Political News

టీడీపీలో అతిపెద్ద జబ్బు అలక… వదిలించుకుందాం: లోకేశ్

కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సందర్బంగా ఆ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా మందిని పేరు పెట్టి పిలిచిన లోకేశ్…పార్టీకి అండాదండా అన్నీ కార్యకర్త లేనన్న విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. వర్తమానంతో పాటుగా భవిష్యత్తులోనూ ఇదే పంథాతో ముందుకు సాగుదామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో అతిపెద్ద జబ్బు ఉందని… అదే అలక అని పేర్కొన్న లోకేశ్..దానికి ఫుల్ స్టాప్ పెడదామన్నారు. అలకను వదిలించుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పార్టీలో ఉన్న అలకలను ప్రస్తావిస్తున్న సమయంలో లోకేశ్… పార్టీని ఓ కుటుంబంగా అభివర్ణిస్తూ చేసిన పోలిక అందరినీ ఆకట్టుకుంది. నలుగురు ఐదుగురు సభ్యులున్న చిన్న కుటుంబాల్లోనే చిన్నచిన్నసమస్యలు ఉంటున్నాయని చెప్పిన లోకేశ్… కుటుంబాల్లో సభ్యుల సంఖ్య పెగితే కొద్దీ అభిప్రాయ బేధాలు కూడా పెరుగుతాయని చెప్పారు. అలాంటి కోటి మంది సభ్యత్వాలు కలిగిన టీడీపీ… ఓ అతిపెద్ద కుటుంబమని ఆయన అన్నారు. అంతపెద్ద కుటుంబంలో అభిప్రాయ బేధాలు, అలకలు సర్వసాధారణమన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాను ఎలాంటి బేషజాలకు వెళ్లనని… పార్టీ శ్రేణులు కూడా అలాగే పయనిస్తే అసలు సమస్యలే ఉండవని కూడా లోకేశ్ అభిప్రాయపడ్దారు.

పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామన్న లోకేశ్… ఇటీవలే పార్టీ సభ్యుల సంఖ్య కోటి మార్కు ను దాటడం తనను ఎంతగానో సంతోషానికి గురి చేసిందన్నారు. ఇంతటి సంఖ్యలో సభ్యులను కలిగిన పార్టీగా దేశంలో టీడీపీ ఓ రికార్డును సృష్టించిందని తెలిపారు. పార్టీ కార్యకర్లకు బీమాతో పాటుగా స్వయం ఉపాధి కూడా చూపించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే కొంతమేర చర్యలు చేపట్టినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ చర్య లను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా జిల్లాల పార్టీ బాధ్యులు, ఇంచార్జీ మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పార్టీ నియమావళిని పార్టీ శ్రేణులు నిక్కచ్చిగా పాటించాలని, అదే సమయంలో ఏ సమస్య ఉన్నా… జిల్లాలకు వస్తున్న పార్టీ కీలక నేతలను సంప్రదించి వాటిని ఆదిలోనే పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.

This post was last modified on March 31, 2025 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

16 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

1 hour ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

1 hour ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago