Political News

కోర్టుల‌తో ప‌రిహాస‌మా?: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సుప్రీం ఫైర్

తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదులైన జంపింగ్‌ ఎమ్మెల్యేల త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. నాలుగు వారాల‌స‌మ‌యం కోరారు. తాము అఫిడ‌విట్‌లు వేసేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జస్టిస్ బీఆర్ గ‌వాయ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “కోర్టుల‌తో ప‌రిహాస‌మా? మా స‌మ‌యాన్ని వృధా చేస్తారా?” అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేయ‌క‌పోతే.. భ‌విష్య‌త్తులో ఏ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు గెలిచినా ఇలాంటి ప‌రిస్థితులే ఎదురుకానున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ పార్టీపై గెలిచి.. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయార‌ని.. ఇది ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం తీవ్ర నేర‌మ‌ని తెలిపారు. ఈ విష‌యంపై హైకోర్టును కూడా ఆశ్ర‌యించామ‌న్నా రు. అయితే.. దీనిని స్పీక‌ర్ కోర్టులో ప‌రిమితం అయింద‌న్నారు.

స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. అందుకే కోర్టును ఆశ్ర‌యించామ‌న్నారు. దీనిపై త్వ‌ర‌గా తేల్చాలని తెలిపారు. గ‌తంలోనే ప్ర‌తివాదుల‌కు 4 వారాల స‌మ‌యం ఇచ్చార‌ని, ఇప్పుడు అంత స‌మ‌యం అవ‌సరం లేద‌న్నారు. పైగా ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన దానం నాగేంద‌ర్‌.. ఎంపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశార‌ని.. ఓడిపోయిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటూ.. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నార‌ని తెలిపారు.

ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని బీఆర్ఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి జంపింగుల త‌ర‌ఫు న్యాయ‌వాది త‌మ‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా కోర్టుల‌తో ఆడుకుంటున్నారా? కోర్టులంటే ప‌రిహాస‌మా? అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.

This post was last modified on March 25, 2025 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

32 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

51 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago