Political News

సెకండ్ వేవ్ మొదలవుతుంటే స్కూళ్ళు తెరుస్తారా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు కరోనా వైరస్ కేసులు రోజుకు సగటున 3 వేలు రిజస్టర్ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతోందని ఆందోళన పెరిగిపోతోంది. వచ్చే మూడు, నాలుగు నెలల వరకు జనాలందరు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రప్రభుత్వం, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సమయంలో విద్యాసంస్దలు తెరవాలని జగన్ సర్కార్ నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది.

నవంబర్ 2వ తేదీ నుండి స్కూళ్ళు, కాలేజీలన్నింటినీ తెరవబోతున్నారు. డిసెంబర్ 14వ తేదీ నుండి ప్రాధమిక పాఠశాలలు స్టార్ట్ అవుతాయట. ఉన్నత విద్యాసంస్దల్లో ఏమో రోజుకు తరగతి గదిలోని టోటల్ స్ట్రెంగ్త్ లో 3వ వంతు విద్యార్ధులు మాత్రమే హాజరవ్వాలట. 9,10 తరగతులకు, ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు రోజుమార్చి రోజు ఒక్కపూట మాత్రమే హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పంది. అలాగే నవంబర్ 23 నుండి 6, 7, 8 తరగతుల విద్యార్ధులకు కూడా ఒంటిపూట బడులు మొదలవ్వబోతున్నాయి.

ఇక డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీలకు కూడా ప్రభుత్వం రకరకాల కరిక్యులమ్ విడుదల చేసింది. రోజు మార్చి రోజు కాలేజీ జరుగుతుందన్నది. తరగతికి ఎంతమంది విద్యార్ధులు హాజరవ్వాలి ? విద్యాసంస్ధకు రాని విద్యార్ధులకు టీచింగ్ ఆన్ లైన్లో జరగాలనేటువంటి రకరకాల నిబంధనలను చాలానే విధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యార్ధుల తరపున, మేనేజ్మెంట్ తరపున ఇన్ని రకాలుగా ఆలోచించిన ప్రభుత్వం మరి టీచర్ల తరపున ఏమీ ఆలోచించినట్లు లేదు.

విద్యార్ధలు రోజుమార్చి రోజు క్లాసులకు హాజరవుతారని ప్రభుత్వం చెప్పింది బాగానే ఉంది. విద్యాసంస్ధ మొత్తాన్ని శానిటైజ్ చేయాలని చెప్పింది కానీ ఆచరణలో ఎంత వరకు అమలవుతుందో గ్యారెంటీ లేదు. టీచర్లకు మాత్రం ఈ పద్దతి పెద్ద తలనొప్పనే చెప్పాలి. ఎలాగంటే ఒకే పాఠాన్ని రెండుసార్లు చెప్పాల్సుంటుంది. క్లాసులోని మొత్తం విద్యార్ధులు రెండు విడతలుగా హాజరవుతారంటే మరీ టీచర్లు చెప్పిన పాఠాన్నే చెప్పాల్సుంటుంది కదా.

ఇదే సమయంలో వందలాదిమంది విద్యార్ధులు ఒకేచోట చేరినపుడు వారిలో ఎవరకైనా కరోనా వైరస్ ఉంటే మిగిలిన వాళ్ళకు సోకితే అప్పుడు పరిస్దితేమిటి ? విదేశాల్లో వైరస్ ప్రభావం తగ్గిపోతోందన్న కారణంతోనే విద్యాసంస్ధలను తెరిచాయి. అయితే మళ్ళీ కరోనా చాలా స్పీడుగా వ్యాప్తి చెందింది. బహుశా ఇటువంటి కారణాలతోనే ప్రపంచదేశాల్లో మళ్ళీ కరోనా పెరిగిపోతుంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని మొత్తుకుంటున్నాయి. కరోనా వైరస్ కారణంగానే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించలేమని చెప్పిన ప్రభుత్వం విద్యాసంస్ధలు తెరవటానికి రెడీ అయిపోవటమే కొసమెరుపు.

Satya

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

2 hours ago

పుష్ప విలన్ కామెడీ చేస్తే…

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…

3 hours ago

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

3 hours ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

3 hours ago

కర్ణుడి కాంట్రావర్సి… కల్కి దర్శకుడి కౌంటర్

విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…

4 hours ago

పైరసీని నిలువరించడం సాధ్యమవుతుందా

ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…

4 hours ago