Political News

గాయపడ్డ కొడుకును చేరిన పవన్.. తాజా పరిస్థితేంటి?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం దుస్సాధ్యమే. మంగళవారం ఉదయం చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే… అతడిని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గానీ తన కళ్లతో చూడలేకపోయారు. బుధవారం ఉదయం పవన్ కుమారుడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. మరో 3 రోజుల పాటు అతడికి ఆసుపత్రిలో చికిత్స జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.

మంగళవారం రాత్రి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్…బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూశారు. ఎలాగూ భావోద్వేగాలను అణచుకోవడంలో ఓ రేంజి పరిణతి సాధించిన పవన్.. ఆసుపత్రి బెడ్ పై తన కుమారుడిని చూసి… ఒకింత సాంత్వన చెందారని చెప్పక తప్పదు. కాసేపు కుమారుడిని చూసుకున్న పవన్.. ఆ తర్వాత శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో శంకర్ కు చేతులు, కాళ్లకు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ గాయాలు మానిపోయేటివే అయినా… ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప పొగ వల్ల ఎదురయ్యే ఇబ్బందిపై పవన్ ఆందోళన చెందుతున్నారు.

మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మార్క్ శంకర్ ను వైద్యులు ఐసీయూలోనే ఉంచారు. బుధవారం ఉదయం అతడిని సాధారణ గదికి తరలించారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి ఏ మేర పొగ చేరింది? దానిని తొలగించడం ఎలా? అందుకోసం అనుసరించాల్సిన వైద్య పద్ధుతులు ఏమిటి? పొగను తొలగించినా మార్క్ శంకర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి? అన్న దానిపై వైద్యులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కు బ్రాంకో స్కోపీ చేసిన వైద్యులు.. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి గానీ ఆ నివేదిక అందదని తెలుస్తోంది. ఈ నివేదిక అందిన తర్వాత తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న దానిపై వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

This post was last modified on April 9, 2025 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

46 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago