వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మాధవ్ ను అడ్డుకున్న పోలీసులు… అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోరంట్లను అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు ప్రకటించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే అరెస్టైన నిందితుడిపై దాడి చేసేందుకు మాధవ్ యత్నించారు. అయితే అప్పటికే మాధవ్ తీరును గమనిస్తూ వచ్చిన పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేశారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా… ఐటీడీపీ నుంచి కిరణ్ ను టీడీపీ సస్పెండ్ చేసింది. కిరణ్ పై కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి.. కిరణ్ ను గురువారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడిని గుంటూరులోని ఎస్పీ కార్యాయానికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాధవ్… కిరణ్ పై దాడి చేయాలని బరిలోకి దిగారు. గతంలో పోలీసు అదికారిగా పనిచేసిన తన బుర్రకు పదును పెట్టిన మాధవ్.. కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించారు. దానిని తన వాహనంతో వెంబడించారు. మార్గమధ్యంలోనే పోలీసు వాహనాన్ని ఆపి కిరణ్ పై దాడి చేయాలని గోరంట్ల భావించినట్లుగా సమాచారం. అయితే అప్పటికే మాధవ్ ను గమనించిన మంగళగిరి పోలీసులు ఆ అవకాశాన్ని మాధవ్ కు ఇవ్వకుండా చాకచక్యంగా కిరణ్ ను గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి క్షేమంగానే చేర్చారు.
అయితే అప్పటికే కిరణ్ పై దాడి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్న మాధవ్.. తానున్నది ఎస్పీ కార్యాలయమా, లేదంటే ఇతర ప్రదేశమా? అన్న విచక్షణను కోల్పోయినట్లున్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనం నుంచి దిగి.. పోలీసు భద్రత మధ్య వెళుతున్న కిరణ్ పై గోరంట్ల దాడికి యత్నించారు. అయితే ఈ పరిణామం ఏధో జరుగుతుందని గ్రహించిన పోలీసులు గోరంట్లను నిలువరించారు. అంతేకాకుండా ఎస్పీ కార్యాలయంలోనే… పోలీసు భద్రత మధ్య ఉన్న నిందితుడి పైనే దాడి చేస్తారా? అన్న భావనతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని జిల్లా ఎస్పీకి వివరించి గోరంట్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన గోరంట్లకు ఏ తరహా శిక్ష పడుతుందో చూడాలి.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…