తాజాగా టీడీపీ కార్యకర్త ఒకరు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం వెలుగుచూడగానే.. ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. పరిస్థితి చేయి దాటకుండా చూసుకునే క్రమంలో సదరు కార్యకర్త చేబ్రోలు కిరణ్ను అరెస్టు చేయించడంతోపాటు.. సోషల్ మీడియా చట్టం కింద కేసులు కూడా పెట్టించింది.
ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోయిందని అనుకుంటున్న సమయంలో వైసీపీ వ్యూహత్మకంగా వ్యవహరిం చింది. వైఎస్ భారతికి భద్రత కల్పించాలని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ను ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని పేర్కొంటూ.. వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ద్వారా ఆ పార్టీ కీలక నాయకులు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
భారతిపై ఇప్పుడే కాదు.. గతంలోనూ టీడీపీ నాయకులు అనేక వ్యాఖ్యలు చేశారని.. ప్రస్తుతం కిరణ్ చేసిన వ్యాఖ్యలు.. అత్యంత దారుణంగా ఉన్నాయని.. కాబట్టి అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై ఉన్నత దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడంతోపాటు.. భారతికి ప్రభుత్వం వైపు నుంచి భద్రత కల్పిం చాలని కూడా హైకోర్టును కోరనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో గతంలో చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపైనా కోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో భారతికి రక్షణకు సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్రబుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చూడాలని వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్లో కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి 2+2 భద్రత కల్పించేలా ఆదేశించాలని ఆయన అభ్యర్థించనున్నట్టు తెలిసింది. ఈ పిటిషన్ను శుక్రవారం హైకోర్టులో దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేస్తుందో చూడాలి.
This post was last modified on April 11, 2025 2:52 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…