సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని.. వారిని విద్య, ఉద్యోగాలు, నివాసం సహా.. అన్ని కోణాల్లోనూ ఆదుకుని వారిని కూడాసంపన్నులుగా తీర్చిదిద్దడమే పీ-4 కీలక లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు కలసి రావాలంటూ.. ఉన్నత స్థాయి వర్గాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఎంపిక చేసిన ఓ బంగారు కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి.. పీ-4 ద్వారా వారికి అందే చేయూతను వివరించారు.
ఇక, పీ-4 కార్యక్రమానికి స్పందనగా.. ప్రముఖ విత్తన వ్యాపార సంస్థ ప్రసాద్ సీడ్స్ అధినేత.. ప్రసాద్.. సీఎం చంద్రబాబుకు 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను పీ-4 కార్యక్రమానికి వినియోగించాలని సూచించారు. ప్రధానంగా కొమ్మూరు లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం)కు ఈ నిధులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కొమ్మూరు పరిధిలో రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా వారికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వేలాది ఎకరాల పంటలు.. లిఫ్ట్ ఇరిగేషన్పైనే ఆధారపడి ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతన్నారని.. వీరిని ఆదుకునేందుకు ఈ నిధులను వినియోగించాలని ఆయన సూచించారు. ప్రసాద్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని.. ఆ నిధులను కొమ్మురు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వినియోగిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.10 కోట్లను బదిలీ చేయాలని సీఎంవో వర్గాలను ఆయన ఆదేశించారు. భవిష్యత్తులోనూ.. ప్రసాద్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
This post was last modified on April 5, 2025 10:38 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…