Political News

పార్లమెంటులో ‘అరకు’!… ఒకటి కాదు, రెండు స్టాళ్లు!

ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పంలో సోమవారం ఓ కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చంద్రబాబు కృషితో ఇప్పటికే అరకు కాఫీకి జియో ట్యాగ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అత్యున్నత చట్టసభ పారమెంటులోకి అరకు కాఫీ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. సోమవారం పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ, రాజ్యసభ పరిధుల్లో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు అయ్యాయి.

ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీకి చెందిన కూటమి పార్లమెంటు సభ్యులు, ఏపీ ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజిన సహకార సంస్థ డైరెక్టర్లు హాజరైన ఈ కార్యక్రమాల్లో భాగంగా లోక్ సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ను ప్రారంబించారు. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ ప్రాంగణంలో అరకు స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు కాఫీని సేవిస్తూ వారంతా ఫొటోలకు ఫోజులిచ్చారు.

అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించాలన్న దిశగా సాగుతున్న చంద్రబాబు… రాష్ట్రానికి వచ్చే అతిథులకు అరకు కాఫీతో ప్రత్యేకంగా రూపొందించిన గిఫ్ట్ ప్యాక్ లను అందిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా…తాను బేటీ అయ్యే ప్రముఖులకు ఆ ప్యాకెట్లను అందిస్తూ సాగుతున్నారు. అరకు కాఫీ ప్రత్యేకతను గురించి వివరిస్తున్నారు. ఇటీవలి దావోస్ సదస్సులోనూ ఏపీ పెవిలియన్ లో అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటు చేయించారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఆవరణలోనూ అరకు స్టాల్ ను ఏర్పాటు చేయించిన చంద్రబాబు… తాజాగా పార్లమెంటులోనూ అరకు కాఫీని అందుబాటులోకి తీసుకువచ్చారు.

This post was last modified on March 24, 2025 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago