Political News

ఎన్సీసీకి హైకోర్టు…ఎల్ అండ్ టీకి అసెంబ్లీ

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఇక శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో అసెంబ్లీ, హైకోర్టుల నిర్వహణ కోసం తాత్కాలిక భవన సముదాయాలను నాటి టీడీపీ ప్రభుత్వం నిర్మించగా… తాజాగా టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు… అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాల కోసం ఏపీసీఆర్డీఏ ఇటీవలే టెంటర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను సీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఖరారు చేశారు.

హైకోర్టు శాశ్వత భవన సముదాయం కోసం రూ.924.64 కోట్లతో సీఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసి టెండర్లు పిలవగా… నిర్మాణ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరుప్రఖ్యాతులు గడించిన తెలుగు నేలకు చెందిన నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్సీసీ) బిడ్ ను దాఖలు చేసింది. ఇక అసెంబ్లీ శాశ్వత భవన సముదాయం నిర్మాణం కోసం రూ.724.69 కోట్లతో సీఆర్డీఏ టెండర్లను పిలవగా… నిర్మాణ రంగంలోనే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీగా ప్రసిద్ధి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ (ఎల్ అండ్ టీ) తన బిడ్ ను దాఖలు చేసింది.

ఈ రెండు శాశ్వత భవన నిర్మాణాల కోసం కేవలం రెండు సంస్థలే బిడ్డింగ్ లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం బిడ్లను ఓపెన్ చేసిన సీఆర్డీఏ అధికారులు.. ఒక్కో భవన నిర్మాణానికి ఒక్కొక్క బిడ్ మాత్రమే దాఖలు కావడంతో ఆయా సంస్థ లకు టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎన్సీసీ దక్కించుకోగా… అసెంబ్లీ భవన నిర్మాణం కాంట్రాక్టును ఎల్ అండ్ టీ దక్కించుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారికంగా టెండర్ల ఖరారు ను శుక్రవారం ఖరారు చేసింది. మొత్తంగా ఈ రెండు భవన నిర్మాణాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,649.33 కోట్లను వెచ్చించనుంది. త్వరలోనే ఈ భవనాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.

This post was last modified on April 5, 2025 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌వితేజ పెద్ద హిట్ మిస్స‌య్యాడా?

మాస్ రాజా ర‌వితేజ స‌రైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. క‌రోనా కాలంలో వ‌చ్చిన క్రాక్ మూవీనే ర‌వితేజ‌కు…

3 hours ago

యాంకర్ అబ్బాయికి భలే మంచి ఛాన్స్

రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…

5 hours ago

ఏప్రిల్ 11 – ఓటిటి అభిమానులకు పండగే

థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…

6 hours ago

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

9 hours ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

9 hours ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

10 hours ago