జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం.. పిఠాపురంలో ఏం జరుగుతోంది? పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు అక్కడ వరుస పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. పైగా ఇటీవల కాలంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో వర్మకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఖర్మ అని జనసేన ఆవిర్భావ వేడుకల సమయంలో నాగబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో వర్మ అనుచరులు.. హర్ట్ అయ్యారు.
ఇది రాజకీయంగా జనసేనకు ఇబ్బందికలిగించే అకాశం ఉంది. ఎందుకంటే.. పార్టీ తరఫున పవన్ కల్యా ణ్ పిఠాపురంలో పోటీ చేసినా.. గ్రామీణ స్థాయిలో మాత్రం టీడీపీ నాయకుడు వర్మ చేసిన ప్రచారం ఉంది. దీనిని నియోజకవర్గం ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఇక, నాగబాబు-వర్మల మధ్య పెరుగుతున్న గ్యాప్ కారణంగా.. వర్మకు సానుభూతి పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక అంచనా. అదేసమయంలో వీరి మధ్య ఉన్న గ్యాప్.. పరోక్షంగా వైసీపీకి మేలు చేసే చాన్స్ కనిపిస్తోంది.
ఇలా అన్ని కోణాల్లోనూ పిఠాపురం రాజకీయాల పై చర్చలు, విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో తమ హవా తగ్గకుండా.. క్షేత్రస్థాయిలో మరో వ్యక్తి లేదా.. పార్టీ ఉనికి బలోపేతం కాకుండా చూసుకునే క్రమంలోనే ఇప్పుడు పిఠాపురానికి నాగబాబు వచ్చారని అంటున్నారు. తద్వారా.. పవన్ ఇమేజ్ ఎలా ఉన్నా.. పార్టీపరంగా.. నాగబాబు కొంత మేరకు ఉపయోగపడతాడన్న చర్చ ఉంది. అందుకే.. తాజాగా ఆయన రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేయడం గమనార్హం.
అంతేకాదు.. పలు అభివృద్ది కార్యక్రమాలను కూడా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు చక్కబెట్టారు. కొన్నింటిని ప్రారంభించారు. మరికొన్నింటికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నికల సమయానికి వేరే నేత ఎవరూ ఉండే పరిస్థితి ఇక్కడ పూర్తిగా లేకుండా చేయాలన్న ప్రధాన అజెండాతోనే నాగబాబు వస్తున్నారన్న మరో చర్చ కూడా ఉండడం గమనార్హం. అయితే.. ఈ విషయంలో వర్మ ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది. మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on April 6, 2025 10:08 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…