Political News

“మూడేళ్ల త‌ర్వాత.. జ‌గ‌న్ వ‌చ్చేది జైలుకే.. స్వాగ‌త ఏర్పాట్లు చేస్తా”

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “మూడేళ్ల త‌ర్వాత‌.. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే. అప్పుడు మీకు న్యాయం చేస్తా” అంటూ.. పులివెందుల రైతులను ఉద్దేశించి వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అకాల వ‌ర్షంతో కుప్ప‌కూలిన అర‌టి తోట‌లను ప‌రిశీలించి, రైతుల‌ను పరామ‌ర్శించిన జ‌గ‌న్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లను ఇమిటేట్ చేసిన బుచ్చ‌య్య చౌద‌రి.. జ‌గ‌న్‌పై సెటైర్లు వేశారు.

“ఔను.. మూడేళ్ల త‌ర్వాత‌.. జ‌గ‌న్ వ‌చ్చేది రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకే” అని వ్యాఖ్యానించారు. తాజాగా అమ‌రావ‌తిలో బుచ్చయ్య‌ మీడియాతో మాట్లాడారు. “జ‌గ‌న్ త‌మ్ముడు.. గురించి నా నోటితో చెప్ప‌లేను” అని వ్యాఖ్యానించిన బుచ్చ‌య్య‌.. జైలు వారికి, కోర్టు వారికి బాగా తెలుసున‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారు త‌ప్ప‌కుండా.. జ‌గ‌న్ ను మూడేళ్లు కాదు.. మూడేళ్ల‌లోపే.. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లిస్తార‌ని.. అప్పుడు తానే స్వ‌యంగా స్వాగ‌త ఏర్పాట్లు చేస్తాన‌ని బుచ్చ‌య్య అన్నారు.

మ‌ద్యం, ఇసుక కుంభ‌కోణాలు స‌హా.. జ‌గ‌న‌న్న లే అవుట్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై పోలీసులు కూపీ లాగుతున్నార‌ని చెప్పారు. వీటిపై త్వ‌ర‌లోనే నివేదిక‌లు అందుతాయ‌ని.. పక్కా ఆధారాల‌తో కోర్టుల ద్వారా జ‌గ‌న్ ను జైలుకు పంపిస్తామ‌ని గోరంట్ల చెప్పారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి 10 మాసాలు కూడా కాకుండానే.. జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ప్ర‌జ‌లు న‌వ్వుతున్నార‌ని.. ఆయ‌న‌కు ఇంగితం లేద‌ని..త‌ల్లి చెల్లిని ఇంటి నుంచి త‌రిమేశాడ‌ని.. రేపు అధికారం ఇస్తే.. ప్ర‌జ‌ల‌ను కూడా త‌రిమేస్తాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి వారు జైలుకు రావ‌డం త‌ప్ప‌..మ‌రో మార్గం లేద‌న్నారు.

ఆ విష‌యంపై త‌ర్వాత..

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై టీడీపీకి, జ‌న‌సేన‌కు ఒక స్టాండు ఉంద‌ని గోరంట్ల తెలిపారు. “ఎవ‌రు మాత్రం న‌ష్టం జ‌రిగితే ఊరుకుంటారు. ప్ర‌జ‌లు లేందే మేం లేం. ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగినా.. రాష్ట్రానికి అన్యాయం జ‌రిగినా ఎవ‌రు మాత్రం చూస్తూ ఉంటారు. డీలిమిటేష‌న్‌ను జ‌నాభా ప్రాతిప‌దిక‌న చేయ‌డం స‌రికాదు. అయితే.. దీనిపై మేం రోడ్డున ప‌డిపోయి.. యాగీ చేయం. ఎక్క‌డ ఎలా స్పందించాలో .. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కల్యాణ్‌ల‌కు బాగా తెలుసు. అప్పటి వ‌ర‌కు వెయిట్ చేద్దాం” అని బుచ్చ‌య్య అన్నారు.

This post was last modified on March 25, 2025 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

1 hour ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

2 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

2 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

7 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

10 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

11 hours ago