Political News

రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమ‌రావ‌తిని క‌నెక్ట్ చేయ‌డం లేదు. దాదాపు 50 కిలో మీట‌ర్ల మేర‌కు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం.. అమ‌రావ‌తికి నేరుగా క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది.

దీనిలో భాగంగా తెలంగాణ నుంచి వ‌చ్చే వారి కోసం.. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం- గుంటూరు జిల్లా నంబూరుల మ‌ధ్య కొత్త రైలు లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా రావ‌డంతో ఇప్పుడు చ‌క‌చ‌కా ప‌నులు ప్రారంభించేందుకు స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో  అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ భూముల్లో నంబూరులోని కొంత వ‌ర‌కు.. ప్ర‌భుత్వ స్థలం ఉంది. దీంతో భూసేక‌ర‌ణ‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని భావిస్తున్నారు.

ఇక‌, తెలంగాణ నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు రాకుండానే ఖ‌మ్మంలోని ఎర్రుబాలెం మీదుగా.. కృష్ణా నదిపై కొత్త‌గా నిర్మించే వంతెన ద్వారా.. రాజ‌ధానిలోకి వ‌చ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 57 కిలో మీట‌ర్లు ఉండగా.. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న దూరం కూడా 50 కిలో మీట‌ర్ల మేర‌కు త‌గ్గ‌నుంది. మొత్తంగా 450 కోట్ల మేర‌కు ఈ నిర్మాణానికి ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. దీనిలో ఒక్క కృష్ణాన‌దిపై నిర్మించే వంతెన‌కే.. రూ.350 కోట్లు ఖ‌ర్చుకానున్నాయి. వీటిని ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన నిధుల నుంచి కేటాయించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

This post was last modified on April 6, 2025 8:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

1 hour ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

2 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

6 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

6 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

10 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

10 hours ago