Political News

ఇది నిజం!… పవన్ విద్యార్థులకు అడ్డమే రాలేదు!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి పుత్రులకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే బృహత్కార్యం ‘అడవి తల్లి బాట’ను ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం జరిగిన సోమవారమే పవన్ కారణంగా 30 మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. విశాఖలో పవన్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ను నిలిపివేయగా. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు వెళుతున్న విద్యార్థుల్లో 30 మంది సకాలంలో పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్నది ఆ ప్రచారం సారాంశం. ఈ వార్తల్లో లేశమాత్రం కూడా వాస్తవం లేదని విశాఖ నగర పోలీసులు సోమవారం రాత్రికే తేల్చి పారేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసు శాఖ సమగ్ర వివరాలతో ఓ విస్పష్ట ప్రకటనను విడుదల చేసింది.

విశాఖ సిటీ పోలీస్ ప్రకటన ప్రకారం… జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు సోమవారమే ప్రారంభం కాలేదు. ఈ నెల 2 నుంచే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జేఈఈ అడ్మిట్ కార్డుల్లోని నిబంధనల మేరకు విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఉదయం 8.30 గంటకు పరీక్షా కేంద్రం గేట్లను అధికారులు మూసివేస్తారు. అంటే 8.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు..అయితే సోమవారం విశాఖలో పవన్ కాన్వాయ్ ఆ దారి మీదుగా ఉదయం 8.41 గంటలకు వెళ్లింది. అంటే.. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరాల్సిన గడువు ముగిసిన తర్వాతే ఆ ప్రాంతం మీదుగా పవన్ కాన్వాయ్ వెళ్లింది. అంటే.. పవన్ కాన్వాయ్ కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్న మాటలో వాస్తవం లేదు.

ఇక సోమవారం నాడు సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్న పరీక్షా కేంద్రానికి రోజు మాదిరే సోమవారం కూడా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి పరీక్షలు మొదలు కాగా..సదరు కేంద్రంలో పరీక్ష జరిగిన నాలుగు వరుస రోజుల్లో ప్రతి రోజు 81, 65, 76, 61 మంది చొప్పున పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇక సోమవారం నాటి పరీక్షకు కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ గైర్హాజరీ అంకెలన్నీ ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన వారితో కలుపుకుని లెక్కించినవే. ఈ లెక్కన సోమవారం నాటి పరీక్షకు 30 మంది విద్యార్థుల గైర్హాజరుకు పవన్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. ఇక ఈ పరీక్షా కేంద్రం ఉన్న గోపాలపట్నం, పెందుర్తి జంక్షన్లలో ఉదయం 8.30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయలేదని కూడా పోలీసులు వెల్లడించారు.

Satya

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

59 minutes ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

2 hours ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

3 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

3 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

3 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago