Political News

భార‌తికి భ‌ద్ర‌త‌.. హైకోర్టుకు వైసీపీ?

తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం వెలుగుచూడ‌గానే.. ప్ర‌భుత్వం వెంట‌నే రియాక్ట్ అయింది. ప‌రిస్థితి చేయి దాట‌కుండా చూసుకునే క్ర‌మంలో స‌ద‌రు కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్‌ను అరెస్టు చేయించ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియా చ‌ట్టం కింద కేసులు కూడా పెట్టించింది.

ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో ఆగిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రిం చింది. వైఎస్ భార‌తికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, ఆమెపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కిర‌ణ్‌ను ప్ర‌భుత్వం రక్షించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని పేర్కొంటూ.. వైసీపీ నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డి ద్వారా ఆ పార్టీ కీల‌క నాయ‌కులు హైకోర్టును ఆశ్ర‌యించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

భార‌తిపై ఇప్పుడే కాదు.. గ‌తంలోనూ టీడీపీ నాయ‌కులు అనేక వ్యాఖ్య‌లు చేశార‌ని.. ప్ర‌స్తుతం కిర‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు.. అత్యంత దారుణంగా ఉన్నాయ‌ని.. కాబ‌ట్టి అనుచిత వ్యాఖ్య‌లు, సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ఉన్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ చేయించ‌డంతోపాటు.. భార‌తికి ప్ర‌భుత్వం వైపు నుంచి భ‌ద్ర‌త క‌ల్పిం చాల‌ని కూడా హైకోర్టును కోర‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదేస‌మ‌యంలో గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌క‌పోవ‌డంపైనా కోర్టుకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో భార‌తికి ర‌క్ష‌ణ‌కు సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్ర‌బుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చూడాల‌ని వైసీపీ నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డి త‌న పిటిష‌న్‌లో కోరుతున్నారు. ప్ర‌భుత్వం నుంచి 2+2 భ‌ద్ర‌త క‌ల్పించేలా ఆదేశించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ పిటిష‌న్‌ను శుక్ర‌వారం హైకోర్టులో దాఖ‌లు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి కౌంట‌ర్ వేస్తుందో చూడాలి.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

4 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

5 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

5 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

5 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

7 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

8 hours ago