వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైైరల్ అవుతోంది. ఐటీటీడీపీ బహిష్కృత యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ పై గోరంట్ల మాధవ్ దాడి చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఏకంగా పోలీసు వాహనాన్ని ఆపి మరీ ఆ వాహనంలో నుంచి కిరణ్ ను బయటకు లాగేందుకు యత్నించిన మాధవ్.. అది సాధ్యం కాకపోవడంతో.. జీపులోనే కూర్చున్న కిరణ్ ను జీపు బయటే ఉండి మాధవ్ భౌతిక దాడి చేశారు ఈ సందర్భంగా యూనిఫామ్ లో ఉన్న ఓ పోలీసు, మఫ్టీలో ఉన్న మరో పోలీసుతో పాటు ఇద్దరు అనుచరులు నిలువరించే యత్నం చేసినా మాధవ్ దూసుకెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి,.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిప అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను టీడీపీ బహిష్కరించింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. అన్నీ చట్టబద్ధంగానే జరుగుతుండగా… మాధవ్ ఎంట్రీ ఇచ్చి కిరణ్ పై దాడి చేసి ఈ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడి చేయడం అంటే… తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. అది కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రదాన గేటు సమీపంలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లోకి రాకముందు గోరంట్ల మాధవ్ ఓ పోలీసు అధికారిగా.. పోలీసు అధికారుల సంఘం ప్రతినిధిగా, ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. నాడు ఓ పోలీసు శాఖపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయగా… వాటికి కౌంటర్ ఇచ్చిన మాధవ్ ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఆపై జగన్ నుంచి పిలుపు అందుకున్న మాధవ్ ఏకంగా రాజకీయాల్లోకి వచ్చేసి హిందూపురం ఎంపీగా విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఐదేళ్లు ఎంపీగా పనిచేశారు. అయినా కూడా ఓ వీధి రౌడి మాదిరిగా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించిన మాధవ్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.
This post was last modified on April 10, 2025 7:37 pm
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక…
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం…
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…