Political News

భూభారతి వ‌ర్సెస్‌ ధ‌ర‌ణి: కాంగ్రెస్- బీఆర్ ఎస్ ఎన్నిక‌ల స‌వాళ్లు

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆవేశాలు.. ఆగ్ర‌హాలు కామ‌న్‌గా మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి., ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కుల‌కు మ‌ధ్య వాద ప్ర‌తివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా బుధ‌వారం నాటి స‌భ‌లో ఎన్నిక‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ‘భూభార‌తి’ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ.. భూభారతిని ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుంటున్నార‌ని అన్నారు.

భూభారతిలో అక్ర‌మాల‌కు అవ‌కాశం లేద‌ని.. ఎవ‌రూ రూపాయి లంచం తీసుకునే ఆస్కారం కూడా లేద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో గ్రామీణ ప్ర‌జ‌లు భూభార‌తి విష‌యంలో ఆస‌క్తిగా ఉన్నార‌ని.. ఎంతో ఆద‌రిస్తున్నార‌ని చెప్పారు. భూభార‌తి అమ‌లు త‌ర్వాత‌.. సీఎం రేవంత్ రెడ్డిని రైతులు, ప్ర‌జ‌లు.. దేవుడిలెక్క కొలుస్తున్నార‌ని కూడా మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. తాము భూభార‌తి అజెండాతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి ఓట్లు అడుగుతామ‌ని చెప్పారు.

దీనిపై స్పందించిన బీఆర్ ఎస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు అమ‌లు చేస్తున్న‌ది భూ భార‌తి కాదు.. భూ హార‌తి” అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. అధికార పార్టీ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నినాదాలు చేశారు. మ‌ళ్లీ ప‌ల్లా కొన‌సాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు భూభార‌తి అడ్డుపెట్టుకుని గ్రామాల్లో వంద‌ల ఎక‌రాల భూముల‌ను సొంతం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. అందుకే.. తాము భూభార‌తి కాదు.. హార‌తి అంటున్నామ‌న్నారు.

ఈ క్ర‌మంలోనే.. “మీరు భూభార‌తిపై అంత న‌మ్మ‌కం పెట్టుకున్నారు కాబ‌ట్టి.. మీరు భూభార‌తి అజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్తే.. మేం(బీఆర్ ఎస్‌) ధ‌ర‌ణి అజెండాతో ఎన్నిక‌లకు వెళ్తాం. ప్ర‌జ‌లు ఎవ‌రిని ఆద‌రిస్తారో చూద్దాం” అని ప‌ల్లా స‌వాల్ విసిరారు. దీనిని మంత్రి పొంగులేటి కూడా.. అలాగే వెళ్తామంటూ.. ప్ర‌తిస‌వాల్ రువ్వారు. దీంతో స‌భ ఇరు ప‌క్షాల మ‌ధ్య‌ తీవ్ర వాగ్యుద్ధం, స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో అట్టుడికింది. ఇదిలావుంటే.. ధ‌రణి కార‌ణంగానే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ ఎస్ న‌ష్ట‌పోయింద‌న్న వాద‌న బ‌లంగా వినిపించిన విష‌యం తెలిసిందే. 2023 ఎన్నిక‌ల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ ఎస్ తుడిచి పెట్టుకుపోయిన విష‌యం గ‌మ‌నార్హం.

This post was last modified on March 26, 2025 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago