ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలయ్యాక.. రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ అండీ…మీరు స్థలం ఇవ్వడమే లేటు అంటూ చాలా కంపెనీలు ఏపీ మాట కోసం వేచి చూస్తున్నాయంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తన్న కుప్పం పరిధిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ సిద్దంగా ఉంది. కుప్పంలో సదరు ప్లాంట్ కు అవసరమైన స్థలాన్ని కేటాయించిన వెంటనే రంగంలోకి దిగిపోతామంటూ ఆ సంస్థ ఎండీ మనీష్ బాండ్లిష్ ఆదివారం ప్రకటించారు.
పాల పంపిణీలో దేశంలోనే పేరెన్నికగన్న సంస్థగా గుర్తింపు సంపాదించుకున్న మదర్ డెయిరీ… గత కొంతకాలం క్రితం పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మూడు ప్లాంట్లను ఆ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ రంగంలో మంచి పనితీరు కనబరుస్తున్న ఆ సంస్థ ఈ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అందలో ఒక ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఏర్పాటు చేయాలని భావించగా… గుజరాత్ ప్రభుత్వం ఆ కంపెనీకి ఓకే చెప్పేయడంతో పాటుగా స్థలాన్ని కూడా కేటాయించింది. దీంతో గుజరాత్ లో రూ.600 కోట్లతో ఓ భారీ ప్లాంటును మదర్ డెయిరీ ఏర్పాటు చేస్తోంది.
ఇక మిగిలిన మరో ప్లాంటును కుప్పంలో ఏర్పాటు చేయనున్నట్లు మనీష్ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా… కూటమి సర్కారు అందుకు సమ్మతించిందట. దీంతో రెండో ప్లాంటును కుప్పంలోనే ఏర్పాటు చేయాలని మనీష్ ఓ నిర్ణయం తీసేసుకున్నారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ.200 కోట్ల మేర పెట్టుబడిని పెట్టాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కుప్పంలో తమకు ఎంతమేర స్థలాన్ని కేటాయిస్తుందన్న దాని ఆధారంగా పెట్టే పెట్టుబడి ఎంత అన్న దానిని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. ఈ లెక్కన ఓ బారీ ప్లాంటుకు సరిపడా స్థలాన్ని కేటాయిస్తే.. మదర్ డెయిరీ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాపెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కుప్పం పరిధిలోని పండ్లు, కూరగాయల రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పాలి.
This post was last modified on March 31, 2025 7:16 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…