జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గడచి రెండు రోజులుగా టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తుతున్నాయి. జనసేన తరఫున ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ నాగబాబు శుక్రవారం పిఠాపురంలో అధికారిక పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు జనసేన శ్రేణులు భారీ ఎత్తున స్వాగత సత్కారాలు చేశాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా నాగబాబు వద్దకు చేరుకుని టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. వెరసి నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తాయి.
తాజాగా శనివారం పిఠాపురం పరిధిలోని కుమారపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు నాగబాబు బయలుదేరారు. ఈ సందర్భంగా నాగబాబు వెంట ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రాగా… కుమారపురం చేరుకున్న వెంటనే అక్కడ టీడీపీ శ్రేణులు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు జై జనసేన, జై పవన్, జై నాగబాబు అంటూ జనసేన శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తే… జై టీడీపీ, జై వర్మ, జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులతో పోటీ పడి మరీ నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొనగా… పోలీసులకు ఎలాంటి శ్రమ కలిగించకుండానే టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటిస్తూ ఎవరి దారిలో వారు సాగిపోతూ కనిపించారు.
ఇరు పార్టీల పోటాపోటీ నినాదాల నేపథ్యంలో పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నా… నినాదాల హోరు అయితే కనిపించింది గానీ… ఎక్కడ కూడా ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట గానీ, వాగ్వాదం గానీ జరిగిన దాఖలానే కనిపించలేదు. ఓ వైపు జనసేన నినాదల హోరు, మరోవైపు టీడీపీ నినాదాల హోరు వినిపిస్తున్నా… ఎలాంటి ఇబ్బంది లేకుండానే నాగబాబు అలా ముందుకు సాగిపోయారు. తాను నిర్దేశించుకున్న కార్యక్రమాలను ముగించుకున్నారు. ఇదిలా ఉంటే… ఈ కార్యక్రమాల్లో టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం నాగబాబు పర్యటనలో కనిపించలేదు.
This post was last modified on April 5, 2025 5:09 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…