ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ప్రైవేట్ ఆసుపత్రులు విరమించుకున్నాయి. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే వైద్య సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) సోమవారం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు గత ఏప్రిల్ నుంచి భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించలేమని ఆషా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని ఆషా పాక్షికంగా అమలు చేసింది కూడా.
ఇలాంటి క్రమంలో ఆషాకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. నేరుగా సీఎం నుంచే పిలుపు రావడంతో సోమవారం ఆషా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, కార్యదర్శి అవినాశ్, ఇతర ముఖ్యులు నాగమల్లేశ్వరరావు, ఆయుష్ రమేశ్ లు అమరావతిలోని సచివాలయానికి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపు ఎంత ప్రాదాన్యం కలిగిన అంశమో చంద్రబాబు వారికి వివరించారు. అదే సమయంలో నెలల తరబడి బిల్లుల చెల్లింపు లేకుండా సేవల కొనసాగింపు కూడా కష్టమేనని కూడా చంద్రబాబు అన్నారు. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలని ఆయన వారిని కోరారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా… బకాయిల్లో ఓ రూ.500 కోట్లను వీలయినంత త్వరలో విడుదల చేస్తామని చంద్రబాబు ఆషా సభ్యులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి ఈ హామీ వచ్చినంతనే ఆషా అక్కడికక్కడే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ఉపసంహరించుకోవాలని ఆ సంఘం తీర్మానించింది. చంద్రబాబు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆషా కార్యదర్శి అక్కడే మీడియాకు ఈ విషయాన్నివెల్లడించారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. వెరసి ఒక్క మాటతో చంద్రబాబు… ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపునకు మార్గం సుగమం చేశారు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…