Tv5 Murthy
అందరూ కరోనా గురించే చర్చించుకుంటున్న సమయంలో ఆంద్రప్రదేశ్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అనదగ్గ అగ్రశ్రేణి తెలుగు న్యూస్ యాంకర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.
జగన్ సర్కారు అమరావతి నుంచి రాజధానిని తరలించాలని నిర్ణయించినప్పట్నుంచి టీవీ 5 ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అమరావతి ఉద్యమానికి విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. అక్కడి రైతుల గోడును ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక గత ఏడాది కాలంలో జగన్ సర్కారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలపై టీవీ 5 నిలదీస్తూనే ఉంది. వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. కరోనా వేళ జగన్ సర్కారు వైఫల్యాలన్నింటినీ ఆ ఛానెల్ ఎండగడుతోంది.
సంబంధిత చర్చా కార్యక్రమాలన్నింటినీ మూర్తినే నడిపిస్తున్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఆయన ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ఐతే మూర్తి వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారని.. వారికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించారని ప్రభుత్వం అంటోంది.
ఈ కారణంతోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సంక్షోభ సమయంలో ఓ టాప్ న్యూస్ యాంకర్ను టార్గెట్ చేస్తే జగన్ సర్కారు విమర్శల పాలవడం ఖాయం. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.
This post was last modified on April 30, 2020 12:39 pm
భారతదేశపు అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ నవంబర్ 6 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ ట్రైలర్ తో…
ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి పెట్టి ఉంటుందని చెప్పిన సామెత సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది.…
సోషల్ మీడియా జమానాలో లీకులు పెద్ద తలనెప్పిగా మారాయి. కీలకమైన ట్విస్టులు ముందే చెప్పేయడం ఒకరకమైన సమస్య అయితే, షూటింగ్…
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…
ఒకప్పుడు యుఎస్లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్గా తయారైంది. మన…