జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి పుత్రులకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే బృహత్కార్యం ‘అడవి తల్లి బాట’ను ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం జరిగిన సోమవారమే పవన్ కారణంగా 30 మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. విశాఖలో పవన్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ను నిలిపివేయగా. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు వెళుతున్న విద్యార్థుల్లో 30 మంది సకాలంలో పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్నది ఆ ప్రచారం సారాంశం. ఈ వార్తల్లో లేశమాత్రం కూడా వాస్తవం లేదని విశాఖ నగర పోలీసులు సోమవారం రాత్రికే తేల్చి పారేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసు శాఖ సమగ్ర వివరాలతో ఓ విస్పష్ట ప్రకటనను విడుదల చేసింది.
విశాఖ సిటీ పోలీస్ ప్రకటన ప్రకారం… జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు సోమవారమే ప్రారంభం కాలేదు. ఈ నెల 2 నుంచే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జేఈఈ అడ్మిట్ కార్డుల్లోని నిబంధనల మేరకు విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఉదయం 8.30 గంటకు పరీక్షా కేంద్రం గేట్లను అధికారులు మూసివేస్తారు. అంటే 8.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు..అయితే సోమవారం విశాఖలో పవన్ కాన్వాయ్ ఆ దారి మీదుగా ఉదయం 8.41 గంటలకు వెళ్లింది. అంటే.. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరాల్సిన గడువు ముగిసిన తర్వాతే ఆ ప్రాంతం మీదుగా పవన్ కాన్వాయ్ వెళ్లింది. అంటే.. పవన్ కాన్వాయ్ కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్న మాటలో వాస్తవం లేదు.
ఇక సోమవారం నాడు సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్న పరీక్షా కేంద్రానికి రోజు మాదిరే సోమవారం కూడా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి పరీక్షలు మొదలు కాగా..సదరు కేంద్రంలో పరీక్ష జరిగిన నాలుగు వరుస రోజుల్లో ప్రతి రోజు 81, 65, 76, 61 మంది చొప్పున పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇక సోమవారం నాటి పరీక్షకు కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ గైర్హాజరీ అంకెలన్నీ ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన వారితో కలుపుకుని లెక్కించినవే. ఈ లెక్కన సోమవారం నాటి పరీక్షకు 30 మంది విద్యార్థుల గైర్హాజరుకు పవన్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. ఇక ఈ పరీక్షా కేంద్రం ఉన్న గోపాలపట్నం, పెందుర్తి జంక్షన్లలో ఉదయం 8.30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయలేదని కూడా పోలీసులు వెల్లడించారు.
This post was last modified on April 7, 2025 9:36 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…