Political News

ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు.. మోడీ కీల‌క నిర్ణ‌యం!

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మ‌రోసారి వేత‌నాలు పెంచింది. రెండేళ్ల కింద‌ట ఒక‌సారి వేత‌నాలు పెంచిన కేంద్రం.. తాజాగా మ‌రోసారి 24 శాతం మేర‌కు వారికి వేత‌నాలు పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా ఈ వేత‌నాలు పెంచుతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పెంచిన వేత‌నాలు.. గ‌త ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అంటే.. ప్ర‌స్తుతం పెంచిన వేత‌నాలకు సంబంధించిన ఏడాది బ‌కాయిల‌ను వ‌చ్చే నెల 1వ తేదీ వేత‌నంతో క‌లిపి ఇవ్వ‌నున్నారు. దీంతో ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు అంద‌నుంది.

ఎంతెంత పెంచారు?

గ‌తంలో 2022లో ఎంపీ వేత‌నం 80 వేలు ఉండ‌గా.. అప్ప‌ట్లో ల‌క్ష‌రూపాయ‌ల‌కు పెంచారు. ఇప్పుడు 24 శాతం పెంచ‌డంతో.. ఈ వేతనం ల‌క్షా 24 వేల‌కు పెరిగింది. దీంతో ఒక్కొక్క ఎంపీకి.. స‌భ‌కు వెళ్లినా.. వెళ్ల‌క‌పోయినా.. నెల‌కు 1.24 ల‌క్ష‌ల చొప్పున వేత‌నం బ్యాంకు ఖాతాల్లో ప‌డ‌నుంది. అదేవిధంగా స‌భ‌కు హాజ‌రైతే.. ఇచ్చే రోజు వారి భ‌త్యం రూ.2000 ను కూడా పెంచారు. ఇది రూ.2500ల‌కు చేరింది. అంటే.. స‌భ్యులు పార్ల‌మెంటు జ‌రిగిన స‌మ‌యంలో స‌భ‌కు హాజ‌రైతే.. రోజుకు అద‌నంగా రూ.2500 అంద‌నుంది. ఇది కూడా.. గ‌త ఏడాది నుంచి లెక్క‌గ‌ట్టి బ‌కాయిలు ఇవ్వ‌నున్నారు.

ఇక‌, ప్ర‌తి ఆరు మాసాల‌కు ఇచ్చే క‌న్వీనియెన్స్ బిల్లుల‌ను ఏకంగా 100 శాతానికి పెంచారు. ప్ర‌స్తుతం ఇది రూ.35000 ఉండ‌గా.. ఇక నుంచి రూ.70000ల‌కు చేరుతుంది. ఇది కూడా గ‌త ఏప్రిల్ 1 నుంచే అమ‌లు కానుంది. అదేవిధంగా కారు డ్రైవ‌ర్ అల‌వెన్సు, పెట్రోల్ అల‌వెన్సు, ఫోన్ చార్జీల‌ను కూడా 100 శాతం పెంచారు. ఇక‌, మాజీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఇస్తున్న పింఛ‌ను ను సైతం కేంద్రం స‌వ‌రించింది. ఇది 25 వేల రూపాయ‌లు ఉంది. దీనిని 24 శాతం చొప్పున పెంచ‌డంతో ఇది 31 వేల‌కు చేరింది. దీనిని కూడా గ‌త ఏడాది ఏప్రిల్ నుంచి లెక్కించి బ‌కాయిల‌ను వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లించ‌నున్నారు. దీంతో మొత్తంగా ఎంపీల‌కు భారీ ఎత్తున న‌గ‌దు చేతికి చేర‌నుంది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

7 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

8 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

8 hours ago