ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ప్రైవేట్ ఆసుపత్రులు విరమించుకున్నాయి. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే వైద్య సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) సోమవారం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు గత ఏప్రిల్ నుంచి భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించలేమని ఆషా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని ఆషా పాక్షికంగా అమలు చేసింది కూడా.
ఇలాంటి క్రమంలో ఆషాకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. నేరుగా సీఎం నుంచే పిలుపు రావడంతో సోమవారం ఆషా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, కార్యదర్శి అవినాశ్, ఇతర ముఖ్యులు నాగమల్లేశ్వరరావు, ఆయుష్ రమేశ్ లు అమరావతిలోని సచివాలయానికి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపు ఎంత ప్రాదాన్యం కలిగిన అంశమో చంద్రబాబు వారికి వివరించారు. అదే సమయంలో నెలల తరబడి బిల్లుల చెల్లింపు లేకుండా సేవల కొనసాగింపు కూడా కష్టమేనని కూడా చంద్రబాబు అన్నారు. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలని ఆయన వారిని కోరారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా… బకాయిల్లో ఓ రూ.500 కోట్లను వీలయినంత త్వరలో విడుదల చేస్తామని చంద్రబాబు ఆషా సభ్యులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి ఈ హామీ వచ్చినంతనే ఆషా అక్కడికక్కడే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ఉపసంహరించుకోవాలని ఆ సంఘం తీర్మానించింది. చంద్రబాబు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆషా కార్యదర్శి అక్కడే మీడియాకు ఈ విషయాన్నివెల్లడించారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. వెరసి ఒక్క మాటతో చంద్రబాబు… ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపునకు మార్గం సుగమం చేశారు.
This post was last modified on April 8, 2025 8:16 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…