నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న విషయాన్ని కూడా అసభ్యతతో చెలరేగిపోయారు. గొడవలు, కక్షలు, ఫ్యాక్షనిజాలను రెచ్చగొలట్లేలా వ్యాఖ్యలూ చేశారు. ఏం చేసినా ఫరవా లేదన్నభావన విస్తృతంగానే వినిపించింది. అయితే ఒక్కటంటే ఒక్క రోజులోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. సంబంధం లేని వారే కాదు…సంబంధమున్నా కూడా అవతలి వారిపై నోరు పారేసుకోవాలంటే ఏపీలో ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోక తప్పదు. ఈ మార్పునకు కేవలం రెండంటే రెండు ఘటనలే కారణంగా నిలిచాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిమిషాల్లో వైరల్ అయిపోగా.. వైసీపీ శ్రేణులు కూడా గట్టిగానే స్పందించాయి. ఏమైందో తెలియదు గాని,… భారతి రెడ్డిని అసభ్య పద జాలంతో దూషించిన నోటీతోనే కిరణ్ క్షమాపణలు చెప్పారు. అదంతా బుధవారం రాత్రి జరిగితే… గురువారం ఉదయానికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కిరణ్ వ్యవహారం గురించి తెలిసిన టీడీపీ అధిష్ఠానం కిరణ్ ను ఐటీడీపీ నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా కిరణ్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఫలితంగా ఐటీడీపీ నుంచి బహిష్కరణకు గురైన గంటల వ్యవధిలోనే కిరణ్ అరెస్టయ్యారు.
ఇదిలా ఉంటే… రెండు రోజుల క్రితం ఏలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెచ్చగొగ్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న వారందరినీ గుర్తు పెట్టుకుంటామన్న కారుమూరి… వైసీపీ అధికారంలోకి రాగానే వారి బదులు తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు ఇవతల ఇళ్ల నుంచి బయలకు లాగి కొడతామన్న కారుమూరి… గుంటూరు అవతల బయటకు లాగి నరికేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయ్యింది. తాజాగా కిరణ్ వ్యవహారం నేపథ్యంలో కారుమూరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి ఈ వ్యవహారంలో కారుమూరిని పోలీసులు అరెస్టు చేస్తారో, లేదో చూడాలి. మొత్తంగా ఈ రెండు ఘటనల ద్వారా ఏపీలో చాలా మంది నోళ్లకు తాళం పడిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 10, 2025 6:27 pm
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…