇవ్వటంతోపాటు..ఏపీ సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఈ మధ్యనే పంచాయితీ కార్యాలయాలకు ఏపీ అధికారపక్ష జెండా రంగుల్ని పోలి ఉండేలా రంగులు వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కాసిన్ని చురకలు వేయటమే కాదు.. రంగుల్ని మార్చాలంటూ ఆదేశాల్ని జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలోని అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగుల్ని వేశారన్న ఆరోపణలు ఇప్పుడు షురూ అయ్యాయి. ఈ వాదనకు బలం చేకూరేలా ఏపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన అంబులెన్సులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులు వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
విజయవాడలోని మెడికల్ కాలేజీలో కొన్ని అంబులెన్సుల్ని ఉంచారని.. వాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయటానికి ఉంచారన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీకీ రంగుల పిచ్చి ఏమిటంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ పబ్లిసిటీ పిచ్చేమిటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఆయన ఒక పోస్టును సంధించారు.
ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఈ తరహా రంగుల రచ్చకు ఏపీ అధికారపక్షం ఎందుకు అవకాశం ఇస్తుందన్నది ప్రశ్నగా మారింది. మరి.. ఈ ఆరోపణకు ఏపీ అధికారపక్షం ఎలాంటి బదులు ఇస్తుందో చూడాలి?
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…