ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేసవి కాలం ప్రారంభం అయిన నేపథ్యంలో సాగు, తాగు నీటి అవసరాలు .. రెండు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. దీంతో ముందుగా తెలంగాణ అప్రమత్తమైంది. చుక్కనీటిని కూడా.. వదులుకోరాదంటూ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సాగర్ వద్ద అప్రమత్తంగా కూడా ఉంటున్నారు. ఒకప్పుడు ఉదయం వేళల్లో మాత్రమే ఇంజనీర్లు.. సాగర్ దగ్గర ఉండేవారు.
కానీ, ఇప్పుడు 24 గంటలు కూడా అధికారులు సాగర్ వద్దే ఉంటున్నారు. దీనిని బట్టి తెలంగాణ నీటి వనరుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు అర్ధమవుతుంది. ఇక, ఏపీ విషయానికి వస్తే.. సొంతగా మరిన్ని ప్రాజెక్టులు కట్టుకోవడం ద్వారా జల సమస్య నుంచి బయట పడాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని బనకచర్ల వద్ద భారీ ప్రాజెక్టుకు ఏపీ సర్కారు శ్రీకారం చుడుతోంది. అవసరమైతే.. దీనిని తామే చేపట్టేందుకు కూడా రెడీగా ఉన్నట్టు సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందట ప్రకటించారు.
అయితే.. దీనిని తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, ఇప్పుడు చంద్రబాబు సంకల్పిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును కూడా.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. ఆయా ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టాండింగ్ కౌన్సిల్, అడ్వొకేట్ జనరల్తో చర్చించారు.
జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని.. కేంద్ర సంస్థలు, బోర్డుల అనుమతి లేకుండా.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ హక్కుల కోసం ఎంతకైనా వెళ్తామని ఆయన చెప్పడం గమనార్హం. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల కడుతున్నా.. రేవంత్రెడ్డి సోయి లేకుండా ఉన్నారని.. బీఆర్ఎస్ నాయకులు దుయ్యబడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ పై న్యాయ పోరాటానికి దిగుతుండడం గమనార్హం.
This post was last modified on April 5, 2025 6:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…