ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు మరోసారి వేతనాలు పెంచింది. రెండేళ్ల కిందట ఒకసారి వేతనాలు పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి 24 శాతం మేరకు వారికి వేతనాలు పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ వేతనాలు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. పెంచిన వేతనాలు.. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అంటే.. ప్రస్తుతం పెంచిన వేతనాలకు సంబంధించిన ఏడాది బకాయిలను వచ్చే నెల 1వ తేదీ వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. దీంతో ఎంపీలకు చేతినిండా డబ్బు అందనుంది.
ఎంతెంత పెంచారు?
గతంలో 2022లో ఎంపీ వేతనం 80 వేలు ఉండగా.. అప్పట్లో లక్షరూపాయలకు పెంచారు. ఇప్పుడు 24 శాతం పెంచడంతో.. ఈ వేతనం లక్షా 24 వేలకు పెరిగింది. దీంతో ఒక్కొక్క ఎంపీకి.. సభకు వెళ్లినా.. వెళ్లకపోయినా.. నెలకు 1.24 లక్షల చొప్పున వేతనం బ్యాంకు ఖాతాల్లో పడనుంది. అదేవిధంగా సభకు హాజరైతే.. ఇచ్చే రోజు వారి భత్యం రూ.2000 ను కూడా పెంచారు. ఇది రూ.2500లకు చేరింది. అంటే.. సభ్యులు పార్లమెంటు జరిగిన సమయంలో సభకు హాజరైతే.. రోజుకు అదనంగా రూ.2500 అందనుంది. ఇది కూడా.. గత ఏడాది నుంచి లెక్కగట్టి బకాయిలు ఇవ్వనున్నారు.
ఇక, ప్రతి ఆరు మాసాలకు ఇచ్చే కన్వీనియెన్స్ బిల్లులను ఏకంగా 100 శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇది రూ.35000 ఉండగా.. ఇక నుంచి రూ.70000లకు చేరుతుంది. ఇది కూడా గత ఏప్రిల్ 1 నుంచే అమలు కానుంది. అదేవిధంగా కారు డ్రైవర్ అలవెన్సు, పెట్రోల్ అలవెన్సు, ఫోన్ చార్జీలను కూడా 100 శాతం పెంచారు. ఇక, మాజీ పార్లమెంటు సభ్యులకు ఇస్తున్న పింఛను ను సైతం కేంద్రం సవరించింది. ఇది 25 వేల రూపాయలు ఉంది. దీనిని 24 శాతం చొప్పున పెంచడంతో ఇది 31 వేలకు చేరింది. దీనిని కూడా గత ఏడాది ఏప్రిల్ నుంచి లెక్కించి బకాయిలను వచ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లించనున్నారు. దీంతో మొత్తంగా ఎంపీలకు భారీ ఎత్తున నగదు చేతికి చేరనుంది.
This post was last modified on March 24, 2025 10:36 pm
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…