వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి సంతకం ద్వారా మిగిలి ఉన్న ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఫలితింగా దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు అయ్యింది. రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లుపై సంతకం చేసిన మరుక్షణమే అది చట్టంగా మారి ఏకంగా అమల్లోకి వచ్చేసింది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రూపొందించిన ఈ బిల్లుకు దేశంలోని పలు ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తంగా చేయగా… చాలా ముస్లిం సంఘాలు ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అవసరమైన సవరణలను చేసేందుకు సిద్ధపడిన కేంద్రం సంయుక్త పార్లముంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలం పాటు క్రమానుగతంగా ఈ బిల్లుపై జేపీసీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ప్రతిపాదించిన సవరణలపై విస్తృత చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మెజారిటీ వర్గాల అభిప్రాయాల మేరకు సవరణలను కూడా ఆమోదించింది.
అనంతరం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు దశలో కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం లోక్ సభలో జరిగిన ఓటింగ్ లో 288-232 ఓట్లతో, రాజ్యసభలో 128-95 ఓట్లతో ఆమోదం లభించింది. అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా… రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును పరిశీలించి శనివారం రాత్రి తన ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా యావత్తు దేశంలో ఆసక్తి రేకెత్తించిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయి… అమల్లోకి వచ్చేసింది.
This post was last modified on April 6, 2025 10:57 am
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…