తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ అంశం.. మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 3(గురువారం) మంత్రి వర్గ విస్తరణ ఖాయమని అందరూ అనుకున్నారు. అంతే కాదు.. గత నెల చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి.. హుటాహుటిన గవర్నర్ను కూడా కలిశారు. అప్పట్లోనే మంత్రి విస్తరణకు సంబంధించిన జాబితాను రేవంత్ గవర్నర్ కు ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే.. గురువారం కూడా.. ఎలాంటి చడీ చప్పుడు లేకపోవడం.. సీఎం సహా అందరూ.. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంపై మంతనాలు జరపడం వంటి విషయాల్లో మునిగిపోయారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా.. రేవంత్ను హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ అంశంపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో మంత్రి వర్గ విస్తరణకు మళ్లీ బ్రేకులు పడినట్టు తెలుస్తోంది. అయితే.. ఇది అధిష్టానం స్థాయిలో జరగలేదని.. స్థానికంగానే బ్రేకులు పడినట్టు భావిస్తున్నామని కొందరు నాయకులు చెబుతున్నారు.
ఏం జరిగింది?
ఏదో ఒక కారణంతో గడచిన 10 నెలలుగా మంత్రి వర్గ విస్తరణ అంశం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం జరిగిన వాయిదాకు.. మంత్రుల లిస్టు విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ ఒప్పుకోలేదన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాలో కొందరి పేర్ల పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా సీనియర్లను కాదని.. జూనియర్లకు అవకాశం ఇవ్వడాన్ని కూడా.. పార్టీ తప్పుబడుతున్నట్టు తెలిసింది.
వాస్తవానికి చాలానే ఖాళీలు ఉన్నప్పటికీ.. కనీసంలో కనీసం.. నలుగురికి తొలుత అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికిగాను సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక చేశారు. కానీ.. సీనియర్లయినా.. కొందరు మాజీ మంత్రులు, అధిష్టానం దగ్గర మంచి పలుకుబడి ఉన్న నాయకులకు మొండి చేయి చూపించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో వారే.. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణకు అడ్డు పడుతున్నారని.. అందుకే జాప్యం జరుగుతోందని అంటున్నారు.
This post was last modified on April 3, 2025 2:17 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…