Political News

వైసీపీ దాష్టీకాల‌పై పోరాడిన జ‌ర్న‌లిస్టుకు చంద్ర‌బాబు ఘ‌న స‌త్కారం!

వైసీపీ హ‌యాంలో ఆ ప్ర‌భుత్వ అరాచ‌కాలు, దాష్టీకాల‌పై పోరాడిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఓ ప్ర‌ధాన పత్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా, రిపోర్ట‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన‌.. అంక‌బాబుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మున్న‌త స‌త్కారం ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం స‌హా.. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను రెండు చేతులు వెన‌క్కి విర‌గ్గ‌ట్టి న‌డిరోడ్డుపై అరెస్టు చేసిన తీరును అంక‌బాబు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న సోష‌ల్ మీడియా, సొంత చానెల్ ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వ ప‌నితీరును ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌శ్నించారు.

ఇక‌, చంద్ర‌బాబు అరెస్టు వ్య‌వ‌హారాన్ని త‌న‌దైన శైలిలో అంక‌బాబు ప్ర‌శ్నించారు. అనేక వ్యాసాలు రాయ‌డంతోపాటు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చారు. అయితే.. బాబు అరెస్టు క‌న్నా ముందే.. వైసీపీప్ర‌భుత్వం అంక‌బాబుపై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హరించింది. 72 ఏళ్ల‌వ‌య‌సులో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అంక‌బాబును అర్ధ‌రాత్రి ఇంటి నుంచి అరెస్టు చేసిన తీరు.. అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. అనేక న్యాయ పోరాటాల త‌ర్వాత‌.. అంక‌బాబుకు బెయిల్ ల‌భించింది. దీంతో వైసీపీ స‌ర్కారు తీరు.. అప్ప‌ట్లో జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

త‌న‌ను అరెస్టు చేసినా.. న్యాయం కోసం త‌న పోరాటం ఆగ‌ద‌ని చెప్పిన అంక‌బాబు.. చంద్ర‌బాబు అరెస్టు త‌ర్వాత‌.. మ‌రింత చైతన్యం అయ్యారు. ఆయ‌న అరెస్టును ఖండిస్తూ.. వైసీపీ దుర్మార్గాల‌ను ఉటంకిస్తూ.. అనేక వ్యాసాలు, వ్యాఖ్య‌లు పంచుకున్నారు. ఇది యువ‌త‌లోనూ.. టీడీపీ అభిమానుల్లోనూ ఎంతో చైత‌న్యంక‌లిగించి.. చంద్ర‌బాబు కోసం అంద‌రూ ఐక్యం అయ్యేలా ప‌నిచేసిం దన‌డంలో సందేహం లేదు. ఇక‌, ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం తాజాగా అంక‌బాబును క‌ళార‌త్న‌ పుర‌స్కారానికి ఎంపిక చేసింది. జ‌ర్న‌లిజం రంగంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా.. ఉగాది నాడు.. సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వ‌నున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద మీడియా సంస్థ‌గా ఉన్న ఆంధ్రజ్యోతికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ ఏపీ ఇంచార్జ్‌గా ఉన్న కోరే సుధాక‌ర్‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం క‌ళార‌త్న పుర‌స్కారానికి ఎంపిక చేసింది. సుదీర్ఘ జ‌ర్న‌లిజం ప్ర‌స్థానంలో సుధాక‌ర్‌.. అనేక ప్ర‌యోగాలు చేశారు. రాజ‌కీయాలే కాకుండా.. మాన‌వీయ కోణాల్లో క‌థ‌నాలు అందించారు. కాగా.. క‌ళార‌త్న పుర‌స్కారం కింద‌.. ప్ర‌భుత్వం రూ.ల‌క్ష న‌గ‌దు, మొమెంటో, శ్శాలువాతో ఘ‌నంగా స‌త్క‌రించ‌నుంది.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

6 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

6 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

8 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

10 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

11 hours ago