Political News

పవన్ చెప్పారంటే… జరిగిపోతుందంతే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే… ఎన్నికలప్పుడు జనం వద్దకు రావడం, నోటికొచ్చిన, జనం అడిగిన హామీలు ఇవ్వడం, ఓట్లేయించుకోవడం, ఆపై పత్తా లేకుండా పోవడం… ఆ తర్వాత మళ్తీ ఎన్నికలప్పుడే జనం ముందు ప్రత్యక్షమయ్యే వారనే నానుడి ఉంది. ఇందుకు ఒకరిద్దరు నేతలు మినహాయింపులు ఉన్నా… మెజారిటీ నేతల తీరు ఇంతే. ఈ తరహా రాజకీయానికి పవన్ ఆమడంత దూరం. పాలిటిక్స్ లోకి వచ్చాక పవన్ సాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. నిబద్ధతతో కూడిన రాజకీయం చేస్తున్న పవన్…తాజాగా తన నిబద్ధత ఎలాంటిదో మరోమారు నిరూపించుకున్నారు.

మొన్నామధ్య దక్షిణ భారత ఆలయాలను పవన్ తన కుమారుడు అకీరా నందన్ ను వెంటబెట్టుకుని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కేరళ, తమిళనాడు ఆలయాలను సందర్శించిన పవన్..ఆ సందర్భంగా అక్కడి భక్తులతో మాట్లాడారు. తనతో మాట కలిపిన భక్తులతో ఆయన మాట కలిపారు. తమిళనాడులోని పళని ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడి భక్తులు తన వద్ద ప్రస్తావించిన ఓ అంశానికి సంబంధించి అక్కడికక్కడే ఆయన వారికి ఆ సమస్య పరిష్కారం దిశగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏపీలోని తిరుమల వెళ్లడానికి తమకు నేరుగా బస్సు సౌకర్యం లేని కారణంగా తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, తమ ఇష్ట దైవం అయిన తిరుమల వెంకన్నను దర్శించుకోలేకపోతున్నామని వారు పవన్ కు తెలిపారు. బస్సు సౌకర్యం ఏర్పాటు అయ్యేలా చూస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు.

ఇదంతా ఎప్పుడు జరిగింది? రెండు నెలల క్రితం ఫిబ్రవరి 14న జరిగింది. అక్కడి నుంచి పవన్ వచ్చేశారు. తన రోజువారీ కార్యక్రమాల్లో ఆయన పడిపోయారు. ప్రజా పాలనలో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో పళని భక్తులకు ఇచ్చిన హామీని పవన్ మరిచిపోయి ఉంటారులే అని అంతా అనుకున్నారు. అయితే గురువారం విజయవాడలో ఓ కార్యక్రమం జరిగింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పవన్ ఓ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసు ఎక్కడికో కాదు… నిత్యం తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి తిరిగే బస్సు సర్వీసు. ఎప్పుడో… అది కూడా తనకు ఏమాత్రం సంబంధం లేని పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజలు కోరిన కోరికను పవన్ గుర్తు పెట్టుకుని.. దానిని ఫాలో అప్ చేసి.. రెండు నెలల తర్వాత అయినా కూడా దానిని అమలు చేసి తన నిబద్ధత ఏ పాటిదో నిరూపించుకున్నారు. ఈ లెక్కన అందరూ పవన్ మాదిరిగా ఉంటే… ఎంత బాగుంటుందో కదా అన్న భావన వ్యక్తమవుతోంది.

This post was last modified on April 4, 2025 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాట పాడిన వందే మాతరం… బెంగాల్ లో లేదెందుకు?

వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం,…

12 minutes ago

రామ్ విసుగొచ్చే రూటు మార్చాడా

ఇప్పుడున్న జనరేషన్ హీరోలు దర్శకులుగా మారడం అరుదు. కాకపోతే చిరంజీవి తరంతో పోల్చుకుంటే కొంచెం బెటరని చెప్పొచ్చు. మెగాస్టార్ తో…

20 minutes ago

సాయిపల్లవిని ఎందుకు మర్చిపోయారు

నిన్న సాయిపల్లవి పుట్టినరోజు. అసలు విశేషం అది కాదు. రామాయణలో సీతగా నటించిన తనకు బర్త్ డే కానుకగా ఒక…

1 hour ago

త్రిష దాటాల్సిన నెగిటివ్ సెంటిమెంట్

తమిళ సినీ రాజకీయ వర్గాలతో పాటు తెలుగు విజయ్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఎవరయ్యా అంటే ఠక్కున…

1 hour ago

ఇంకో పెద్ద తెలుగు సినిమాలో మీర్జాపూర్ మున్నా

ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ‘మీర్జాపూర్’ ఒకటి. అది చూసిన వాళ్లు ఎవ్వరూ అందులో మున్నా పాత్రను…

3 hours ago

త్రిషకు ఎంత ప్రాధాన్యమిచ్చారెంటీ?

మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన తమిళ స్టార్ హీరో…

5 hours ago