Political News

రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమ‌రావ‌తిని క‌నెక్ట్ చేయ‌డం లేదు. దాదాపు 50 కిలో మీట‌ర్ల మేర‌కు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం.. అమ‌రావ‌తికి నేరుగా క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది.

దీనిలో భాగంగా తెలంగాణ నుంచి వ‌చ్చే వారి కోసం.. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం- గుంటూరు జిల్లా నంబూరుల మ‌ధ్య కొత్త రైలు లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా రావ‌డంతో ఇప్పుడు చ‌క‌చ‌కా ప‌నులు ప్రారంభించేందుకు స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో  అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ భూముల్లో నంబూరులోని కొంత వ‌ర‌కు.. ప్ర‌భుత్వ స్థలం ఉంది. దీంతో భూసేక‌ర‌ణ‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని భావిస్తున్నారు.

ఇక‌, తెలంగాణ నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు రాకుండానే ఖ‌మ్మంలోని ఎర్రుబాలెం మీదుగా.. కృష్ణా నదిపై కొత్త‌గా నిర్మించే వంతెన ద్వారా.. రాజ‌ధానిలోకి వ‌చ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 57 కిలో మీట‌ర్లు ఉండగా.. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న దూరం కూడా 50 కిలో మీట‌ర్ల మేర‌కు త‌గ్గ‌నుంది. మొత్తంగా 450 కోట్ల మేర‌కు ఈ నిర్మాణానికి ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. దీనిలో ఒక్క కృష్ణాన‌దిపై నిర్మించే వంతెన‌కే.. రూ.350 కోట్లు ఖ‌ర్చుకానున్నాయి. వీటిని ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన నిధుల నుంచి కేటాయించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

This post was last modified on April 6, 2025 8:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

33 minutes ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

47 minutes ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

7 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

9 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

9 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

10 hours ago