Political News

కోర్టుల‌తో ప‌రిహాస‌మా?: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సుప్రీం ఫైర్

తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదులైన జంపింగ్‌ ఎమ్మెల్యేల త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. నాలుగు వారాల‌స‌మ‌యం కోరారు. తాము అఫిడ‌విట్‌లు వేసేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జస్టిస్ బీఆర్ గ‌వాయ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “కోర్టుల‌తో ప‌రిహాస‌మా? మా స‌మ‌యాన్ని వృధా చేస్తారా?” అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేయ‌క‌పోతే.. భ‌విష్య‌త్తులో ఏ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు గెలిచినా ఇలాంటి ప‌రిస్థితులే ఎదురుకానున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ పార్టీపై గెలిచి.. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయార‌ని.. ఇది ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం తీవ్ర నేర‌మ‌ని తెలిపారు. ఈ విష‌యంపై హైకోర్టును కూడా ఆశ్ర‌యించామ‌న్నా రు. అయితే.. దీనిని స్పీక‌ర్ కోర్టులో ప‌రిమితం అయింద‌న్నారు.

స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. అందుకే కోర్టును ఆశ్ర‌యించామ‌న్నారు. దీనిపై త్వ‌ర‌గా తేల్చాలని తెలిపారు. గ‌తంలోనే ప్ర‌తివాదుల‌కు 4 వారాల స‌మ‌యం ఇచ్చార‌ని, ఇప్పుడు అంత స‌మ‌యం అవ‌సరం లేద‌న్నారు. పైగా ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన దానం నాగేంద‌ర్‌.. ఎంపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశార‌ని.. ఓడిపోయిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటూ.. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నార‌ని తెలిపారు.

ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని బీఆర్ఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి జంపింగుల త‌ర‌ఫు న్యాయ‌వాది త‌మ‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా కోర్టుల‌తో ఆడుకుంటున్నారా? కోర్టులంటే ప‌రిహాస‌మా? అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.

This post was last modified on March 25, 2025 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

24 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago