Political News

ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు.. మోడీ కీల‌క నిర్ణ‌యం!

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మ‌రోసారి వేత‌నాలు పెంచింది. రెండేళ్ల కింద‌ట ఒక‌సారి వేత‌నాలు పెంచిన కేంద్రం.. తాజాగా మ‌రోసారి 24 శాతం మేర‌కు వారికి వేత‌నాలు పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా ఈ వేత‌నాలు పెంచుతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పెంచిన వేత‌నాలు.. గ‌త ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అంటే.. ప్ర‌స్తుతం పెంచిన వేత‌నాలకు సంబంధించిన ఏడాది బ‌కాయిల‌ను వ‌చ్చే నెల 1వ తేదీ వేత‌నంతో క‌లిపి ఇవ్వ‌నున్నారు. దీంతో ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు అంద‌నుంది.

ఎంతెంత పెంచారు?

గ‌తంలో 2022లో ఎంపీ వేత‌నం 80 వేలు ఉండ‌గా.. అప్ప‌ట్లో ల‌క్ష‌రూపాయ‌ల‌కు పెంచారు. ఇప్పుడు 24 శాతం పెంచ‌డంతో.. ఈ వేతనం ల‌క్షా 24 వేల‌కు పెరిగింది. దీంతో ఒక్కొక్క ఎంపీకి.. స‌భ‌కు వెళ్లినా.. వెళ్ల‌క‌పోయినా.. నెల‌కు 1.24 ల‌క్ష‌ల చొప్పున వేత‌నం బ్యాంకు ఖాతాల్లో ప‌డ‌నుంది. అదేవిధంగా స‌భ‌కు హాజ‌రైతే.. ఇచ్చే రోజు వారి భ‌త్యం రూ.2000 ను కూడా పెంచారు. ఇది రూ.2500ల‌కు చేరింది. అంటే.. స‌భ్యులు పార్ల‌మెంటు జ‌రిగిన స‌మ‌యంలో స‌భ‌కు హాజ‌రైతే.. రోజుకు అద‌నంగా రూ.2500 అంద‌నుంది. ఇది కూడా.. గ‌త ఏడాది నుంచి లెక్క‌గ‌ట్టి బ‌కాయిలు ఇవ్వ‌నున్నారు.

ఇక‌, ప్ర‌తి ఆరు మాసాల‌కు ఇచ్చే క‌న్వీనియెన్స్ బిల్లుల‌ను ఏకంగా 100 శాతానికి పెంచారు. ప్ర‌స్తుతం ఇది రూ.35000 ఉండ‌గా.. ఇక నుంచి రూ.70000ల‌కు చేరుతుంది. ఇది కూడా గ‌త ఏప్రిల్ 1 నుంచే అమ‌లు కానుంది. అదేవిధంగా కారు డ్రైవ‌ర్ అల‌వెన్సు, పెట్రోల్ అల‌వెన్సు, ఫోన్ చార్జీల‌ను కూడా 100 శాతం పెంచారు. ఇక‌, మాజీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఇస్తున్న పింఛ‌ను ను సైతం కేంద్రం స‌వ‌రించింది. ఇది 25 వేల రూపాయ‌లు ఉంది. దీనిని 24 శాతం చొప్పున పెంచ‌డంతో ఇది 31 వేల‌కు చేరింది. దీనిని కూడా గ‌త ఏడాది ఏప్రిల్ నుంచి లెక్కించి బ‌కాయిల‌ను వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లించ‌నున్నారు. దీంతో మొత్తంగా ఎంపీల‌కు భారీ ఎత్తున న‌గ‌దు చేతికి చేర‌నుంది.

This post was last modified on March 24, 2025 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago