Political News

ఎన్సీసీకి హైకోర్టు…ఎల్ అండ్ టీకి అసెంబ్లీ

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఇక శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో అసెంబ్లీ, హైకోర్టుల నిర్వహణ కోసం తాత్కాలిక భవన సముదాయాలను నాటి టీడీపీ ప్రభుత్వం నిర్మించగా… తాజాగా టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు… అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాల కోసం ఏపీసీఆర్డీఏ ఇటీవలే టెంటర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను సీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఖరారు చేశారు.

హైకోర్టు శాశ్వత భవన సముదాయం కోసం రూ.924.64 కోట్లతో సీఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసి టెండర్లు పిలవగా… నిర్మాణ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరుప్రఖ్యాతులు గడించిన తెలుగు నేలకు చెందిన నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్సీసీ) బిడ్ ను దాఖలు చేసింది. ఇక అసెంబ్లీ శాశ్వత భవన సముదాయం నిర్మాణం కోసం రూ.724.69 కోట్లతో సీఆర్డీఏ టెండర్లను పిలవగా… నిర్మాణ రంగంలోనే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీగా ప్రసిద్ధి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ (ఎల్ అండ్ టీ) తన బిడ్ ను దాఖలు చేసింది.

ఈ రెండు శాశ్వత భవన నిర్మాణాల కోసం కేవలం రెండు సంస్థలే బిడ్డింగ్ లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం బిడ్లను ఓపెన్ చేసిన సీఆర్డీఏ అధికారులు.. ఒక్కో భవన నిర్మాణానికి ఒక్కొక్క బిడ్ మాత్రమే దాఖలు కావడంతో ఆయా సంస్థ లకు టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎన్సీసీ దక్కించుకోగా… అసెంబ్లీ భవన నిర్మాణం కాంట్రాక్టును ఎల్ అండ్ టీ దక్కించుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారికంగా టెండర్ల ఖరారు ను శుక్రవారం ఖరారు చేసింది. మొత్తంగా ఈ రెండు భవన నిర్మాణాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,649.33 కోట్లను వెచ్చించనుంది. త్వరలోనే ఈ భవనాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.

This post was last modified on April 5, 2025 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago