తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఆస్తులు సంపాయించుకోలేదని.. ఒక్క కేసీఆర్ తప్ప.. అని అన్నారు. అంతేకాదు.. తమ జీవితాలను కూడా రాష్ట్రం కోసం వదులుకున్నారని చెప్పారు. కానీ, కేసీఆర్ వంటి వ్యక్తులు రాష్ట్రాన్నికుక్కలు చింపిన విస్తరి మాదిరిగా చేస్తారని అనుకుంటే.. అసలు తెలంగాణ కోసం ఎవరూ పోరాటం చేసేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బడ్జెట్ భేటీలో స్పందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.. ఆంధ్ర పాలకులతో విసుగు చెందిన తెలంగాణ పౌరులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని చెప్పారు. ఈ క్రమంలో ఆస్తులు కూడా వదులుకున్నారని.. అనేక మంది అప్పులు చేసి ఉద్యమాలు నిర్మించారని.. ఈ విషయం తనకు ప్రత్యక్షంగా వీక్షించినట్టు తెలిపారు. అదేవిధంగా చాలా మంది కుటుంబాలను కూడా వదులుకున్నారని తెలిపారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదులుకుని రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకున్నట్టు చెప్పారు.
కానీ, కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక.. వారి ఆశలను చిదిమేశారని.. రాష్ట్రాన్ని తన 10 సంవత్సరాల ఏలుబడిలో సర్వనాశనం చేశారని అన్నారు. అందుకే.. ఈ విషయాన్ని ఉద్యమకారులు కనుక ముందుగానే ఊహించుకుని ఉంటే.. అసలు రోడ్డెక్కేవారు కూడా కాదని.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే వారు కూడా కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని.. ప్రశ్నించడమే తప్పన్నట్టుగా నాడు, నేడు కూడా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. దీంతో ఉద్యమకారులు.. తెలంగాణ కోసం ఎందుకు పోరాడామా? అని తలలు పట్టుకుంటున్నారని.. తీవ్ర విమర్శలు గుప్పించారు.
This post was last modified on March 24, 2025 3:06 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…