Political News

ఎన్సీసీకి హైకోర్టు…ఎల్ అండ్ టీకి అసెంబ్లీ

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఇక శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో అసెంబ్లీ, హైకోర్టుల నిర్వహణ కోసం తాత్కాలిక భవన సముదాయాలను నాటి టీడీపీ ప్రభుత్వం నిర్మించగా… తాజాగా టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు… అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాల కోసం ఏపీసీఆర్డీఏ ఇటీవలే టెంటర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను సీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఖరారు చేశారు.

హైకోర్టు శాశ్వత భవన సముదాయం కోసం రూ.924.64 కోట్లతో సీఆర్డీఏ అంచనాలను సిద్ధం చేసి టెండర్లు పిలవగా… నిర్మాణ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరుప్రఖ్యాతులు గడించిన తెలుగు నేలకు చెందిన నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్సీసీ) బిడ్ ను దాఖలు చేసింది. ఇక అసెంబ్లీ శాశ్వత భవన సముదాయం నిర్మాణం కోసం రూ.724.69 కోట్లతో సీఆర్డీఏ టెండర్లను పిలవగా… నిర్మాణ రంగంలోనే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీగా ప్రసిద్ధి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ (ఎల్ అండ్ టీ) తన బిడ్ ను దాఖలు చేసింది.

ఈ రెండు శాశ్వత భవన నిర్మాణాల కోసం కేవలం రెండు సంస్థలే బిడ్డింగ్ లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం బిడ్లను ఓపెన్ చేసిన సీఆర్డీఏ అధికారులు.. ఒక్కో భవన నిర్మాణానికి ఒక్కొక్క బిడ్ మాత్రమే దాఖలు కావడంతో ఆయా సంస్థ లకు టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎన్సీసీ దక్కించుకోగా… అసెంబ్లీ భవన నిర్మాణం కాంట్రాక్టును ఎల్ అండ్ టీ దక్కించుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారికంగా టెండర్ల ఖరారు ను శుక్రవారం ఖరారు చేసింది. మొత్తంగా ఈ రెండు భవన నిర్మాణాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,649.33 కోట్లను వెచ్చించనుంది. త్వరలోనే ఈ భవనాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.

This post was last modified on April 5, 2025 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago