Tv5 Murthy
అందరూ కరోనా గురించే చర్చించుకుంటున్న సమయంలో ఆంద్రప్రదేశ్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అనదగ్గ అగ్రశ్రేణి తెలుగు న్యూస్ యాంకర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.
జగన్ సర్కారు అమరావతి నుంచి రాజధానిని తరలించాలని నిర్ణయించినప్పట్నుంచి టీవీ 5 ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అమరావతి ఉద్యమానికి విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. అక్కడి రైతుల గోడును ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక గత ఏడాది కాలంలో జగన్ సర్కారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలపై టీవీ 5 నిలదీస్తూనే ఉంది. వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. కరోనా వేళ జగన్ సర్కారు వైఫల్యాలన్నింటినీ ఆ ఛానెల్ ఎండగడుతోంది.
సంబంధిత చర్చా కార్యక్రమాలన్నింటినీ మూర్తినే నడిపిస్తున్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఆయన ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ఐతే మూర్తి వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారని.. వారికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించారని ప్రభుత్వం అంటోంది.
ఈ కారణంతోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సంక్షోభ సమయంలో ఓ టాప్ న్యూస్ యాంకర్ను టార్గెట్ చేస్తే జగన్ సర్కారు విమర్శల పాలవడం ఖాయం. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.
This post was last modified on April 30, 2020 12:39 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…