తాజాగా టీడీపీ కార్యకర్త ఒకరు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగుచూడగానే.. ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. పరిస్థితి చేయి దాటకుండా చూసుకునే క్రమంలో సదరు కార్యకర్త చేబ్రోలు కిరణ్ను అరెస్టు చేయించడంతోపాటు.. సోషల్ మీడియా చట్టం కింద కేసులు కూడా పెట్టించింది.
ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోయిందని అనుకుంటున్న సమయంలో వైసీపీ వ్యూహత్మకంగా వ్యవహరిం చింది. వైఎస్ భారతికి భద్రత కల్పించాలని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ను ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని పేర్కొంటూ.. వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ద్వారా ఆ పార్టీ కీలక నాయకులు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
భారతిపై ఇప్పుడే కాదు.. గతంలోనూ టీడీపీ నాయకులు అనేక వ్యాఖ్యలు చేశారని.. ప్రస్తుతం కిరణ్ చేసిన వ్యాఖ్యలు.. అత్యంత దారుణంగా ఉన్నాయని.. కాబట్టి అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై ఉన్నత దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడంతోపాటు.. భారతికి ప్రభుత్వం వైపు నుంచి భద్రత కల్పిం చాలని కూడా హైకోర్టును కోరనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో గతంలో చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపైనా కోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో భారతికి రక్షణకు సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్రబుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చూడాలని వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్లో కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి 2+2 భద్రత కల్పించేలా ఆదేశించాలని ఆయన అభ్యర్థించనున్నట్టు తెలిసింది. ఈ పిటిషన్ను శుక్రవారం హైకోర్టులో దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేస్తుందో చూడాలి.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…