ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమరావతిని కనెక్ట్ చేయడం లేదు. దాదాపు 50 కిలో మీటర్ల మేరకు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. అమరావతికి నేరుగా కనెక్టివిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేపట్టింది.
దీనిలో భాగంగా తెలంగాణ నుంచి వచ్చే వారి కోసం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం- గుంటూరు జిల్లా నంబూరుల మధ్య కొత్త రైలు లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమతి కూడా రావడంతో ఇప్పుడు చకచకా పనులు ప్రారంభించేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ భూముల్లో నంబూరులోని కొంత వరకు.. ప్రభుత్వ స్థలం ఉంది. దీంతో భూసేకరణకు ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.
ఇక, తెలంగాణ నుంచి వచ్చేవారు.. విజయవాడకు రాకుండానే ఖమ్మంలోని ఎర్రుబాలెం మీదుగా.. కృష్ణా నదిపై కొత్తగా నిర్మించే వంతెన ద్వారా.. రాజధానిలోకి వచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 57 కిలో మీటర్లు ఉండగా.. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న దూరం కూడా 50 కిలో మీటర్ల మేరకు తగ్గనుంది. మొత్తంగా 450 కోట్ల మేరకు ఈ నిర్మాణానికి ఖర్చవుతాయని అంచనా వేశారు. దీనిలో ఒక్క కృష్ణానదిపై నిర్మించే వంతెనకే.. రూ.350 కోట్లు ఖర్చుకానున్నాయి. వీటిని ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధుల నుంచి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
This post was last modified on April 6, 2025 8:13 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…