సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని.. వారిని విద్య, ఉద్యోగాలు, నివాసం సహా.. అన్ని కోణాల్లోనూ ఆదుకుని వారిని కూడాసంపన్నులుగా తీర్చిదిద్దడమే పీ-4 కీలక లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు కలసి రావాలంటూ.. ఉన్నత స్థాయి వర్గాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఎంపిక చేసిన ఓ బంగారు కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి.. పీ-4 ద్వారా వారికి అందే చేయూతను వివరించారు.
ఇక, పీ-4 కార్యక్రమానికి స్పందనగా.. ప్రముఖ విత్తన వ్యాపార సంస్థ ప్రసాద్ సీడ్స్ అధినేత.. ప్రసాద్.. సీఎం చంద్రబాబుకు 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను పీ-4 కార్యక్రమానికి వినియోగించాలని సూచించారు. ప్రధానంగా కొమ్మూరు లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం)కు ఈ నిధులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కొమ్మూరు పరిధిలో రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా వారికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వేలాది ఎకరాల పంటలు.. లిఫ్ట్ ఇరిగేషన్పైనే ఆధారపడి ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతన్నారని.. వీరిని ఆదుకునేందుకు ఈ నిధులను వినియోగించాలని ఆయన సూచించారు. ప్రసాద్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని.. ఆ నిధులను కొమ్మురు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వినియోగిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.10 కోట్లను బదిలీ చేయాలని సీఎంవో వర్గాలను ఆయన ఆదేశించారు. భవిష్యత్తులోనూ.. ప్రసాద్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
This post was last modified on April 5, 2025 10:38 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…