Tv5 Murthy
అందరూ కరోనా గురించే చర్చించుకుంటున్న సమయంలో ఆంద్రప్రదేశ్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అనదగ్గ అగ్రశ్రేణి తెలుగు న్యూస్ యాంకర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.
జగన్ సర్కారు అమరావతి నుంచి రాజధానిని తరలించాలని నిర్ణయించినప్పట్నుంచి టీవీ 5 ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అమరావతి ఉద్యమానికి విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. అక్కడి రైతుల గోడును ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక గత ఏడాది కాలంలో జగన్ సర్కారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలపై టీవీ 5 నిలదీస్తూనే ఉంది. వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. కరోనా వేళ జగన్ సర్కారు వైఫల్యాలన్నింటినీ ఆ ఛానెల్ ఎండగడుతోంది.
సంబంధిత చర్చా కార్యక్రమాలన్నింటినీ మూర్తినే నడిపిస్తున్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఆయన ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ఐతే మూర్తి వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారని.. వారికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించారని ప్రభుత్వం అంటోంది.
ఈ కారణంతోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సంక్షోభ సమయంలో ఓ టాప్ న్యూస్ యాంకర్ను టార్గెట్ చేస్తే జగన్ సర్కారు విమర్శల పాలవడం ఖాయం. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.
This post was last modified on April 30, 2020 12:39 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…