ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ప్రైవేట్ ఆసుపత్రులు విరమించుకున్నాయి. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే వైద్య సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) సోమవారం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు గత ఏప్రిల్ నుంచి భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించలేమని ఆషా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని ఆషా పాక్షికంగా అమలు చేసింది కూడా.
ఇలాంటి క్రమంలో ఆషాకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. నేరుగా సీఎం నుంచే పిలుపు రావడంతో సోమవారం ఆషా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, కార్యదర్శి అవినాశ్, ఇతర ముఖ్యులు నాగమల్లేశ్వరరావు, ఆయుష్ రమేశ్ లు అమరావతిలోని సచివాలయానికి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపు ఎంత ప్రాదాన్యం కలిగిన అంశమో చంద్రబాబు వారికి వివరించారు. అదే సమయంలో నెలల తరబడి బిల్లుల చెల్లింపు లేకుండా సేవల కొనసాగింపు కూడా కష్టమేనని కూడా చంద్రబాబు అన్నారు. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలని ఆయన వారిని కోరారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా… బకాయిల్లో ఓ రూ.500 కోట్లను వీలయినంత త్వరలో విడుదల చేస్తామని చంద్రబాబు ఆషా సభ్యులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి ఈ హామీ వచ్చినంతనే ఆషా అక్కడికక్కడే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ఉపసంహరించుకోవాలని ఆ సంఘం తీర్మానించింది. చంద్రబాబు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆషా కార్యదర్శి అక్కడే మీడియాకు ఈ విషయాన్నివెల్లడించారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. వెరసి ఒక్క మాటతో చంద్రబాబు… ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపునకు మార్గం సుగమం చేశారు.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…