Political News

రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమ‌రావ‌తిని క‌నెక్ట్ చేయ‌డం లేదు. దాదాపు 50 కిలో మీట‌ర్ల మేర‌కు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం.. అమ‌రావ‌తికి నేరుగా క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది.

దీనిలో భాగంగా తెలంగాణ నుంచి వ‌చ్చే వారి కోసం.. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం- గుంటూరు జిల్లా నంబూరుల మ‌ధ్య కొత్త రైలు లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా రావ‌డంతో ఇప్పుడు చ‌క‌చ‌కా ప‌నులు ప్రారంభించేందుకు స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో  అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ భూముల్లో నంబూరులోని కొంత వ‌ర‌కు.. ప్ర‌భుత్వ స్థలం ఉంది. దీంతో భూసేక‌ర‌ణ‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని భావిస్తున్నారు.

ఇక‌, తెలంగాణ నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు రాకుండానే ఖ‌మ్మంలోని ఎర్రుబాలెం మీదుగా.. కృష్ణా నదిపై కొత్త‌గా నిర్మించే వంతెన ద్వారా.. రాజ‌ధానిలోకి వ‌చ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 57 కిలో మీట‌ర్లు ఉండగా.. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న దూరం కూడా 50 కిలో మీట‌ర్ల మేర‌కు త‌గ్గ‌నుంది. మొత్తంగా 450 కోట్ల మేర‌కు ఈ నిర్మాణానికి ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. దీనిలో ఒక్క కృష్ణాన‌దిపై నిర్మించే వంతెన‌కే.. రూ.350 కోట్లు ఖ‌ర్చుకానున్నాయి. వీటిని ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన నిధుల నుంచి కేటాయించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

This post was last modified on April 6, 2025 8:13 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

16 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

2 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

4 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

4 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago