రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే… ఆ సామెత కాస్తా… రాజు తలచుకుంటే పదవులకు కొదవా? అని చెప్పుకోవాల్సిందే. అసలే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. పార్టీ ఘోర పరాజయాన్ని ముందే ఊహించిన కొందరు ఎన్నికలకు ముందే పార్టీని వీడితే…ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలా మంది నేతలు పార్టీకి దూరమైపోయారు. మరి మిగిలి ఉన్న నేతలనైనా కాపాడుకోవాలి కదా. అందుకే కొత్తగా పదవులను సృష్టించి మరీ నేతలకు కట్టబెడుతున్నారు.
ఎక్కడనా పార్టీకి అధ్యక్షుడి తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, అదికార ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు… ఇలాంటి పదవులు ఉంటాయి. ఇక అనుబంధ విభాగాలకు ఆయా విభాగాల అధ్యక్షులు మాత్రమే ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓ కొత్త సంస్కృతికి తెర తీసింది. అనుబంధ విభాగాలకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటూ కొత్త పదవులను క్రియేట్ చేసేసింది. ఆయా పదవుల్లో ఒకింత యాక్టివ్ గా ఉండే నేతలకు అప్పజెబుతూ… వారికి పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర కట్టబెడుతున్నట్లుగా పదవులు ఇస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ఓ కొత్త పదవిని క్రియేట్ చేశారు. ఈ పదవిలో రాయలసీమలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా… ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ గా సిద్ధార్థ రెడ్డి పని చేశారు. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగంలో నాటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటగా సిద్ధార్థపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…