Political News

గిరిజ‌న ఓటుపై జ‌న‌సేన క‌స‌ర‌త్తు?

ఏపీలోని గిరిజ‌న ఓటు బ్యాంకుపై కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన జ‌న‌సేన పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోందా? ప్ర‌స్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్న గిరిజ‌న ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొంటే.. బ‌ల‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా.. భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. 2024 ఎన్నిక‌ల్లో తొలిసారి జ‌న‌సేన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం.

అస‌లు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకును బ‌దాబ‌ద‌లు చేయ‌డం.. విజ‌యం ద‌క్కిం చుకోవ‌డం అంటే.. సాధ్య‌మేనా? అనుకున్న స‌మ‌యంలో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోల‌వ‌రం గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిర్రి బాల‌రాజుకు టికెట్ ఇచ్చిన జ‌న‌సేన గెలుపు గుర్రం ఎక్కింది. అంతేకాదు.. ఈ విష‌యంపై అన్ని కోణాల్లోనూ అధ్య‌య‌నం కూడా చేసింది. గిరిజ‌న ప్రాబ‌ల్య నియోజ‌క‌వ‌ర్గంలోవిజ‌యం ద‌క్కించుకునేందుకు ఉన్న మార్గాల‌ను అన్వేషించింది.

ప్ర‌స్తుతం గిరిజ‌న నియోజ‌క‌వర్గాల‌లో వైసీపీ ఓటుబ్యాంకు ఎక్కువ‌గా ఉంది. కాంగ్రెస్‌కు ప‌దిలంగా ఉన్న ఓటు బ్యాంకును వైసీపీ త‌న‌కు బ‌ద‌లాయించుకోవ‌డంతో 2014, 2019లోనూ.. ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఒక్క పోల‌వ‌రం మాత్ర‌మే 2014లో టీడీపీకి ద‌క్కింది. ఆ త‌ర్వాత‌.. అక్క‌డ కూడా పార్టీ ఓడిపోయింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం కొంత తేడా వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు మాత్రం ఎక్క‌డా చెద‌ర‌లేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌న‌సేన ఆ యా నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

సెంటిమెంటు+ అభివృద్ధి ఈ రెండు అంశాల‌ను ప్రామాణికంగా తీసుకున్న జ‌న‌సేన ఆదిశగా అడుగులు వేసింది. అందుకే.. ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించి.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఇది ప‌క్కా రాజ‌కీయ వ్యూహంతోనే ఆయ‌న వేసిన అడుగులుగా.. విశ్లేష‌కులు చెబుతున్నారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఇదే త‌ర‌హాలో జన‌సేన వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తే.. వైసీపీకి క‌లిసి వ‌స్తున్న గిరిజ‌న ఓటు బ్యాంకు ఇక‌పై జ‌న‌సేన‌కు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 18, 2025 11:21 am

Share

Recent Posts

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

40 seconds ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

4 minutes ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago