Political News

రాజు తలచుకుంటే… పదవులకు కొదవా?

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే… ఆ సామెత కాస్తా… రాజు తలచుకుంటే పదవులకు కొదవా? అని చెప్పుకోవాల్సిందే. అసలే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. పార్టీ ఘోర పరాజయాన్ని ముందే ఊహించిన కొందరు ఎన్నికలకు ముందే పార్టీని వీడితే…ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలా మంది నేతలు పార్టీకి దూరమైపోయారు. మరి మిగిలి ఉన్న నేతలనైనా కాపాడుకోవాలి కదా. అందుకే కొత్తగా పదవులను సృష్టించి మరీ నేతలకు కట్టబెడుతున్నారు.

ఎక్కడనా పార్టీకి అధ్యక్షుడి తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, అదికార ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు… ఇలాంటి పదవులు ఉంటాయి. ఇక అనుబంధ విభాగాలకు ఆయా విభాగాల అధ్యక్షులు మాత్రమే ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓ కొత్త సంస్కృతికి తెర తీసింది. అనుబంధ విభాగాలకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటూ కొత్త పదవులను క్రియేట్ చేసేసింది. ఆయా పదవుల్లో ఒకింత యాక్టివ్ గా ఉండే నేతలకు అప్పజెబుతూ… వారికి పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర కట్టబెడుతున్నట్లుగా పదవులు ఇస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ఓ కొత్త పదవిని క్రియేట్ చేశారు. ఈ పదవిలో రాయలసీమలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా… ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ గా సిద్ధార్థ రెడ్డి పని చేశారు. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగంలో నాటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటగా సిద్ధార్థపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.

This post was last modified on March 27, 2025 5:17 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

20 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago