Political News

జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు ప‌క్షులు!

వైసీపీ త‌ర‌ఫున గ‌త ప్ర‌భుత్వంలో ఉండి.. పార్టీని, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేస‌మ‌యంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కులైన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను ఇష్టానుసారంగా దూషించిన వారు ఇప్పుడు జైల్లో మ‌గ్గుతున్న విష‌యం తెలిసిందే. వీరిలో ఒక్క పోసాని కృష్ణ‌ముర‌ళి మాత్ర‌మే అతి క‌ష్టంమీద బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అది కూడా అనేక ష‌రతుల‌కు లోబ‌డి కోర్టు.. ఆయ‌న‌కు ష‌ర‌తులు ఇచ్చింది. ఇక‌, బెయిల్ రాకుండా.. మ‌గ్గుతున్న‌వారు కూడా ఉన్నారు.

వీరిలో కీల‌క నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, అదేవిధంగా సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగ‌డ్డ అనిల్‌కుమార్ వంటివారు ఉన్నారు. వీరు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారో కూడా తెలియ‌ని ఒక సందిగ్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాజాగా మంగ‌ళ‌వారంతో వంశీకి ఉన్న రిమాండ్ గ‌డువు ముగిసింది. దీంతో ఆయ‌న ఇక‌, త‌న‌కు బెయిల్ ద‌క్కుతుంద‌ని సాయంత్రం వ‌ర‌కు ఎదురు చూశారు. కానీ, విజ‌య‌వాడ కోర్టు మాత్రం బెయిల్ పిటిష‌న్పై విచార‌ణ‌ను వాయిదా వేసింది. దీంతో వంశీని వ‌చ్చే నెల 8వ తేదీ వ‌ర‌కు మ‌ళ్లీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ ప‌రిణామాల‌తో వంశీ స‌హా ఆయ‌న అనుచ‌రులు పార్టీపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాము ఇన్నిక‌ష్టాల్లో ఉంటే.. క‌నీసం న్యాయ‌సాయం కూడా చేయ‌డం లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నాయ‌కుల నుంచి క‌నీసం ప‌రామ‌ర్శ కూడా క‌రువైంద‌ని.. అప్పుడెప్పుడో.. ఒక‌సారి సీఎం జ‌గ‌న్ వ‌చ్చి వెళ్ల‌డ‌మే త‌ప్ప‌. ఆ త‌ర్వాత త‌మ మొహం కూడా చూడ‌లేద‌న్న‌ది వంశీ ఆవేద‌న‌. ఇక‌, ఇదే కేసులో అరెస్ట‌యిన‌.. మ‌రికొంద‌రు కూడా ఇదే ఆవేద‌న ఆందోళ‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా బెయిల్ ద‌క్క‌క‌పోవ‌డం.. ఇప్ప‌టికే రెండు మాసాలుగా జైల్లోఉండ‌డంతో వంశీ అయితే.. నిప్పులు చెరుగుతున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగ‌డ్డ అనిల్ ప‌రిస్థితి పెనంపై నుంచిపొయ్యిలో ప‌డిన‌ట్టు అయింది. ఆయ‌న‌పై కోర్టు ధిక్క‌ర‌ణ కింద కేసు పెట్టాల‌ని పోలీసులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ కోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంది. దీనిపై నిర్ణ‌యం తీసుకుంటే.. ఆయ‌న కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. రాజ‌మండ్రి జైలు అధికారుల ముందు నిర్ణీత స‌మ‌యంలోగా లొంగిపోక‌పోవ‌డాన్ని కూడా కోర్టు తీవ్రంగా తీసుకుంది. ఇలాంటి స‌మ‌యంలోత‌న‌కు న్యాయ‌సాయం అందించేందుకు బ‌ల‌మైన న్యాయ‌వాదుల‌ను నియ‌మించేందుకు పార్టీ ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌ని బోరుగ‌డ్డ త‌న వారితో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత చేసింది ఎవ‌రికోసం.. నా కోస‌మా? అని అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జైలు ప‌క్ష‌లు జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్నారు.

This post was last modified on March 25, 2025 10:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విక్రమ్ సినిమాకు ఇలాంటి పరిస్థితా

ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…

16 minutes ago

‘జ‌గ‌న్ 2.0’.. వైసీపీ లోక‌ల్ టాక్ ఇదే.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 2.0పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ 2.0 చాలా భి…

18 minutes ago

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం… ఐసీసీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…

2 hours ago

జ‌మిలి ప‌క్కా.. రాసిపెట్టుకోవ‌చ్చు!

దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతాయా? జ‌ర‌గవా? ఈ విష‌యంలో బీజేపీ అడుగులు ముందుకు ప‌డ‌తాయా? ప‌డ‌వా? అనే సందేహాలు త‌ర‌చుగా…

3 hours ago

వాయిదాల వ్యూహంలో యువి క్రియేషన్స్

ప్రభాస్ కు అత్యంత సన్నిహితమైన బ్యానర్ గా ఇంకా చెప్పాలంటే అతని స్వంత సంస్థలా ఇండస్ట్రీ భావించే యువి క్రియేషన్స్…

4 hours ago

వైఎస్ అవినాశ్ ఇరుక్కుపోయినట్టేనా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక…

4 hours ago