వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైైరల్ అవుతోంది. ఐటీటీడీపీ బహిష్కృత యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ పై గోరంట్ల మాధవ్ దాడి చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఏకంగా పోలీసు వాహనాన్ని ఆపి మరీ ఆ వాహనంలో నుంచి కిరణ్ ను బయటకు లాగేందుకు యత్నించిన మాధవ్.. అది సాధ్యం కాకపోవడంతో.. జీపులోనే కూర్చున్న కిరణ్ ను జీపు బయటే ఉండి మాధవ్ భౌతిక దాడి చేశారు ఈ సందర్భంగా యూనిఫామ్ లో ఉన్న ఓ పోలీసు, మఫ్టీలో ఉన్న మరో పోలీసుతో పాటు ఇద్దరు అనుచరులు నిలువరించే యత్నం చేసినా మాధవ్ దూసుకెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి,.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిప అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను టీడీపీ బహిష్కరించింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. అన్నీ చట్టబద్ధంగానే జరుగుతుండగా… మాధవ్ ఎంట్రీ ఇచ్చి కిరణ్ పై దాడి చేసి ఈ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడి చేయడం అంటే… తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. అది కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రదాన గేటు సమీపంలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లోకి రాకముందు గోరంట్ల మాధవ్ ఓ పోలీసు అధికారిగా.. పోలీసు అధికారుల సంఘం ప్రతినిధిగా, ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. నాడు ఓ పోలీసు శాఖపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయగా… వాటికి కౌంటర్ ఇచ్చిన మాధవ్ ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఆపై జగన్ నుంచి పిలుపు అందుకున్న మాధవ్ ఏకంగా రాజకీయాల్లోకి వచ్చేసి హిందూపురం ఎంపీగా విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఐదేళ్లు ఎంపీగా పనిచేశారు. అయినా కూడా ఓ వీధి రౌడి మాదిరిగా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించిన మాధవ్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.
This post was last modified on April 10, 2025 7:37 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…