మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అలా ఒప్పందాలపై సంతకాలు కాగానే… ఇలా సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ సిద్ధమైపోయింది. అదే సమయంలో గట్స్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడెప్పుడు సహకారం లభిస్తుందా?అని ఎదురు చూసిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా…ఆ సంస్థ నుంచి సహకారం అందుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అంతే… రోజుల వ్యవధిలోనే ఈ సహకారానికి సంబంధించి ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అయ్యింది.
గేట్స్ ఫౌండేషన్ నుంచి సహకారం స్వీకరించడంతో పాటుగా ఆ సంస్థ సహకారాన్ని అందించే విషయాన్ని.. అంటే ఇరు వర్గాలనూ సరైన దారిలో నడిపే దిశగా ఓ టాస్క్ ఫోర్స్ ఉండాలని ఇటు కూటమి సర్కారు, అటు గేట్స్ ఫౌండేషన్ భావించాయి. ఇరు వర్గాలూ ఓకే భావనతో సాగుతున్న వేళ…ఈ ఒప్పందాలను సక్రమంగా అమలు చేయడంతో పాటుగా ఆ సహకారం నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టేలా మానీటరింగ్ చేసేందకు ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఓ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో పాటుగా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఉంటారు.
ఏపీలో విద్య, వ్యవసాయం, ఉపాది, సుపరిపాలన, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు గేట్స్ ఫౌండేషన్ తన సహకారాన్ని అందించనుంది. అంతేకాకుండా ఈ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ఫలితంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించడంపై గేట్స్ ఫౌండేషన్ తన సహకారాన్ని అందించనుంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పై రంగాల్లో ఏపీ పురోభివృద్ది సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఈ ఒప్పందం ఇతోదికంగా దోహదపడనుంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో ఈ ప్రాజెక్టు అతి త్వరలోనే పట్టాలెక్కబోతోందని చెప్పక తప్పదు.
సాధారణంగా ఏదైనా సంస్థ ఏపీ, తెలంగాణకో, లేదంటే ఇంకే రాష్ట్రానికో వచ్చిందంటే… ఆ సంస్థ ఆ రాష్ట్రంలో ఏం చేయనుంది? ఎంతమేర పెట్టుబడులు పెట్టనుంది? ఎంతమందికి ఉపాధి కల్పించనుంది?.. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన తాజా ఒప్పందం వీటికి అతీతం. సింగిల్ పైసా పెట్టుబడి లేదు. ఒక్కరికి కూడా ఉపాధి దక్కదు. స్థానిక ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. ఈ లెక్కన గేట్స్ ఫౌండూషన్ తో ఏపీ ఒప్పందం ఓ సరికొత్త ఒప్పందమే. దీని ఫలితాలు వచ్చాక గానీ.. దీని ప్రత్యేకత ఏమిటన్నది జనానికి అర్థం కాదనీ చెప్పాలి.
This post was last modified on March 27, 2025 9:40 pm
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…