వల్లభనేని వంశీ. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. కానీ, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ. వివిధ కేసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సుమారు రెండు మాసాలకు పైగానే వంశీ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు బెయిల్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. వంశీని బయటకు వదిలితే.. టీడీపీ నాయకుడు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ను చంపేసే ప్రమాదం ఉందంటూ.. కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. మరి అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని పోలీసులు ఎలా ట్రీట్ చేయాలి? ఆయనను జోరుగా జనంలోకి వదిలేస్తారా? ఇదీ.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆత్కూరు మండలానికి చెందిన శ్రీధర్రెడ్డి అనే వ్యక్తి.. తన భూమిని కొందరు కబ్జా చేశారని.. దీనికి వంశీ సహకరించారని కొన్నాళ్ల కిందట కేసు పెట్టాడు. ఈ విషయంనూ గన్నవరం కోర్టు వంశీకి జైలు శిక్ష విధించింది. అయితే.. ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేసులో జైల్లో ఉన్న వంశీని ప్రత్యేకంగా జైల్లో పెట్టేది లేదు కనుక.. ఈ కేసులోనూ అదే రిమాండ్ ఖైదీగా కొనసాగించాలని కోర్టు చెప్పింది. ఇక, ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తమ కస్టడీకి వంశీని అప్పగించాలని పోలీసులు పెట్టుకున్న అభ్యర్థన మేరకు.. కోర్టు శనివారం ఒక్కరోజు కస్టడీకి అప్పగించింది.
మరి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి.. అంతే భద్రంగా కోర్టుకు, అటు నుంచి జైలుకు అప్పగించాలి. కానీ, ఇక్కడే పోలీసులు చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. వంశీని రిమాండ్ ఖైదీగా కాకుండా.. ఎమ్మెల్యేగా.. ప్రజాప్రతినిధిగా ట్రీట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు హాజరు పరిచేందుకు వంశీని పోలీసులు తమ వాహనాల్లో తీసుకువచ్చారు. అయితే.. ఈ సమయంలో భారీ సంఖ్యలో వంశీ తన అనుచరుల ద్వారా ప్రజలను పోగు చేశారు. వారితో కరచాలనాలు.. విషెస్, లాలనలు, బుజ్జగింపులు వంటివి చేశారు.
అంతేకాదు.. వంశీ.. తనవారితో మాట్లాడేందుకు కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే.. ఉన్నస్థాయి అధికారులు కూడా ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు.. తప్ప.. “మీరు రిమాండ్ ఖైదీ..ఇలాంటివి కుదరదు” అని చెప్పిన పాపాన పోలేదు. పైగా.. ఆయనకు పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వంశీ విషయాన్ని పక్కన పెడితే.. ఒకవేళ అభిమానుల ముసుగులో ఆయన అనుచరులే.. ఆయనపై దాడి చేసి.. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే.. దానికి ఎవరు బాధ్యలు? ప్రభుత్వానికి చెడ్డపేరు రాదా? కాదా? అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. ఏదేమైనా.. వంశీ సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో వంశీది తప్పా.. పోలీసులది తప్పా..? అన్నది సర్కారు తేల్చి భవిష్యత్తులో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
This post was last modified on March 30, 2025 6:30 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…