Political News

ఇది నిజం!… పవన్ విద్యార్థులకు అడ్డమే రాలేదు!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి పుత్రులకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే బృహత్కార్యం ‘అడవి తల్లి బాట’ను ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం జరిగిన సోమవారమే పవన్ కారణంగా 30 మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. విశాఖలో పవన్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ను నిలిపివేయగా. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు వెళుతున్న విద్యార్థుల్లో 30 మంది సకాలంలో పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్నది ఆ ప్రచారం సారాంశం. ఈ వార్తల్లో లేశమాత్రం కూడా వాస్తవం లేదని విశాఖ నగర పోలీసులు సోమవారం రాత్రికే తేల్చి పారేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసు శాఖ సమగ్ర వివరాలతో ఓ విస్పష్ట ప్రకటనను విడుదల చేసింది.

విశాఖ సిటీ పోలీస్ ప్రకటన ప్రకారం… జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు సోమవారమే ప్రారంభం కాలేదు. ఈ నెల 2 నుంచే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జేఈఈ అడ్మిట్ కార్డుల్లోని నిబంధనల మేరకు విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఉదయం 8.30 గంటకు పరీక్షా కేంద్రం గేట్లను అధికారులు మూసివేస్తారు. అంటే 8.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు..అయితే సోమవారం విశాఖలో పవన్ కాన్వాయ్ ఆ దారి మీదుగా ఉదయం 8.41 గంటలకు వెళ్లింది. అంటే.. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరాల్సిన గడువు ముగిసిన తర్వాతే ఆ ప్రాంతం మీదుగా పవన్ కాన్వాయ్ వెళ్లింది. అంటే.. పవన్ కాన్వాయ్ కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్న మాటలో వాస్తవం లేదు.

ఇక సోమవారం నాడు సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్న పరీక్షా కేంద్రానికి రోజు మాదిరే సోమవారం కూడా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి పరీక్షలు మొదలు కాగా..సదరు కేంద్రంలో పరీక్ష జరిగిన నాలుగు వరుస రోజుల్లో ప్రతి రోజు 81, 65, 76, 61 మంది చొప్పున పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇక సోమవారం నాటి పరీక్షకు కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ గైర్హాజరీ అంకెలన్నీ ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన వారితో కలుపుకుని లెక్కించినవే. ఈ లెక్కన సోమవారం నాటి పరీక్షకు 30 మంది విద్యార్థుల గైర్హాజరుకు పవన్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. ఇక ఈ పరీక్షా కేంద్రం ఉన్న గోపాలపట్నం, పెందుర్తి జంక్షన్లలో ఉదయం 8.30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయలేదని కూడా పోలీసులు వెల్లడించారు.

This post was last modified on April 7, 2025 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago