వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాకాణి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 రోజుల పాటుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా… కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న కాకాణిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసునే కొట్టివేయాలంటూ కాకాణి దాఖలు చేసిన మరో పిటిషన్ పై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. వెరసి ఈ కేసులో కాకాణి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దానిని తరలించి ఏకంగా రూ.250 కోట్ల మేర అక్రమార్జనను కూడబెట్టారంటూ కాకాణి, ఆయన అనుచరులపై పొదలకూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కాకాణి అనుచరుల్లో ముగ్గురికి ఇదివరకే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న కాకాణితో పాటు మరికొందరికి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. కాకాణి మాదిరే ఆయన అల్లుడు కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టేశారు. దీంతో కాకాణితో పాటు ఆయన అల్లుడిని కూడా అరెస్టు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.
కోర్టులో ఎలాగూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, తప్పనిసరిగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందన్న నమ్మకంతో పోలీసుల విచారణకు కాకాణి డుమ్మా కొడుతున్నట్లుగా సమాచారం. అయితే బుధవారం కోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను కొట్టేయడంతో కాకాణికి షాక్ తగిలినట్టైంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కాకాణికి కాపాడుకునే దిశగా వైసీపీ కూడా ఆయనకు న్యాయపరమైన సహాయాన్ని అందిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు కాకాణి బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన తరుణంలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం, అయితే అప్పటిదాకా పోలీసులు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కనీసం నోటీసులు తీసుకోవడంలోనే తమను ముప్పు తిప్పలు పెట్టిన కాకాణికి మరింత సమయం ఇచ్చేది లేదన్న దిశగా పోలీసులు సాగుతున్నారు. వెరసి కాకాణి అరెస్టు తప్పదా అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on April 9, 2025 5:23 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…