జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గడచి రెండు రోజులుగా టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తుతున్నాయి. జనసేన తరఫున ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ నాగబాబు శుక్రవారం పిఠాపురంలో అధికారిక పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు జనసేన శ్రేణులు భారీ ఎత్తున స్వాగత సత్కారాలు చేశాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా నాగబాబు వద్దకు చేరుకుని టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. వెరసి నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తాయి.
తాజాగా శనివారం పిఠాపురం పరిధిలోని కుమారపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు నాగబాబు బయలుదేరారు. ఈ సందర్భంగా నాగబాబు వెంట ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రాగా… కుమారపురం చేరుకున్న వెంటనే అక్కడ టీడీపీ శ్రేణులు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు జై జనసేన, జై పవన్, జై నాగబాబు అంటూ జనసేన శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తే… జై టీడీపీ, జై వర్మ, జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులతో పోటీ పడి మరీ నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొనగా… పోలీసులకు ఎలాంటి శ్రమ కలిగించకుండానే టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటిస్తూ ఎవరి దారిలో వారు సాగిపోతూ కనిపించారు.
ఇరు పార్టీల పోటాపోటీ నినాదాల నేపథ్యంలో పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నా… నినాదాల హోరు అయితే కనిపించింది గానీ… ఎక్కడ కూడా ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట గానీ, వాగ్వాదం గానీ జరిగిన దాఖలానే కనిపించలేదు. ఓ వైపు జనసేన నినాదల హోరు, మరోవైపు టీడీపీ నినాదాల హోరు వినిపిస్తున్నా… ఎలాంటి ఇబ్బంది లేకుండానే నాగబాబు అలా ముందుకు సాగిపోయారు. తాను నిర్దేశించుకున్న కార్యక్రమాలను ముగించుకున్నారు. ఇదిలా ఉంటే… ఈ కార్యక్రమాల్లో టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం నాగబాబు పర్యటనలో కనిపించలేదు.
This post was last modified on April 5, 2025 5:09 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…