జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం దుస్సాధ్యమే. మంగళవారం ఉదయం చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే… అతడిని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గానీ తన కళ్లతో చూడలేకపోయారు. బుధవారం ఉదయం పవన్ కుమారుడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. మరో 3 రోజుల పాటు అతడికి ఆసుపత్రిలో చికిత్స జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.
మంగళవారం రాత్రి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్…బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూశారు. ఎలాగూ భావోద్వేగాలను అణచుకోవడంలో ఓ రేంజి పరిణతి సాధించిన పవన్.. ఆసుపత్రి బెడ్ పై తన కుమారుడిని చూసి… ఒకింత సాంత్వన చెందారని చెప్పక తప్పదు. కాసేపు కుమారుడిని చూసుకున్న పవన్.. ఆ తర్వాత శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో శంకర్ కు చేతులు, కాళ్లకు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ గాయాలు మానిపోయేటివే అయినా… ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప పొగ వల్ల ఎదురయ్యే ఇబ్బందిపై పవన్ ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మార్క్ శంకర్ ను వైద్యులు ఐసీయూలోనే ఉంచారు. బుధవారం ఉదయం అతడిని సాధారణ గదికి తరలించారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి ఏ మేర పొగ చేరింది? దానిని తొలగించడం ఎలా? అందుకోసం అనుసరించాల్సిన వైద్య పద్ధుతులు ఏమిటి? పొగను తొలగించినా మార్క్ శంకర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి? అన్న దానిపై వైద్యులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కు బ్రాంకో స్కోపీ చేసిన వైద్యులు.. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి గానీ ఆ నివేదిక అందదని తెలుస్తోంది. ఈ నివేదిక అందిన తర్వాత తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న దానిపై వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
This post was last modified on April 9, 2025 11:30 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…