Political News

టీడీపీలో అతిపెద్ద జబ్బు అలక… వదిలించుకుందాం: లోకేశ్

కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సందర్బంగా ఆ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా మందిని పేరు పెట్టి పిలిచిన లోకేశ్…పార్టీకి అండాదండా అన్నీ కార్యకర్త లేనన్న విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. వర్తమానంతో పాటుగా భవిష్యత్తులోనూ ఇదే పంథాతో ముందుకు సాగుదామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో అతిపెద్ద జబ్బు ఉందని… అదే అలక అని పేర్కొన్న లోకేశ్..దానికి ఫుల్ స్టాప్ పెడదామన్నారు. అలకను వదిలించుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పార్టీలో ఉన్న అలకలను ప్రస్తావిస్తున్న సమయంలో లోకేశ్… పార్టీని ఓ కుటుంబంగా అభివర్ణిస్తూ చేసిన పోలిక అందరినీ ఆకట్టుకుంది. నలుగురు ఐదుగురు సభ్యులున్న చిన్న కుటుంబాల్లోనే చిన్నచిన్నసమస్యలు ఉంటున్నాయని చెప్పిన లోకేశ్… కుటుంబాల్లో సభ్యుల సంఖ్య పెగితే కొద్దీ అభిప్రాయ బేధాలు కూడా పెరుగుతాయని చెప్పారు. అలాంటి కోటి మంది సభ్యత్వాలు కలిగిన టీడీపీ… ఓ అతిపెద్ద కుటుంబమని ఆయన అన్నారు. అంతపెద్ద కుటుంబంలో అభిప్రాయ బేధాలు, అలకలు సర్వసాధారణమన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాను ఎలాంటి బేషజాలకు వెళ్లనని… పార్టీ శ్రేణులు కూడా అలాగే పయనిస్తే అసలు సమస్యలే ఉండవని కూడా లోకేశ్ అభిప్రాయపడ్దారు.

పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామన్న లోకేశ్… ఇటీవలే పార్టీ సభ్యుల సంఖ్య కోటి మార్కు ను దాటడం తనను ఎంతగానో సంతోషానికి గురి చేసిందన్నారు. ఇంతటి సంఖ్యలో సభ్యులను కలిగిన పార్టీగా దేశంలో టీడీపీ ఓ రికార్డును సృష్టించిందని తెలిపారు. పార్టీ కార్యకర్లకు బీమాతో పాటుగా స్వయం ఉపాధి కూడా చూపించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే కొంతమేర చర్యలు చేపట్టినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ చర్య లను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా జిల్లాల పార్టీ బాధ్యులు, ఇంచార్జీ మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పార్టీ నియమావళిని పార్టీ శ్రేణులు నిక్కచ్చిగా పాటించాలని, అదే సమయంలో ఏ సమస్య ఉన్నా… జిల్లాలకు వస్తున్న పార్టీ కీలక నేతలను సంప్రదించి వాటిని ఆదిలోనే పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.

This post was last modified on March 31, 2025 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago