జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం పవన్ పెద్ద కుమారుడు అకీరా నందన్ జన్మదినం కాగా… అదే రోజు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని గాయపడ్డారు. ఇదే విషయాన్ని మంగళవారం రాత్రి విశాఖలో మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కాకతాళీయమో, ఏమో తెలియదు గానీ… నా పెద్ద కొడుకు పుట్టిన రోజే చిన్న కొడుక్కి ప్రమాదం జరిగింది అంటూ పవన్ ఒకింత గద్గద స్వరంతో చెప్పారు. సోమవారం ఇవాళ రాత్రికి తాను సింగపూర్ వెళుతున్నానని, ప్రస్తుతం తన చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, కొన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, వాటి రిపోర్టులు వస్తే తప్పించి అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి ఏ మేర ఇబ్బంది కలిగిందన్నది తెలుస్తుందని ఆయన చెప్పారు.
అగ్ని ప్రమాదంలో తన కుమారుడు గాయపడ్డాడని తెలిసిన దాని కంటే కూడా ఈ ప్రమాదంలో ఓ బాలిక చనిపోయిన వైనం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పవన్ చెప్పారు. ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడ్డారన్న పవన్ వారిలో తన కుమారుడు కూడా ఒకరని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని, ఆమె తల్లిదండ్రులను తలచుకుంటుంటే చాలా బాధగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అగ్ని ప్రమాదంలో ఎగసిన పొగను పీల్చిన కారణంగా తన కుమారుడికి కొంతమేర ఇబ్బంది ఉందని తెలిసిందన్న పవన్… ఈ ప్రభావం తన కుమారుడిపై సుదీర్ఘ కాలం ఉంటుందేమోనన్న భయం ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్రాంకోస్కోపి జరుగుతోందని, ఆ నివేదిక వస్తే గానీ ఆ ప్రభావం ఏ మేర ఉంటుందో తెలియదని చెప్పారు. ప్రమాదంలో కాలిన గాయాలు అయితే అయ్యాయని, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తన సతీమణి అన్నా లెజినోవా షాక్ కు గురైందని, సరిగ్గా మాట్లాడలేకపోతోందని తెలిపారు.
ఇక తాను సాయంత్రం దాకా అరకు పర్యటనలో గిరిజన ప్రాంతాల పర్యటనలో ఉన్నానని చెప్పిన పవన్… తన కుటుంబ సభ్యులతో ఈ ప్రమాదం గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదని తెలిపారు. తన సోదురుడు చిరంజీవితో కలిసి సింగపూర్ వెళుతున్నారా? అన్న మీడియా ప్రశ్నలకు లేదని పవన్ సమాధానం చెప్పారు. అంతేకాకుండా తన సోదరుడితోనూ ఈ ప్రమాదం గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదని తెలిపారు. పిల్లలతోనూ ఇప్పటికీ మాట్లాడలేదన్న పవన్ చెప్పారు. సింగపూర్ లాంటి ప్రాంతాల్లో అది కూడా పాఠశాలల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించేదేనని పవన్ అభిప్రాయపడ్డారు. తన కుమారుడు ప్రమాదం గురించి తనకు సంఘీభావం తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on April 8, 2025 7:54 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…