Political News

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం చూసి తాను క‌రిగిపోయాన‌ని చెప్పారు. తాజాగా అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని మ‌న్యంలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. అడ‌వి త‌ల్లిబాట‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌నుల సంప్ర‌దాయ నృత్యాలు, వారి సంస్కృతిని ప‌రిశీలించారు. అదేస‌మ‌యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ(ఒక‌ప్పుడు న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతం)లో ప‌లు రోడ్ల నిర్మాణానికి శంకు స్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా సోమ‌వారం సాయంత్రం గిరిజ‌నుల‌తో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఔదార్యం చూసి తాను క‌రిగిపోయాన‌ని చెప్పారు. గిరిజ‌న ప్రాంతాల్లో అడ‌వి బిడ్డ‌లు.. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా.. డోలీ క‌ట్టుకుని న‌గ‌రాలకు వ‌స్తున్నారు. నేను అనేక సంద‌ర్భాల్లో ఈ వార్త‌లు చూశా. చ‌లించిపోయా. ఏదైనా చేయాల‌ని సంక‌ల్పించా. కానీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఈ స‌మ‌స్య‌పై లోతుగా చ‌ర్చించా. ర‌హ‌దారుల నిర్మాణం ఒక్క‌టే మార్గ‌మ‌ని.. నిర్ణ‌యించుకున్నా. ఆ వెంట‌నే చంద్ర‌బాబును క‌లిసి.. స‌మ‌స్య చెప్పా అని తెలిపారు.

గిరిజ‌న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబునుకోరిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. అయితే.. త‌న విజ్ఞ‌ప్తిని విన్న చంద్ర‌బాబు.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా.. వెంట‌నే 49 కోట్ల రూపాయ‌లు మంజూరు చేశారని తెలిపారు. 24 గంట‌ల్లో అవి ఖాతాల్లోకి ప‌డ్డాయన్నారు. ఆయ‌న ఔదార్యాన్ని చూసి త‌న మ‌న‌సు క‌రిగిపోయింద‌న్నారు. గిరిజ‌నులకు భౌతిక మైన విద్య లేక‌పోవ‌చ్చ‌ని.. కానీ, వారు నిపుణుల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కొనియాడారు. అనేక రూపాల్లో వారి క‌ళ‌లు ప్రాశ‌స్త్యం పొందుతున్నాయ‌న్నారు. అయితే.. వారికి కొంత సాయం చేస్తే..మ‌రింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఇప్పుడు తాను చేస్తున్న ప్ర‌య‌త్నం కూడా.. అదేన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. గిరిజ‌న‌ ప్రాంతంలో రోడ్లు బాగుండాలని.. ఆ దిశ‌గా తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు. వైసీపీ హ‌యాంలో ర‌హ‌దారులు గోతుల మ‌యంగా ఉండేవ‌ని.. ఐదేళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేశార‌ని.. దీంతో ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డ్డార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ దుయ్య‌బ‌ట్టారు. తాము కేవలం ఏడాదిలోపే 1,500 కోట్లు ఖ‌ర్చు పెట్టి ర‌హ‌దారుల‌ను నిర్మిస్తున్న‌ట్టు వివ‌రించారు.

This post was last modified on April 8, 2025 5:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

4 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

5 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

5 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

7 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

7 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

9 hours ago