Political News

ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు.. మోడీ కీల‌క నిర్ణ‌యం!

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మ‌రోసారి వేత‌నాలు పెంచింది. రెండేళ్ల కింద‌ట ఒక‌సారి వేత‌నాలు పెంచిన కేంద్రం.. తాజాగా మ‌రోసారి 24 శాతం మేర‌కు వారికి వేత‌నాలు పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా ఈ వేత‌నాలు పెంచుతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పెంచిన వేత‌నాలు.. గ‌త ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అంటే.. ప్ర‌స్తుతం పెంచిన వేత‌నాలకు సంబంధించిన ఏడాది బ‌కాయిల‌ను వ‌చ్చే నెల 1వ తేదీ వేత‌నంతో క‌లిపి ఇవ్వ‌నున్నారు. దీంతో ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు అంద‌నుంది.

ఎంతెంత పెంచారు?

గ‌తంలో 2022లో ఎంపీ వేత‌నం 80 వేలు ఉండ‌గా.. అప్ప‌ట్లో ల‌క్ష‌రూపాయ‌ల‌కు పెంచారు. ఇప్పుడు 24 శాతం పెంచ‌డంతో.. ఈ వేతనం ల‌క్షా 24 వేల‌కు పెరిగింది. దీంతో ఒక్కొక్క ఎంపీకి.. స‌భ‌కు వెళ్లినా.. వెళ్ల‌క‌పోయినా.. నెల‌కు 1.24 ల‌క్ష‌ల చొప్పున వేత‌నం బ్యాంకు ఖాతాల్లో ప‌డ‌నుంది. అదేవిధంగా స‌భ‌కు హాజ‌రైతే.. ఇచ్చే రోజు వారి భ‌త్యం రూ.2000 ను కూడా పెంచారు. ఇది రూ.2500ల‌కు చేరింది. అంటే.. స‌భ్యులు పార్ల‌మెంటు జ‌రిగిన స‌మ‌యంలో స‌భ‌కు హాజ‌రైతే.. రోజుకు అద‌నంగా రూ.2500 అంద‌నుంది. ఇది కూడా.. గ‌త ఏడాది నుంచి లెక్క‌గ‌ట్టి బ‌కాయిలు ఇవ్వ‌నున్నారు.

ఇక‌, ప్ర‌తి ఆరు మాసాల‌కు ఇచ్చే క‌న్వీనియెన్స్ బిల్లుల‌ను ఏకంగా 100 శాతానికి పెంచారు. ప్ర‌స్తుతం ఇది రూ.35000 ఉండ‌గా.. ఇక నుంచి రూ.70000ల‌కు చేరుతుంది. ఇది కూడా గ‌త ఏప్రిల్ 1 నుంచే అమ‌లు కానుంది. అదేవిధంగా కారు డ్రైవ‌ర్ అల‌వెన్సు, పెట్రోల్ అల‌వెన్సు, ఫోన్ చార్జీల‌ను కూడా 100 శాతం పెంచారు. ఇక‌, మాజీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఇస్తున్న పింఛ‌ను ను సైతం కేంద్రం స‌వ‌రించింది. ఇది 25 వేల రూపాయ‌లు ఉంది. దీనిని 24 శాతం చొప్పున పెంచ‌డంతో ఇది 31 వేల‌కు చేరింది. దీనిని కూడా గ‌త ఏడాది ఏప్రిల్ నుంచి లెక్కించి బ‌కాయిల‌ను వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లించ‌నున్నారు. దీంతో మొత్తంగా ఎంపీల‌కు భారీ ఎత్తున న‌గ‌దు చేతికి చేర‌నుంది.

This post was last modified on March 24, 2025 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago