Political News

సెకండ్ వేవ్ మొదలవుతుంటే స్కూళ్ళు తెరుస్తారా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు కరోనా వైరస్ కేసులు రోజుకు సగటున 3 వేలు రిజస్టర్ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతోందని ఆందోళన పెరిగిపోతోంది. వచ్చే మూడు, నాలుగు నెలల వరకు జనాలందరు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రప్రభుత్వం, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సమయంలో విద్యాసంస్దలు తెరవాలని జగన్ సర్కార్ నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది.

నవంబర్ 2వ తేదీ నుండి స్కూళ్ళు, కాలేజీలన్నింటినీ తెరవబోతున్నారు. డిసెంబర్ 14వ తేదీ నుండి ప్రాధమిక పాఠశాలలు స్టార్ట్ అవుతాయట. ఉన్నత విద్యాసంస్దల్లో ఏమో రోజుకు తరగతి గదిలోని టోటల్ స్ట్రెంగ్త్ లో 3వ వంతు విద్యార్ధులు మాత్రమే హాజరవ్వాలట. 9,10 తరగతులకు, ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు రోజుమార్చి రోజు ఒక్కపూట మాత్రమే హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పంది. అలాగే నవంబర్ 23 నుండి 6, 7, 8 తరగతుల విద్యార్ధులకు కూడా ఒంటిపూట బడులు మొదలవ్వబోతున్నాయి.

ఇక డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీలకు కూడా ప్రభుత్వం రకరకాల కరిక్యులమ్ విడుదల చేసింది. రోజు మార్చి రోజు కాలేజీ జరుగుతుందన్నది. తరగతికి ఎంతమంది విద్యార్ధులు హాజరవ్వాలి ? విద్యాసంస్ధకు రాని విద్యార్ధులకు టీచింగ్ ఆన్ లైన్లో జరగాలనేటువంటి రకరకాల నిబంధనలను చాలానే విధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యార్ధుల తరపున, మేనేజ్మెంట్ తరపున ఇన్ని రకాలుగా ఆలోచించిన ప్రభుత్వం మరి టీచర్ల తరపున ఏమీ ఆలోచించినట్లు లేదు.

విద్యార్ధలు రోజుమార్చి రోజు క్లాసులకు హాజరవుతారని ప్రభుత్వం చెప్పింది బాగానే ఉంది. విద్యాసంస్ధ మొత్తాన్ని శానిటైజ్ చేయాలని చెప్పింది కానీ ఆచరణలో ఎంత వరకు అమలవుతుందో గ్యారెంటీ లేదు. టీచర్లకు మాత్రం ఈ పద్దతి పెద్ద తలనొప్పనే చెప్పాలి. ఎలాగంటే ఒకే పాఠాన్ని రెండుసార్లు చెప్పాల్సుంటుంది. క్లాసులోని మొత్తం విద్యార్ధులు రెండు విడతలుగా హాజరవుతారంటే మరీ టీచర్లు చెప్పిన పాఠాన్నే చెప్పాల్సుంటుంది కదా.

ఇదే సమయంలో వందలాదిమంది విద్యార్ధులు ఒకేచోట చేరినపుడు వారిలో ఎవరకైనా కరోనా వైరస్ ఉంటే మిగిలిన వాళ్ళకు సోకితే అప్పుడు పరిస్దితేమిటి ? విదేశాల్లో వైరస్ ప్రభావం తగ్గిపోతోందన్న కారణంతోనే విద్యాసంస్ధలను తెరిచాయి. అయితే మళ్ళీ కరోనా చాలా స్పీడుగా వ్యాప్తి చెందింది. బహుశా ఇటువంటి కారణాలతోనే ప్రపంచదేశాల్లో మళ్ళీ కరోనా పెరిగిపోతుంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని మొత్తుకుంటున్నాయి. కరోనా వైరస్ కారణంగానే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించలేమని చెప్పిన ప్రభుత్వం విద్యాసంస్ధలు తెరవటానికి రెడీ అయిపోవటమే కొసమెరుపు.

This post was last modified on October 30, 2020 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

38 minutes ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

3 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

3 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

4 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

5 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

5 hours ago