Political News

వైసీపీ దాష్టీకాల‌పై పోరాడిన జ‌ర్న‌లిస్టుకు చంద్ర‌బాబు ఘ‌న స‌త్కారం!

వైసీపీ హ‌యాంలో ఆ ప్ర‌భుత్వ అరాచ‌కాలు, దాష్టీకాల‌పై పోరాడిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఓ ప్ర‌ధాన పత్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా, రిపోర్ట‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన‌.. అంక‌బాబుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మున్న‌త స‌త్కారం ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం స‌హా.. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను రెండు చేతులు వెన‌క్కి విర‌గ్గ‌ట్టి న‌డిరోడ్డుపై అరెస్టు చేసిన తీరును అంక‌బాబు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న సోష‌ల్ మీడియా, సొంత చానెల్ ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వ ప‌నితీరును ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌శ్నించారు.

ఇక‌, చంద్ర‌బాబు అరెస్టు వ్య‌వ‌హారాన్ని త‌న‌దైన శైలిలో అంక‌బాబు ప్ర‌శ్నించారు. అనేక వ్యాసాలు రాయ‌డంతోపాటు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చారు. అయితే.. బాబు అరెస్టు క‌న్నా ముందే.. వైసీపీప్ర‌భుత్వం అంక‌బాబుపై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హరించింది. 72 ఏళ్ల‌వ‌య‌సులో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అంక‌బాబును అర్ధ‌రాత్రి ఇంటి నుంచి అరెస్టు చేసిన తీరు.. అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. అనేక న్యాయ పోరాటాల త‌ర్వాత‌.. అంక‌బాబుకు బెయిల్ ల‌భించింది. దీంతో వైసీపీ స‌ర్కారు తీరు.. అప్ప‌ట్లో జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

త‌న‌ను అరెస్టు చేసినా.. న్యాయం కోసం త‌న పోరాటం ఆగ‌ద‌ని చెప్పిన అంక‌బాబు.. చంద్ర‌బాబు అరెస్టు త‌ర్వాత‌.. మ‌రింత చైతన్యం అయ్యారు. ఆయ‌న అరెస్టును ఖండిస్తూ.. వైసీపీ దుర్మార్గాల‌ను ఉటంకిస్తూ.. అనేక వ్యాసాలు, వ్యాఖ్య‌లు పంచుకున్నారు. ఇది యువ‌త‌లోనూ.. టీడీపీ అభిమానుల్లోనూ ఎంతో చైత‌న్యంక‌లిగించి.. చంద్ర‌బాబు కోసం అంద‌రూ ఐక్యం అయ్యేలా ప‌నిచేసిం దన‌డంలో సందేహం లేదు. ఇక‌, ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం తాజాగా అంక‌బాబును క‌ళార‌త్న‌ పుర‌స్కారానికి ఎంపిక చేసింది. జ‌ర్న‌లిజం రంగంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా.. ఉగాది నాడు.. సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వ‌నున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద మీడియా సంస్థ‌గా ఉన్న ఆంధ్రజ్యోతికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ ఏపీ ఇంచార్జ్‌గా ఉన్న కోరే సుధాక‌ర్‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం క‌ళార‌త్న పుర‌స్కారానికి ఎంపిక చేసింది. సుదీర్ఘ జ‌ర్న‌లిజం ప్ర‌స్థానంలో సుధాక‌ర్‌.. అనేక ప్ర‌యోగాలు చేశారు. రాజ‌కీయాలే కాకుండా.. మాన‌వీయ కోణాల్లో క‌థ‌నాలు అందించారు. కాగా.. క‌ళార‌త్న పుర‌స్కారం కింద‌.. ప్ర‌భుత్వం రూ.ల‌క్ష న‌గ‌దు, మొమెంటో, శ్శాలువాతో ఘ‌నంగా స‌త్క‌రించ‌నుంది.

This post was last modified on March 30, 2025 6:35 am

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

2 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

5 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

5 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

5 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

6 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

6 hours ago