వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు.. నకిలీవని, ఆయన పదో తరగతి కూడా పాస్ కాలేదని.. విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, తమ్మినేని బావమరిది కూన రవి కుమార్.. ఈ విషయంపై పట్టుబట్టారు. దీంతో వైసీపీ హయాంలోనే ఆయనపై డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించి భారీ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
పైగా.. ఆయన ఊరూ పేరు లేని సంస్థ నుంచి డాక్టరేట్ కూడా చేస్తున్నట్టు చెబుతున్నారని అప్పట్లోనే కూన విమర్శించారు. ఈ విమర్శలను వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. తాజాగా ఈ వ్యవహారాన్ని వెలికి తీశారు. మరోసారి ప్రభుత్వానికి కూన ఈ విషయంపై విన్నపాలు సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి అబద్ధాలు ఆడిప్రజలను మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై విచారణకు ఆదేశించాలని కూన ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తమ్మినేని విద్యార్హతలు, ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు.. వంటివాటిని పరిశీలించనుంది. అదేవిధంగా ఆయన చదివిన పాఠశాల, పదోతరగతి, ఇంటర్లో ఆయనకు వచ్చిన మార్కులు, అలానే ఏ కాలేజీ నుంచి ఆయన డిగ్రీ చేశారు. ఆయనకు ఏ సంస్థ డాక్టరేట్ చేసే అవకాశం ఇచ్చిందన్న అంశాలపై కూపీ లాగనున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 15 రోజుల్లోనే విజిలెన్స్ అధికారులు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం.. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు.. తమ్మినేని ఇప్పటికీ.. తాను డాక్టరేట్ చేస్తున్నానని.. ఎవరైనా విచారించుకోవచ్చని చెబుతున్నారు.
This post was last modified on March 24, 2025 3:00 pm
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…