జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం దుస్సాధ్యమే. మంగళవారం ఉదయం చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే… అతడిని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గానీ తన కళ్లతో చూడలేకపోయారు. బుధవారం ఉదయం పవన్ కుమారుడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. మరో 3 రోజుల పాటు అతడికి ఆసుపత్రిలో చికిత్స జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.
మంగళవారం రాత్రి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్…బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూశారు. ఎలాగూ భావోద్వేగాలను అణచుకోవడంలో ఓ రేంజి పరిణతి సాధించిన పవన్.. ఆసుపత్రి బెడ్ పై తన కుమారుడిని చూసి… ఒకింత సాంత్వన చెందారని చెప్పక తప్పదు. కాసేపు కుమారుడిని చూసుకున్న పవన్.. ఆ తర్వాత శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో శంకర్ కు చేతులు, కాళ్లకు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ గాయాలు మానిపోయేటివే అయినా… ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప పొగ వల్ల ఎదురయ్యే ఇబ్బందిపై పవన్ ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మార్క్ శంకర్ ను వైద్యులు ఐసీయూలోనే ఉంచారు. బుధవారం ఉదయం అతడిని సాధారణ గదికి తరలించారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి ఏ మేర పొగ చేరింది? దానిని తొలగించడం ఎలా? అందుకోసం అనుసరించాల్సిన వైద్య పద్ధుతులు ఏమిటి? పొగను తొలగించినా మార్క్ శంకర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి? అన్న దానిపై వైద్యులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కు బ్రాంకో స్కోపీ చేసిన వైద్యులు.. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి గానీ ఆ నివేదిక అందదని తెలుస్తోంది. ఈ నివేదిక అందిన తర్వాత తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న దానిపై వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
This post was last modified on April 9, 2025 11:30 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…