వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి సంతకం ద్వారా మిగిలి ఉన్న ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఫలితింగా దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు అయ్యింది. రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లుపై సంతకం చేసిన మరుక్షణమే అది చట్టంగా మారి ఏకంగా అమల్లోకి వచ్చేసింది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రూపొందించిన ఈ బిల్లుకు దేశంలోని పలు ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తంగా చేయగా… చాలా ముస్లిం సంఘాలు ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అవసరమైన సవరణలను చేసేందుకు సిద్ధపడిన కేంద్రం సంయుక్త పార్లముంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలం పాటు క్రమానుగతంగా ఈ బిల్లుపై జేపీసీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ప్రతిపాదించిన సవరణలపై విస్తృత చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మెజారిటీ వర్గాల అభిప్రాయాల మేరకు సవరణలను కూడా ఆమోదించింది.
అనంతరం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు దశలో కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం లోక్ సభలో జరిగిన ఓటింగ్ లో 288-232 ఓట్లతో, రాజ్యసభలో 128-95 ఓట్లతో ఆమోదం లభించింది. అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా… రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును పరిశీలించి శనివారం రాత్రి తన ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా యావత్తు దేశంలో ఆసక్తి రేకెత్తించిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయి… అమల్లోకి వచ్చేసింది.
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…