తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఆస్తులు సంపాయించుకోలేదని.. ఒక్క కేసీఆర్ తప్ప.. అని అన్నారు. అంతేకాదు.. తమ జీవితాలను కూడా రాష్ట్రం కోసం వదులుకున్నారని చెప్పారు. కానీ, కేసీఆర్ వంటి వ్యక్తులు రాష్ట్రాన్నికుక్కలు చింపిన విస్తరి మాదిరిగా చేస్తారని అనుకుంటే.. అసలు తెలంగాణ కోసం ఎవరూ పోరాటం చేసేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బడ్జెట్ భేటీలో స్పందించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.. ఆంధ్ర పాలకులతో విసుగు చెందిన తెలంగాణ పౌరులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని చెప్పారు. ఈ క్రమంలో ఆస్తులు కూడా వదులుకున్నారని.. అనేక మంది అప్పులు చేసి ఉద్యమాలు నిర్మించారని.. ఈ విషయం తనకు ప్రత్యక్షంగా వీక్షించినట్టు తెలిపారు. అదేవిధంగా చాలా మంది కుటుంబాలను కూడా వదులుకున్నారని తెలిపారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదులుకుని రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకున్నట్టు చెప్పారు.
కానీ, కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక.. వారి ఆశలను చిదిమేశారని.. రాష్ట్రాన్ని తన 10 సంవత్సరాల ఏలుబడిలో సర్వనాశనం చేశారని అన్నారు. అందుకే.. ఈ విషయాన్ని ఉద్యమకారులు కనుక ముందుగానే ఊహించుకుని ఉంటే.. అసలు రోడ్డెక్కేవారు కూడా కాదని.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే వారు కూడా కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని.. ప్రశ్నించడమే తప్పన్నట్టుగా నాడు, నేడు కూడా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. దీంతో ఉద్యమకారులు.. తెలంగాణ కోసం ఎందుకు పోరాడామా? అని తలలు పట్టుకుంటున్నారని.. తీవ్ర విమర్శలు గుప్పించారు.
This post was last modified on March 24, 2025 3:06 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…