Political News

గాయపడ్డ కొడుకును చేరిన పవన్.. తాజా పరిస్థితేంటి?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం దుస్సాధ్యమే. మంగళవారం ఉదయం చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే… అతడిని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గానీ తన కళ్లతో చూడలేకపోయారు. బుధవారం ఉదయం పవన్ కుమారుడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. మరో 3 రోజుల పాటు అతడికి ఆసుపత్రిలో చికిత్స జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.

మంగళవారం రాత్రి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్…బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూశారు. ఎలాగూ భావోద్వేగాలను అణచుకోవడంలో ఓ రేంజి పరిణతి సాధించిన పవన్.. ఆసుపత్రి బెడ్ పై తన కుమారుడిని చూసి… ఒకింత సాంత్వన చెందారని చెప్పక తప్పదు. కాసేపు కుమారుడిని చూసుకున్న పవన్.. ఆ తర్వాత శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో శంకర్ కు చేతులు, కాళ్లకు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ గాయాలు మానిపోయేటివే అయినా… ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప పొగ వల్ల ఎదురయ్యే ఇబ్బందిపై పవన్ ఆందోళన చెందుతున్నారు.

మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మార్క్ శంకర్ ను వైద్యులు ఐసీయూలోనే ఉంచారు. బుధవారం ఉదయం అతడిని సాధారణ గదికి తరలించారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి ఏ మేర పొగ చేరింది? దానిని తొలగించడం ఎలా? అందుకోసం అనుసరించాల్సిన వైద్య పద్ధుతులు ఏమిటి? పొగను తొలగించినా మార్క్ శంకర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి? అన్న దానిపై వైద్యులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కు బ్రాంకో స్కోపీ చేసిన వైద్యులు.. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి గానీ ఆ నివేదిక అందదని తెలుస్తోంది. ఈ నివేదిక అందిన తర్వాత తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న దానిపై వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

This post was last modified on April 9, 2025 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

40 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago