Political News

‘పెండింగ్’ వస్తే కూటమి పంట పండినట్టే!

కేంద్ర ప్రభుత్వం వద్ద వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ లో అలా ఏళ్ల తరబడి ఉంటూనే ఉంటాయి. ఖజానా ఖాళీ అయినప్పుడో,లేదంటే తెలివి కలిగిన నేత సీఎంగా వస్తే…ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదిస్తూ ఉంటాయి. తాము పంపిన ఆయా అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నాయని… కాస్తంత పెద్ద మనసు చేసుకుని వాటిని పరిష్కరించాలని కోరుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒకటికి పది సార్లు ఆయా రాష్ట్రాలు అడిగితే కేంద్రం కూడా లేదు పొమ్మని చెప్పలేదు కదా. ఇదే ఫార్ములాతో ఏపీలోని కూటమి సర్కారు కదులుతోంది. స్లోగానే అయినా తెలివిగా పావులు కదుపుతున్న కూటమి సర్కారు కేంద్రం నుంచి రావాల్సిన వాటిని ఇట్టే రాబట్టేస్తోంది. వెరసి ఆశించిన దాని కంటే కూడా అదిక మొత్తం లోనే కేంద్రం నుంచి నిధులను సాధించుకుంటోంది.

ఈ వ్యూహంలో భాగంగా ఆయా కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ అంశాలను ఏపీ బయటకు తీస్తోంది. వాటిలో ఒక్కో దానిని ఒక్కోసారి అన్నట్లుగా కేంద్రం వద్ద ప్రతిపాదిస్తోంది. ఎన్డీఏలో ఎలాగూ కూటమిలోని కీలక భాగస్వామిగా టీడీపీ, మరో బలమైన మిత్రపక్షంగా జనసేన కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి కేబినెట్ మంత్రులు అడిగినంతనే కేంద్రం నుంచి ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్ పనులు ఇట్టే పూర్తి అయిపోతున్నాయి. ఆయా పథకాలకు సంబందించిన నిధుల్లోనూ మెజారిటీ వాటాను కూడా ఏపీ సాధిస్తోంది. దీనికి జల జీవన్ మిషన్ కింద ఏపీకి వచ్చిన నిధులే నిదర్శనం. 

తాజాగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వంట గ్యాస్ సబ్సీడీ పథకం ఉజ్వల్ యోజన కింద రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించని విషయాన్ని నాదెండ్ల ప్రస్తావించారు. చాలా కాలంగా ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా పెండింగ్ లో ఏపీకి సంబంధించిన 65.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కనెక్షన్లకు ఉజ్వల్ యోజన పథకాన్ని వర్తింపజేయాలని నాదెండ్ల కేంద్ర మంత్రిని కోరారు.

నాదెండ్ల వినతికి హర్ దీప్ సింగ్ పురి నుంచి సానుకూల స్పందనే లభించినట్టు ఈ భేటీ తర్వాత నాదెండ్ల తెలిపారు. ఈ కనెక్షన్లకు ఉజ్వల్ పథకం వర్తింపుతో ఏపీకి లాభమేమిటన్న విషయానికి వస్తే… ఈ కనెక్షన్లన్నింటికీ ఉజ్వల్ యోజన వర్తిస్తే… ఏపీకి ఏటా రూ.580 కోట్ల మేర సబ్సీడీ నిధులు వస్తాయట. ప్రస్తుతం ఏపీలోని కూటమి సర్కారు ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగానే పంపిణీ చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఈ పథకాన్నే కూటమి సర్కారు అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఉజ్వల్ పథకం పెండింగ్ అంశాన్ని కేంద్రం పరిష్కరిస్తే… ఏడాదికి రూ.580 కోట్ల నిధులు రాష్ట్రానికి వస్తే,.. ఉచిత గ్యాస్ పథకానికి ఇక ఢోకానే ఉండదన్న వాదన వినిపిస్తోంది.

This post was last modified on April 9, 2025 7:20 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

4 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

5 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

5 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

7 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

7 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

9 hours ago