Political News

టీవీ5మూర్తి అరెస్టుకు రంగం సిద్ధం?

అంద‌రూ క‌రోనా గురించే చ‌ర్చించుకుంటున్న స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అన‌ద‌గ్గ అగ్ర‌శ్రేణి తెలుగు న్యూస్ యాంక‌ర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయ‌న్ని అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైద‌రాబాద్ బ‌య‌ల్దేరిన‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్ స‌ర్కారు అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌ట్నుంచి టీవీ 5 ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అమ‌రావ‌తి ఉద్య‌మానికి విస్తృత‌మైన క‌వ‌రేజీ ఇస్తోంది. అక్క‌డి రైతుల గోడును ప్ర‌పంచానికి తెలియ‌జేస్తోంది. ఇక గ‌త ఏడాది కాలంలో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న అనేక వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై టీవీ 5 నిల‌దీస్తూనే ఉంది. వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తూనే ఉంది. క‌రోనా వేళ జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌న్నింటినీ ఆ ఛానెల్ ఎండ‌గ‌డుతోంది.

సంబంధిత చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌న్నింటినీ మూర్తినే న‌డిపిస్తున్నారు. ఇటీవ‌ల కొన్ని కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న ప్ర‌భుత్వ తీరును తూర్పార‌బ‌ట్టారు. ఐతే మూర్తి వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. వారికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేయించార‌ని ప్ర‌భుత్వం అంటోంది.

ఈ కార‌ణంతోనే ఆయ‌న అరెస్టుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఐతే ఈ సంక్షోభ స‌మ‌యంలో ఓ టాప్ న్యూస్ యాంక‌ర్‌ను టార్గెట్ చేస్తే జ‌గ‌న్ స‌ర్కారు విమ‌ర్శ‌ల పాల‌వ‌డం ఖాయం. మ‌రి ఈ విష‌యంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

This post was last modified on April 30, 2020 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

53 minutes ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

56 minutes ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

3 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

4 hours ago